birthday video
-
గ్యాంగ్స్టర్ను బుక్ చేసిన బర్త్డే వీడియో
న్యూఢిల్లీ: అర డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉండి.. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ గ్యాంగ్స్టర్ని బర్త్ డే వీడియో పట్టించింది. ఆ వివరాలు.. ప్రతీక్ ఛబ్రా అనే వ్యక్తి చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ.. గ్యాంగ్స్టర్గా మారాడు. అతడిపై అత్యాచారం, గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో 2012లో ఓ బిల్డర్ను రూ. లక్ష ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు గురి చేశాడు ఛబ్రా. కానీ ఆ బిల్డర్ డబ్బు చెల్లించడానికి ఒప్పకోకపోవడంతో ఛబ్రా తన గ్యాంగ్తో కలిసి రోడ్డు మీదే అతడిపై దాడి చేశాడు. దాంతో సదరు బిల్డర్, ఛబ్రా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే కాక ఛబ్రా మీద మరి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. గత రెండుమూడేళ్లుగా ఢిల్లీ పోలీసులు ఛబ్రా కోసం గాలిస్తున్నారు. కానీ ఫలితం లేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఛబ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో అతడిని పట్టించింది. వారం రోజుల క్రితం ఛబ్రా తన అనుచరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. అందులో భాగంగా తుపాకీతో కేక్ కట్ చేసి.. హల్చల్ చేశాడు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు ఛబ్రా గురించి, అతడి గ్యాంగ్లో ఉండే సభ్యులకు సంబంధించిన క్లూస్ను ఈ వీడియో ఆధారంగా సంపాదించారు. దాని ప్రకారం అతడిని పట్టుకునేందుకు వల పన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పోలీసులు ఛబ్రాతో పాటు నిఖిల్ చౌహాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. -
కోహ్లీని.. ఓ ఆట ఆడుకున్నారు!
-
ఉదయం ప్రియురాలితో.. రాత్రి టీమిండియాతో!
టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. శనివారం విరాట్ సరిగ్గా 28 వసంతాలు పూర్తిచేసుకుని 29వ వసంతంలోకి ప్రవేశించాడు. అయితే ఆ రోజు కోహ్లీ ముందుగా తన ప్రియురాలు అనుష్కతో కలిసి జాలీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. గత కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్నారన్న వదంతులకు కోహ్లీ, అనుష్క జంట మరోసారి చెక్ పెట్టింది. శనివారం సాయంత్రం టీమిండియా సమయక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను మొదలుపెట్టాడు. టీమిండియా అధికారిక ఫేస్ బుక్ లో నిన్న రాత్రి పోస్ట్ చేసిన కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 11 గంటల వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. భారత క్రికెటర్ల మధ్య విరాట్ శనివారం రాత్రి కేక్ కట్ చేశాడు. కోచ్ అనిల్ కుంబ్లే, కోహ్లకి మొదట బర్త్ డ్ విషెస్ చెప్పి కేక్ తినిపించాడు. కోహ్లీ మాత్రం డాన్స్ చేస్తూ హుషారుగా కేక్ కట్ చేస్తుండగా అసలు రచ్చ మొదలైంది. ఉమేశ్ యాదవ్ కోహ్లీకి కేక్ రాయడం స్టార్ట్ చేయగా, ఆ వెంటనే అశ్విన్, అజింక్యా రహానే, హార్దిక్ పాండ్యా సహా జట్టు ఆటగాళ్లు బర్త్ డే బాయ్ కోహ్లీని కేక్ తో ఓ ఆట ఆడుకున్నారు. కోహ్లీ ముఖం, తల భాగం మొత్తం కేక్ తో రుద్ది చిన్న పిల్లల తరహాలో పుట్టినరోజును ఎంజాయ్ చేశారు. -
కోహ్లీని.. ఓ ఆట ఆడుకున్నారు !