-
కమనీయం.. గణనాథుని కల్యాణం
యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్ స్వామి, సుబ్బారావు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు. -
విశ్వకర్మ నిర్మించిన ఆలయం ఇప్పటికీ తిరుమలలో ఉందా ...?
-
నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.40 లక్షల బడ్జెట్తో వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బాలాలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో ముస్తాబు చేస్తున్నారు. రామాయణం మహాభారతం, భాగవతం, చతుర్వేద పారాయణాలు పఠించడానికి సుమారు 50 మంది రుత్విక్కులను ఆహ్వానించారు. హనుమంత, గజ, గరుడ, కల్పవృక్షం వంటి వివిధ వాహనాలను సేవలకు సిద్ధం చేశారు. ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా రోజూ 1,000 మందికి, ముఖ్యమైన మూడు రోజుల్లో 1,500 మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండపై ప్రత్యేక క్యూౖ లెన్లు, వికలాంగులకు, వీఐపీలకు, సామాన్య భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. - శనివారం ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంకాలం 6:30 మృత్సంగ్రహణం, అంకురార్పణం - 18 ఉదయం : 11 గంటలకు ధ్వజారోహణం, సాయంకాలం 6:00 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం - 19 ఉదయం 11 గంటలకు మత్య్సావతార అలంకార సేవ, వేద పారాయణాలు ప్రారంభం, రాత్రి 9:00 శేష వాహన సేవ - 20 ఉదయం 11 గంటలకు శ్రీ కృష్ణాలంకారం, రాత్రి 9 గంటలకు హంస వాహనసేవ - 21 ఉదయం 11 గంటలకు వటపత్ర శాయి అలంకారసేవ, రాత్రి 9:00 గంటలకు పొన్న వాహనసేవ - 22 ఉదయం 11గంటలకు గోవర్ధన గిరిధారి అలంకారసేవ, రాత్రి 9:00 సింహ వాహనసేవ - 23 ఉదయం 11గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9:00 గంటలకు అశ్వవాహన సేవ, బాలాలయంలో స్వామి, అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవం - 24 ఉదయం 10 గంటలకు శ్రీ రామాలంకారం సేవ, హనుమంత సేవ, 11గంటలకు గజ వాహన సేవ బాలాలయంలో తిరుకల్యాణం, రాత్రి 8 గంటలకు భక్తుల సౌకర్యార్థం కొండకింద హైస్కూల్ మైదానంలో స్వామి, అమ్మవారి వారి కల్యాణం - 25 ఉదయం మహావిష్ణు అలంకారం సేవ, గరుడవాహన సేవ, బాలాలయంలో రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు విమాన రథోత్సవం, కొండ కింద 8 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి దివ్యవిమాన రథోత్సవం ప్రచార రథం ఊరేగింపు ఉంటుంది. - 26 ఉదయం 10:30 గంటలకు మహా పూర్ణాహుతి, శ్రీ చక్ర తీర్థస్నానం, సాయంత్రం 6:00 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం - 27 ఉదయం 10:00 గంటలకు శ్రీ స్వామివారి అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఉత్సవాల సమాప్తి. -
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13 నుండి 21 వరకు వార్షిక, అక్టోబర్ 10 నుండి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెండు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రెండు బ్రహ్మోత్సవాలెందుకు? వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ∙సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసంవల్ల ప్రతీ మూడేళ్లకోసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయం. -
24 నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనున్నాయి. 24న అంకురార్పణ, 26న స్వామివారి ఎదుర్కోలు, 27న తిరుకల్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం ఉంటాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రంగులు, సున్నాలు, చలువ పందిళ్లు వేస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత ఈ నెల 31న చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నామని ఈవో వెల్లడించారు. ఆలయాన్ని ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేస్తున్నట్లు చెప్పారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement