bhainsa Market Committee
-
నామినేటెడ్ జాతర
► 18 ఏఎంసీలకు ఏడుగురు చైర్మన్ల నియామకం ► పెరుగుతున్న ఆశావహులు ► చైర్మన్ సీటుపై గురి ► ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ఒత్తిడి భైంసా : జిల్లాలో నామినేటెడ్ పోస్టుల సందడి షురువైంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం.. మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పది నియోజకవర్గాల్లో 17 మార్కెట్ కమిటీలు ఉండేవి. ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మార్కెట్కమిటీ కొత్తగా ఏర్పడడంతో ఈ సంఖ్య 18కి చేరింది. మార్కెట్ కమిటీ పదవుల్లోనూ ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించారు. తొమ్మిది నెలలుగా మార్కెట్కమిటీ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏడు మార్కెట్ కమిటీల నియామకాలు జరుగడంతో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎలాగైన ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకునేలా ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఏడింట నియామకం... ఖానాపూర్ నియోజకవర్గపరిధిలోని జన్నారం మార్కెట్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా జల్లా అక్కపెల్లిని నియమించారు. ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నల్ల శ్రీనివాస్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కొమ్ముల చిన్నదేవేందర్రెడ్డి, సారంగాపూర్ రాజ్మహ్మద్, జైనథ్ టాక్రే వనిత, ఆసిఫాబాద్కు శ్రీనివాస్, కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా తూము లక్ష్మిలను నియమించారు. ఖానాపూర్లో త్వరలోనే మంత్రుల సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కమిటీల్లో డెరైక్టర్లను కూడా ఎన్నుకున్నారు. భర్తీకానివి.. ముథోల్ నియోజకవర్గంలోని భైంసా, బోథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, జైనూరు, కాగజ్నగర్, మంచిర్యాల, లక్షెటిపేట్, బెల్లంపల్లి, చెన్నూరు మార్కెట్కమిటీలు నియామకం జరగలేదు. ఈ కమిటీల్లో మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్చైర్మన్లు, డెరైక్టర్ల పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ పదవులను దక్కించుకునేందుకు నేతలంతా ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పెరుగుతున్న ఆశావహులు.. మిగిలిన 12 మార్కెట్ కమిటీల్లో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల అనుచరులు, ఉద్యమకారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా అంతటా ఆశావహులు పెరుగుతున్నారు. ఎమ్మెల్యేల వద్ద అనుచరగణంతో వెళ్లి ఏఎంసీ చైర్మన్ పదవులు ఇప్పించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో మార్కెట్ కమిటీకి ఐదు, ఆరుగురు నాయకులు పోటీపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులంతా ఈ పీఠంపైనే కన్నువేశారు. ఆశలు పెట్టుకున్న నేతలంతా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటీల పదవుల భర్తీ ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకమని తెలుసుకుని ఒత్తిడి పెంచుతున్నారు. పోటీ తీవ్రమైంది... ఇన్నాళ్లు వేచిచూసిన పదవులు భర్తీ కానుండడంతో పోటీ తీవ్రమవుతోంది. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు నేతలంతా మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో భైంసా మార్కెట్ కమిటీ ఆదాయంలో ఈ యేడు మొదటిస్థానంలో నిలిచింది. ఆదాయంలో ముందంజలో ఉన్న భైంసా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలను దక్కించుకునేందుకు నాయకులు ఆశగా ఉన్నారు. మార్కెట్కమిటీల నియామకంపై పెరుగుతున్న ఒత్తిళ్లతో ఎవరిపేరును ప్రతిపాదించాలో అనే విషయంలోనూ నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు ఎటూతేల్చుకోలేకపోతున్నారు. తమ వద్దకు వచ్చిన వారిని బుజ్జగించే ప్రయత్నంలోనే కనిపిస్తున్నారు. మరోవైపు ఈ పదవుల కోసం పేర్లను తేల్చడంలోనూ ఆలస్యం కావడంతో ద్వితీయశ్రేణి నాయకులు సైతం నిరాశలో కనిపిస్తున్నారు. -
మన నిధులు సిద్దిపేటకు..
భైంసా : జిల్లాలో రెండో స్థానం.. ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం.. అయినా కనీస సౌకర్యాలు మాత్రం కానరావు. ఇదీ భైం సా మార్కెట్ కమిటీ దుస్థితి. గతేడాది పత్తి కొనుగోళ్లతో భైంసా మార్కెట్ క మిటీ ