-
మన నిధులు మనకు రావాల్సిందే : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలో సమీక్ష చేపట్టారు సీఎం జగన్. రేపు(మంగళవారం) కేంద్ర హెంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అక్కడ చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే. రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగింది: విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అప్పుల్లో 58శాతం ఏపీకి, 42 శాతం తెలంగాణకు కేటాయించారు కాని రెవిన్యూ పరంగా 58 శాతం తెలంగాణకు, 42 శాతం ఏపీకి వచ్చింది పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరంకు నిధుల రాకలో సమస్యలున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాలేదు మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలు ఇచ్చారు హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్ధల పరంగా ఇలా అన్నిరకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం దీనివల్ల రాష్ట్రానికి రెవిన్యూ రూపంలో చాలా నష్టపోయాం దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు హామీలు ఇచ్చింది విభజన చట్టంలో ఉన్న ఈ స్ఫూర్తి ఇప్పుడు అమల్లోకూడా కనిపించాల్సిన అవసరం ఉంది ఇవి నెరవేరితే రాష్ట్రంలో పలు వసతులు సమకూరుతాయి తద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి రెవిన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది రాష్ట్రం పురోగమిస్తేనే దేశంకూడా పురోగమిస్తుంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంది అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పలు రోడ్లు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని కోరుతున్నాం కచ్చితంగా ఇది వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణంపై కేంద్రం హామీ ఇచ్చింది వీటన్నింటికోసం దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి కడపలో స్టీల్ప్లాంట్పై కేంద్రం హామీ ఇచ్చింది స్టీల్ ప్లాంటుకు సమీప ప్రాంతంలో ఎన్ఎండీసీ నుంచి గనుల కేటాయింపు చేయాలి దీంతో ప్రతిపాదిత ఫ్యాక్టరీ నిర్మాణానికి మార్గం సులభతరం అవుతుంది విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం హై స్టీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం – వయా కర్నూలు మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి దీనివల్ల మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి విశాఖ రైల్వే జోన్అంశంపై కూడా దృష్టిపెట్టాలి వైజాగ్, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తానన్నారు విశాఖపట్నంలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు తీవ్ర ఇబ్బంది వస్తోంది దీంతో ఎయిర్ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది ప్రస్తుతం భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మిస్తున్నారు ఈ ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది విశాఖ సిటీనుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి భోగాపురం ఎయిర్ పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది విజయవాడ లాంటి ఎయిర్ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది విశాఖ మెట్రో రైలు అంశాన్నికూడా కొలిక్కి తీసుకురావాలన్న సీఎం ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40 శాతం కేంద్రం భరించేలా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్న సీఎం రెండు రాష్ట్రల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్లో ఉంది దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి -
ఏపీ విభజన కేసు విచారణ 18కి వాయిదా!
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, తెలంగాణ వికాస కేంద్ర తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు ఇవాళ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నల ధర్మాసనం ముందుకొచ్చింది. మధ్యాహ్నా భోజన విరామ సమయానికి ముందు ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్ఫూజ్ నజ్కీ ఈ పిటిషన్లు విచారించాలని న్యాయమూర్తుల్ని కోరారు. ఇటీవలే రాజధాని కేసు విచారణ వాయిదా అంశాన్ని గుర్తు చేసిన జస్టిస్ కేఎం జోసెఫ్.. ఈ పిటిషన్లు కూడా అవేనా అని ఆరా తీశారు. రెండు అంశాలకు సంబంధం లేదని వేర్వేరు పిటిషన్లుగా ఇప్పటికే వేరు చేసి జాబితా చేశారని నజ్కీ వివరించారు. భోజన విరామ అనంతరం కేసుల విచారణలో భాగంగా విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. సాయంత్రం కోర్టు సమయం ముగిసేనాటికి పిటిషన్లు బెంచ్ మీదకు రాకపోవడంతో ఉండవల్లి అరుణ్కుమార్ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ పిటిషన్లు వచ్చే మంగళవారం విచారిస్తామని, ఆ మేరకు విచారణ జాబితా చేర్చాలని జస్టిస్ కేఎం జోసెఫ్ రిజిస్ట్రీని ఆదేశించారు. -
షెడ్యూల్ 9, 10 సంస్థలపై పిటిషన్.. కేంద్రం, టీఎస్కు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. పిటిషన్లో భాగంగా ఏపీ ప్రభుత్వం.. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా ఉండగా.. దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొంది. లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంస్థల విభజన ఆలస్యం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement