breaking news
bribery charge
-
మరీ ఇంత అలసత్వమా? 44 ఏళ్ల తర్వాత క్లీన్ చిట్
మన దేశంలో కొన్ని కేసులు ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతూనే ఉంటాయి. కింద కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా..పైకోర్టులో సవాలు వేయడంతో కొన్నేళ్లుగా ఆ కేసులు ఓ కొలిక్కి రాకుండా ఉండిపోతాయి. ఈ క్రమంలో క్లయింట్లు చనిపోతే ఇక ఆ కేసు కోసం సంబంధిత బాధితులు ఏళ్లుగా నిరీక్షించి పోరాడితే గానీ న్యాయం జరగదు. ఈ పెండింగ్ కేసులు దేశం మొత్తంగా చాలానే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..40 ఏళ్ల నాటి లంచం కేసు.. బాధితుడి చనిపోయిన కొన్నేళ్లకు క్లీన్ చీట్ లభించడం విశేషం. అత్యున్నత న్యాయస్థానం అతడి గౌరవాన్ని పునరుద్ధరించి.. పెన్షన్తో సహా తత్సంబంధిత ద్రవ్యప్రయోజనాలను చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా అదేశించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..దాదార్ నాగ్పూర ఎక్స్ప్రెస్లో టీటీఈగా పనిచేసిన వీఎం సౌదాగర్ 1988లో ప్రయాణికుల నుంచి రూ. 50ల లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. శాఖపరమైన విచారణ అనంతరం 1996లో సర్వీస్ నుంచి తొలగించారు. ప్రస్తుతం సదరు బాధితుడు బతికి లేకపోయినప్పటికీ..అతడి కుటుంబసభ్యులు న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. నిజానికి ట్రిబ్యూనల్ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టులో సవాలు వేయండంతో..ఆ తీర్పు నిలిచిపోయింది. అప్పటి నుంచి ఆ కేసు..అలా పెండింగ్లోనే ఉండిపోయింది. గత సోమవారం అత్యున్నత న్యాయస్థానం సదరు బాధితులకు ఊరట లభించేలా చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బాధితుడిపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అతడి గౌరవాన్ని పునరుద్ధరించి పెన్షన్తో సహా అన్ని ద్రవ్య ప్రయోజనాలను మూడు నెలల్లోపు అతని చట్టపరమైన వారసులకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ వివాదం ఎలా వచ్చిందంటే..ఈ వివాదం మే 31, 1988 నాటిది. సౌదాగర్ ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ. 50 డిమాండ్ చేశాడని, వారిలో ఒకరికి ఛార్జీలో బ్యాలెన్స్లో రూ.18 తిరిగి ఇవ్వలేదని రైల్వే విజిలెన్స్ బృందం ఆరోపించింది. దీని ఆధారంగా డిపార్ట్మెంట్ విచారణ ప్రారంభించి..ఎనిమిదేళ్ల తర్వాత 1996లో సౌదాగర్ను సర్వీస్ నుంచి తొలగించారు. అయితే ఈ కేసులో కచ్చితమైన ఆధారాలు లేవని, విజిలెన్స్ బృందం గట్టి సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమైంది. ప్రయాణికుల సాక్ష్యాలు లంచం తీసుకున్నారనే ఆరోపణకు మద్దతు ఇవ్వలేదు. అంతేగాదు ముగ్గురు ప్రయాణికుల్లో ఇద్దరు ఆయన ఎలాంటి డబ్బులు కోరలేదని, మిగతా కోచ్లను కూడా పర్యవేక్షించాక, రసీదు జారీ చేసి, మిగిలిన ఛార్జీని తిరిగి ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దీంతో2002లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) కేసును పరిశీలించి, సౌదాగర్ను తిరిగి నియమించాలని భారత రైల్వేలను ఆదేశించింది. అలాగే అధికారులు సమర్పించిన ఆధారాలేవి అతని తొలగింపుని సమర్థించలేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే నాటి ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి బదులు..బాంబే హైకోర్టులో ట్రిబ్యునల్ ఉత్తర్వుని సవాలు చేయండంతో కోర్టు తీర్పుని నిలిపివేసింది. దాంతో అతని నియమకానికి అన్ని విధాలుగా తలుపులు మూసుకుపోయాయి. కానీ అతడి కుటుంబం ఆశ వదులు కోలేదు, ఎప్పటికైన న్యాయం లభిస్తుందని పోరాటం కొనసాగించింది. చివరికి 44 ఏళ్ల తర్వాత ఉపశమనం..