breaking news
Brazilian President
-
ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం 30 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: రాబోయే ఐదేళ్లలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 30 బిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్, బ్రెజిల్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అరుదైన ఖనిజాల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికొచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు తదితర కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్–బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్లపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్, బ్రెజిల్ దేశాలది ఒకేమాట అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద పోషకులు మానవాళికి అతిపెద్ద శత్రువులు అని తేల్చిచెప్పారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు పరిష్కారం కావాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరం అని పునరుద్ఘాటించారు. సంస్కరణలకు భారత్, బ్రెజిల్ మద్దతిస్తున్నాయని తెలిపారు. లూలా డా సిల్వాతో భేటీ అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లాటిన్ అమెరికాలో భారత్కు బ్రెజిల్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని గుర్తుచేశారు. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు చేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం అంటే కేవలం అంకెలు కాదని.. విశ్వాసానికి ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. భారత్, బ్రెజిల్ మధ్య మొత్తం తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరుపక్షాలూ లాభపడే భాగస్వామ్యం భారత్, బ్రెజిల్ మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత్ నుంచి బ్రెజిల్కు ఎగుమతుల విలువ 6.77 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 5.43 బిలియన్ డాలర్లు. అరుదైన ఖనిజాల విషయంలో సహకారానికి బ్రెజిల్తో ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ వెల్లడించారు. సుస్థిరమైన సప్లై చైన్స్ నిర్మించడానికి ఇదొక కీలకమైన చర్యగా అభివరి్ణంచారు. డిజిటల్ భాగస్వామ్యంపై భారత్, బ్రెజిల్ ఒక ఉమ్మడి డిక్లరేషన్ను ఆమోదించాయి. మైనింగ్, ఎంఎస్ఎంఈ, ఆరోగ్య సంరక్షణ, సంప్రదాయ విజ్ఞానంపై ఒక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రక్షణ రంగంలో భారత్–బ్రెజిల్ భాగస్వామ్యం కొనసాగుతూనే ఉంటుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక సహకారానికి ఇదొక గొప్ప ప్రతీక అని వెల్లడించారు. ఇరుపక్షాలూ లాభపడే భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. భారత్–బ్రెజిల్ ఒక్కటైతే గ్లోబల్ సౌత్ గొంతుక మరింత బలం పుంజుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశాలుగా కలిసికట్టుగా పనిచేస్తూ గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఏ సమస్యనైనా సరే చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద దాడులను లూలా డా సిల్వా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క మతంతో గానీ, జాతితో గానీ ముడిపెట్టొద్దని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ పరిణామాలు అందోళన కలిగిస్తున్నాయని, ఈ తరుణంలో భారత్–బ్రెజిల్ మధ్య సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెరగాలని స్పష్టంచేశారు. గ్లోబల్ సౌత్లో భారత్, బ్రెజిల్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని తెలిపారు. రెండు దేశాలు డిజిటల్ సూపర్ పవర్గా, పునరుత్పాదక ఇంధన రంగంలో సూపర్ పవర్గా మారాయని వెల్లడించారు. సంఘర్షణ కొనసాగుతున్న తరుణంలో సుస్థిరాభివృద్ధి, శాంతి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. 20వ శతాబ్దపు టైప్రైటర్లపై 21వ శతాబ్దపు సాఫ్ట్వేర్ను నడిపించలేమంటూ గత ఏడాది బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సిల్వా గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అత్యంత కీలకమని చెప్పారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్, బ్రెజిల్కు సహజంగానే హక్కు ఉందని స్పష్టంచేశారు. గ్లోబల్ సౌత్ గొంతుకు బలంగా వినిపించాలంటే రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు. -
