breaking news
black box not found
-
బ్లాక్బాక్సు లేని 40 ఏళ్ల విమానం
న్యూఢిల్లీ: జార్ఖండ్లో ఏడుగురి మృతికి కారణమైన 40 ఏళ్ల నాటి బీచ్క్రాఫ్ట్ సీ90ఏ విమానంలో బ్లాక్బాక్సు (కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లు) లేదని డీజీసీఏ వెల్లడించింది. దానికి చివరిసారిగా 1987లో అర్హత సరి్టఫికెట్ జారీ చేసినట్లు పేర్కొంది. రెడ్బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన బీచ్క్రాఫ్ట్ సీ90ఏను ఎయిర్ అంబులెన్స్గా ఉపయోగిస్తున్నారు. ఈ నెల 23న జార్ఖండ్ నుంచి ఢిల్లీకి అత్యవసరంగా బయలుదేరగా మధ్యలోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానాన్ని 1987లో తయారు చేసినట్లు గుర్తించారు. అర్హత సమీక్ష సర్టిఫికెట్ వచ్చే ఏడాది జనవరి 20దాకా చెల్లుబాటు అవుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, విమానంలో బ్లాక్బాక్సు లేకపోవడం దర్యాప్తునకు అవరోధంగా మారింది. విమానానికి సంబంధించిన కీలక సమాచారం అందుబాటు లేకుండాపోయింది. నిబంధనల ప్రకారం.. 5,700 కిలోల కంటే బరువు ఉన్న విమానంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ కచ్చితంగా ఉండాలి. ప్రమాదానికి గురైన విమానం బరువు 4,583 కిలోలుగా తేల్చారు. విమానంలో లోపాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు స్పష్టంచేశాయి. -
ఎయిర్ ఏషియా: బ్లాక్ బాక్స్ ఏమైంది?
బోలెడన్ని నౌకలు, లెక్కలేనన్ని విమానాలు, హెలికాప్టర్లతో ఎయిర్ ఏషియా విమానం కోసం గాలింపు జరుగుతోంది. ఆదివారంనాడు అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 85014 సముద్రంలోనే కూలిపోయిందన్న విషయం మంగళవారమే ఖరారైంది. కష్టమ్మీద ఇప్పటికి మూడు మృతదేహాలను వెలికితీశారు. అయితే.. ఇప్పటికీ విమాన శకలాలు పూర్తిస్థాయిలో లభ్యం కాలేదు. అలాగే విమానం బ్లాక్ బాక్స్ కూడా ఇంతవరకు దొరకలేదు. మరోవైపు వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో గాలింపు చర్యలకు పదే పదే ఆటంకం కలుగుతోంది. బోర్నియో తీరంలో పలు మృతదేహాలతో పాటు విమనా శకలాలు కూడా సముద్రంలో తేలుతున్నట్లు గాలింపు చర్యల్లో గుర్తించారు. కానీ అలలు 2-3 మీటర్ల ఎత్తున వస్తుండటం, గాలులు కూడా తీవ్రంగానే ఉండటంతో డైవర్లు కనీసం ఆ ప్రాంతంలోకి వెళ్లే పరిస్థితి కూడా కనిపించడంలేదు. కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానంలో మొత్తం 162 మంది ఉండగా.. కేవలం ముగ్గురి మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. వాతవరణం అనుకూలిస్తే.. డైవర్లు వెంటనే రంగంలోకి దిగి మిగిలిన మృతదేహాలను తీస్తారని తెలుస్తోంది.