దశాబ్దాల నాటి కేసుని సమీక్షించిన ధర్మాసనం సౌదాగర్పై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని తేల్చింది. విచారణ అధికారి విషయాలను వక్రీకరించారని, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంది సుప్రీం కోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సర్వీస్ ఇచ్చిన తీర్పు సరైనదేనని, విచారణ అధికారి చెబుతున్న ఆధారాలు సాక్ష్యుల మాటలతో ఏకభవించలేదని, అందువల్ల తొలగింపు శిక్షను రద్దు చేసే హక్కు ట్రిబ్యునల్కి ఉందని హైకోర్టు గుర్తించడంలో విఫలమైందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదీగాక ఎలాంటి అధారాలు లేకుండా ఒక చనిపోయిన వ్యక్తి పేరు అవినీతి ఆరోపణలతో కళంకితమైందని మండిపడింది. అందువల్ల ఆయన గౌరవాన్ని పునరుద్ధరించేలా ఇలా సుప్రీం కోర్టు ఆయనకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏదీఏమైనా ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఉపశమనం లభించడం బాధకరం. చనిపోయేంత వరకు ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కేసుల్లోని అలసత్వం..బాధితులు చనిపోయేంత వరకు న్యాయం లభించకపోవడం అనేది గమనార్హం, బాధకరం కూడా.(చదవండి: చెత్త వేశారో.. మీచెంతకే 'రిటర్న్ గిఫ్ట్'! స్ట్రాంగ్ క్లీనింగ్ పాఠం) -
కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు నడుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మీద ఈడీ దాడులు జరుపుతుండగా.. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు కూడా కేంద్రధీటుగా బదులిస్తున్నాయి. తాజాగా కేసు నమోదు వ్యవహారంలో ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లంచం తీసుకుంటుండగా రాష్ట్ర ఏసీబీ (అవినీతి వ్యతిరేక సంస్థ) అధికారులు అరెస్టు చేశారు. ఓ చిట్ ఫండ్కు సంబంధించిన ఓ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఇద్దరు ఈడీ అధికారులు రూ.15 లక్షల లంచం తీసుకున్నారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వీరిద్దరూ ఆధారాలతో సహా పట్టుబడ్డారని తెలిపారు. విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ను ఈడీ అక్టోబర్ 30న తొమ్మిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. రాజకీయ కక్షతోనే కేంద్రం ఈడీ దాడులు జరిపిస్తోందని ఆరోపించింది. బీజేపీ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసాన్ని కోల్పోయాయని సీఎం గహ్లోత్ అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఈడీ అధికారులను అరెస్టు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. Rajasthan ACB has arrested an ED official for taking a bribe of ₹15 lakhs. Modi thought he could scare Ashok Gehlot and Congress…😀 pic.twitter.com/AT9ZAyONF3 — Shantanu (@shaandelhite) November 2, 2023 రాజస్థాన్లో నవంబర్ 25న ఎన్నికల జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని దూకుడుగా ఉంది. అటు.. ఈసారి తప్పకుండా అధికారం తమదేనని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే.. నేడు ఈడీ అధికారుల ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ ఈడీ సమన్లను వెనక్కి తీసుకోవాలని ప్రత్యుత్తరం రాస్తూ ఈడీ ముందు హాజరుకాలేదు. ఇదీ చదవండి: మూడు బ్యాగులతో ఎథిక్స్ కమిటీ ముందు హాజరైన మహువా మెయిత్రా -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటీసు
జైపూర్ : బీజేపీలో చేరితే తనకు 35 కోట్ల రూపాయలు అందచేస్తానని ప్రలోభాలకు గురిచేశారని తిరుగుబాటు నేత సచిన్ పైలట్పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు రెబెల్ నేత షాక్ ఇచ్చారు. తనపై ముడుపుల ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్కు పైలట్ బుధవారం లీగల్ నోటీసులు పంపారు. తమ నేతపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్కు నోటీసులు జారీ చేశారని పైలట్ వర్గీయులు నిర్ధారించారు. కాగా పైలట్ తనతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారేందుకు మీకు ఎంత మొత్తం కావాలని అడిగారని, 35 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారని గిరిరాజ్ సింగ్ మంగళవారం తిరుగుబాటునేతపై ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బేరసారాలు సాగుతున్నాయని..తాను ఇలాంటి పనికి పాల్పడలేనని వారికి చెప్పానని..రెండు మూడు సార్లు పైలట్తోనూ మాట్లాడానని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపణలను సచిన్ పైలట్ తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలని, తన ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ను ఉపముఖ్యమంత్రితో పాటు, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు పైలట్ సహా 18 మంది ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయస్ధానంలో విచారణ జరుగుతోంది. కాగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పైలట్ బీజేపీతో కలిసి కుట్రపన్నారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తుండగా బీజేపీతో కలిసేదిలేదని పైలట్ స్పష్టం చేస్తున్నారు. చదవండి : సచిన్ పైలట్ వర్గానికి 24 వరకు ఊరట -
రూ.50 కేసు 28 ఏళ్లకు తేలింది!
అహ్మదాబాద్ : ఓ వ్యక్తికి తన అపరాధం ఒప్పుకోవడానికి దాదాపు 28 ఏళ్లు పట్టింది. సురేంద్రనగర్కు చెందిన మన్షుక్లాల్ దేవ్రాజ్ అనేవ్యక్తి 1988లో ఓ పేద కుటుంబం నుంచి రూ.50 లంచం తీసుకున్నాడు. అది ఒప్పుకోవడానికి మాత్రం తటపటాయించాడు. ఒకటా రెండా ఏకంగా 28 ఏళ్ల దాకా సతాయించాడు. చివరికి గుజరాత్ కోర్టులో తన తప్పును ఒప్పుకున్నాడు. అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం దేవరాజ్కి ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ఇదే కేసులో దేవరాజ్ సీనియర్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్స్పెక్టర్ భాంజీభాయ్ గోవాభాయ్ కూడా నిందితుడే. అయితే అతను మరణించడంతో భాంజీభాయ్పై ఫిర్యాదును హైకోర్టు పక్కనపెట్టింది. 25 ఏళ్ల తర్వాత దేవ్రాజ్ అప్పీల్ను విచారించింది. హైకోర్టులో ఈ కేసు డాక్యుమెంట్లు లేకపోవడంతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న పేపర్బుక్ రికార్డుల బట్టి ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతి వారికి సబ్సిడీ కింద రుణాలు ఇప్పించడాన్ని ఓ సంస్థకు బాధ్యతలు అప్పటించారు. ఆ సంస్థ తరుఫున దేవ్రాజ్ టీమ్ క్రెడిట్ కార్యకలాపాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బాధ్యత వహిస్తున్నారు. ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్న ఓ పేద కుటుంబానికి రుణాన్ని పెంచడానికి దేవ్రాజ్ రూ.50 డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆ కుటుంబం అవినీతి నిరోధక బ్యూరోలో తెలపడంతో దేవ్రాజ్పై కేసు నమోదైంది. దేవ్రాజ్ను నిర్దోషిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యారని జస్టిస్ ఎస్జీ షా తెలిపారు. ప్రాసిక్యూషన్ మూడు కోర్టులోనూ దేవ్రాజ్ లంచం డిమాండ్ చేయలేదని నిరూపించలేకపోయారు. కానీ లంచానికి అడిగినమొత్తాన్ని అడ్డం పెట్టుకుని దేవ్రాజ్ న్యాయవాది ఈ కేసుపై పోరాటం చేశారు. కానీ వారి ఆలోచనలకు బిన్నంగా కోర్టు అవినీతి కేసులో శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.