డీ-డాలరైజేషన్ ఊహాగానాలకు బ్రెజిల్ చెక్
అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యం, బ్రిక్స్ కూటమి సొంత కరెన్సీపై జరుగుతున్న సుదీర్ఘ చర్చకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తెరదించారు. సరైన అవగాహన లేకపోవడంతోనే డీ-డాలరైజేషన్పై ప్రచారం జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలపై వ్యాఖ్యలు చేశారు.బ్రిక్స్ కరెన్సీపై స్పష్టతబ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తున్నాయనే వార్తలను లూలా డా సిల్వా పూర్తిగా కొట్టిపారేశారు. కొత్త కరెన్సీని సృష్టించాలనే ప్రతిపాదన గానీ, ఆ దిశగా చర్చలు గానీ బ్రిక్స్లో జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాత్రికి రాత్రే మారదన్నారు. డాలర్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ అని అంగీకరించారు. ఇతర కరెన్సీల ఎదుగుదలను అమెరికా సహజంగానే ప్రతిఘటిస్తుందని చెప్పారు. ఆ వాస్తవాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం.. డాలర్ వ్యతిరేకత కాదుడాలర్ వినియోగాన్ని తగ్గించడం అంటే అది అమెరికాపై కక్ష కట్టడం కాదని, దేశాలకు మరిన్ని వ్యాపార ఎంపికలు చూపడమేనని లూలా వివరించారు. భారత్, బ్రెజిల్ మధ్య వాణిజ్యం కేవలం డాలర్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక కరెన్సీల (రూపాయి-రియల్) వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ ప్రయత్నించడం అవసరమని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం -
నేటి నుంచే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు
న్యూఢిల్లీ: విద్యుత్ ఆవిష్కరణ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు కారణమవుతున్న కృత్రిమ మేధ సాంకేతికతపై కూలంకషమైన చర్చకు దేశ రాజధానిలోని భారత్ మండపం సిద్ధమైంది. సోమవారం నుంచి 20వ తేదీ దాకా ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సాయంత్రం ఐదింటికి సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో పాల్గొనేందుకు 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఐదు రోజుల్లో 700కుపైగా సెషన్స్ నిర్వహించనున్నారు. 20 దేశాల అధినేతలు సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. మోదీ ఆహా్వనం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా తదితరులు రానున్నారు. సురక్షిత కృత్రిమ మేధ, ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా భద్రత, ఏఐలో భారత్ స్వయంసమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై నిపుణులు, విధాన కర్తలు చర్చించనున్నారు. కీలక సంస్థ సీఈఓల ప్రసంగాలు దక్షిణార్థ గోళంలో జరుగుతున్న తొలి ఏఐ సదస్సు కావడంతో దీనిపై అందరి దృష్టీ నెలకొంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్, డీప్మైండ్ టెక్నాలజీస్ సీఈఓ డెమిస్ హస్సాబీస్, ఆంత్రోపిక్ సీఈఓ డేరియో ఆమోడెయి, మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ వంటి దిగ్గజాలు సైతం సదస్సులో ప్రసంగించనున్నారు. సదస్సుతోపాటు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో–2026ను కూడా నిర్వహిస్తున్నారు. ఎక్స్పోను సందర్శించాక ప్రధాని మోదీ దిగ్గజ సంస్థల సీఈఓలతో భేటీ అయ్యే అవకాశముంది.భారత్లోని ఏఐ అంకుర సంస్థలు తమ నూతన ఆవిష్కరణలను సదస్సు వేదికగా ప్రకటించే ఆస్కారముంది. ప్రజారోగ్యం, వ్యవసాయం, ఆర్థిక, విద్య, కార్పొరేట్ రంగాల్లో రాబోతున్న మార్పులకు ఏఐ ఏవిధంగా ఇతోధికంగా దోహదపడుతుందో వక్తలు వివరించనున్నారు. 