breaking news
bomb tension
-
ఎయిరిండియా, ఇండిగో సహా.. 70కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికల బెడద ఎక్కువైంది. గురువారం దేశంలోని 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. ఎయిరిండియా,విస్తారా,ఇండిగోలకు చెందిన 20 విమానాలకు, ఆకాశ ఎయిర్కి చెందిన 14 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. దీంతో 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.తాజా, బాంబు బెదిరింపులపై ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘గురువారం సైతం తమ సంస్థకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అకాశ ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. భద్రత..నియంత్రణ అధికారులతో సంప్రదింపులు జరిపాం. స్థానిక అధికారులతో సమన్వయంతో అన్ని భద్రత పరమైన విధానాలను అనుసరిస్తున్నాము’ అని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
విమానాశ్రయంలో 'బాంబు' కలకలం!
లండన్: లండన్లోని గేట్విక్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేగింది. శనివారం అనుమానిత ప్యాకేజీ కనిపించడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. గేట్విక్ విమానాశ్రయం నార్త్ టెర్మినల్ నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టెర్మినాల్ను ఖాళీ చేసి.. ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారిస్ నగరంలో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో గేట్విక్ విమానాశ్రయంలో అనుమానిత వస్తువు కనిపించడంతో కలకలం రేగింది.