2025లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2024లో దక్షిణకొరియాలోని సియోల్లో, 2023లో బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోనే అతి పెద్ద డిజటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థల్లో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో నిర్వహిస్తున్నారు. ‘‘ఈ రంగంలో ఎంతటి మార్పులొచ్చినా మానవీయ, సమ్మిళిత కోణంలోనే అవి జరగాలనే సందేశం విని్పస్తున్నాం. ఏఐ వనరులు ప్రజాస్వామ్యయుతంగా అందరికీ అందుబాటులో ఉండాలి’’ కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ చెప్పారు. ఏఐ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు ఇక్కడి యువతలో ఏఐ పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా మోదీ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ ఏఐ రంగ సంస్థలు, పరిశోధకులు, స్టార్టప్లు, విద్యార్థులు, పౌరులు ఇందులో పాల్గొననున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యధిక యువకారి్మకశక్తి భారత్లోనే ఉంది. ఇక్కడ జనాభాలో 65 శాతం మంది వయసు 35 ఏళ్లలోపే. ఈ యువతరంలో ఏఐపై అనురక్తిని పెంచి ఏఐ బాటలు పయనించేలా చేస్తే ఈ రంగంలో భారత్ ఎన్నెన్నో అద్భుతాలు చేయగలదని, ఇక్కడ ఏఐ ఆధారిత పరిశ్రమలు పెరిగి, ఆవిష్కరణలు ఎక్కువై, డిజిటల్ సేవలు విస్తరించి, ఉపాధి అవకాశాలు భారీ స్థాయిలో పెరుగుతాయి’’ అని ఏఐరంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సదస్సులో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ కొత్త ఏఐ ఉత్పత్తులపై సదస్సు వేదికగా ప్రకటనలు చేయొచ్చని చెబుతున్నారు.భారతీయ ఏఐపైనే దృష్టి ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐపైనే అందరి దృష్టీ నెలకొననుంది. ఫౌండేషన్ మోడల్ పిల్లర్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీతో ఇప్పటికే 12 భారతీయ అంకురసంస్థలు భేటీ అయ్యాయి. ఇండియన్ లాంగ్వేజ్ ఫౌండేషన్ మోడల్, మల్టీ లింగ్వల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం), స్పీచ్–టు–టెక్ట్స్, టెక్ట్స్,్ట–టు–ఆడియో, టెక్ట్స్,–టు–వీడియో, ఇ–కామర్స్ కోసం జనరేటివ్ ఏఐతో త్రిమితీయ సమాచారం, మార్కెటింగ్, వ్యక్తిగత సమాచార సృష్టి, ఇంజనీరింగ్ సిములేషన్, మెటీరియల్ రీసెర్చ్, అధునాతన అనలైటిక్స్, ఆరోగ్యరంగంలో వ్యాధుల నిర్ధారణ, వైద్య పరిశోధన ఇలా పలు రంగాల్లో అంకుర సంస్థలు తమ కొత్త పరిశోధనలను ఇంపాక్ట్ ఎక్స్పో2026లో ప్రదర్శించే ఆస్కారముంది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎక్స్పోలో 600కుపైగా కీలక స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఆ్రస్టేలియా, జపాన్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఇస్తోనియా, తజకిస్తాన్, ఆఫ్రికా పెవీలియన్లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. డేటా కేంద్రంగా మార్చండి‘‘ఇన్నాళ్లూ అప్లికేషన్లు, ప్లాట్ఫా మ్లు, డివైజ్ల రంగంలో అభివృద్ధి పైనే దృష్టిపెట్టాం. అంతకంటే ముఖ్యంగా మరో ప్రాథమిక రంగంలోనూ ఆధిపత్యం కనబర్చాల్సి ఉంది. అదే డేటా సెంటర్ల ఏర్పాటు. ఇకనైనా డిజిటల్ మౌలికవసతులు, కృత్రిమ మేధారంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చుకుందాం. ఈ మేరకు ప్రపంచ సమాచార స్టోరేజీకి భారత్ను కేంద్రంగా మార్చండి. దీంతో సాంకేతిక విప్లవంతో మరో సంస్కరణల తరంగాలను సృష్టించండి. ఈ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే తాజా బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాం. సదుపాయాల కల్పన ఖర్చులను తగ్గించాం. తద్వారా డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను అంతర్జాతీయ ప్రధాన పోటీదారుగా మార్చండి’’ అని మోదీ అన్నారు.సరైన వేదిక భారత్: గుటెరస్ ‘‘అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ఇలాంటి భారత్ ఈ సదస్సుకు సరైన వేదిక. సూపర్పవర్ లాంటి రెండు శక్తివంతమైన దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఏఐ ఫలాలు దక్కొద్దు. యావత్ ప్రపంచదేశాలూ ఏఐ ప్రయోజనాలను పొందాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్న భారత్కు అభినందనలు. ఏఐ స్వతహాగా వృద్ధిచెందితే అది అందరి ఉపయోగకరమే’’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. -
బొల్సొనారోకు 27 ఏళ్ల జైలు
బ్రెసీలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించింది. 2022లో ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్వహించిన జాతీయ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, దేశంలో సైనిక తిరుగుబాటుకు కుట్ర చేశారని, ఎన్నికల్లో తనపై గెలిచిన అధ్యక్ష అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు కుట్ర చేశారని బొల్సొనారోపై మోపిన అభియోగాల్లో ఆయనను సుప్రీంకోర్టు శుక్రవారం దోషిగా తేలి్చంది. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు జడ్జీలు బొల్సొనారోను దోషిగా తీర్పు చెప్పగా, ఒకరు ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. జైలు శిక్షతోపాటు బొల్సొనారో 2060 సంవత్సరం వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయరాదని కోర్టు నిషేధం విధించింది. అంటే ఆయన శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా మరో 8 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేయటానికి అవకాశం ఉండదు. 2022 నాటి ఎన్నికల్లో బొల్సొనారోపై వామపక్ష కూటమి అభ్యరి్థ, ప్రస్తుత అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డసిల్వా విజయం సాధించారు. ఆ ఎన్నికల ఫలితాలను ఒప్పుకునేందుకు బొల్సొనారో తిరస్కరించటంతో రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2023 జనవరి 8న బొల్సొనారో మద్దతుదారులు దేశవ్యాప్తంగా హింసాత్మక దాడులకు దిగారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బొల్సొనారోపై దర్యాప్తు చేపట్టింది. కొద్దిరోజుల క్రితమే ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. తనపై మోపిన అభియోగాలను బొల్సొనారో తిరస్కరించారు. తాను ఎలాంటి తప్పులు చేయలేదని ప్రకటించారు. తన తండ్రిపై మోపిన కేసులు రాజకీయ ప్రతీకారంలో భాగమని బొల్సొనారో చిన్నకుమారుడు, బ్రెజిల్ సెనేటర్ ఫ్లావియో బొల్సొనారో ఆరోపించారు. కోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామని బొల్సొనారో తరఫు న్యాయవాదులు తెలిపారు. కాగా, బొల్సొనారోకు జైలు శిక్ష విధించటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. కోర్టు తీర్పు అన్యాయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. దీనిపై అమెరికా తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు. బ్రెజిల్పై అమెరికా ఇప్పటికే 50 శాతం ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. -
భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి. -
దేశాధ్యక్షుడికి దెయ్యాల భయం!
రియో డి జెనిరో : బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్కు దెయ్యాల భయం పట్టుకుంది. దీంతో వెంటనే తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి దేశ ఉపాధ్యక్షుడి అధికార నివాసంలోకి మారారు. అధ్యక్ష భవనంలో అడుగు పెట్టినప్పటి నుంచి కంటి నిండా నిద్రలేకుండా పోయిందని, ఆ భవంతి ఎంత విలాసవంతంగా ఉన్నా అందులో అసాధారణమైనవి ఏమో ఉన్నట్టు మైఖేల్ టెమర్ పేర్కొన్నారు. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయేమో అని అనుమానం వ్యక్తం చేశారు. బ్రెజిల్ అధ్యక్షుడి అధికార నివాసమైన అల్వొరాడా ప్యాలెస్ భయానకంగా ఉండటంతో అక్కడి నుంచి దేశ ఉపాధ్యక్షుడి భవనమైన జబురు ప్యాలెస్కు మకాం మార్చారు. తన భార్య మార్సెలా కూడా అధ్యక్షభవంతి వింతగా అనిపిస్తోందని తెలిపినట్టు టెమర్ పేర్కొన్నారు. దిల్మారౌసెఫ్ రోసెఫ్ సస్పెండ్ అయిన తర్వాత మైఖేల్ టెమర్ బ్రెజిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
గోవాకు చేరిన బ్రెజిల్ ప్రెసిడెంట్ మైకెల్


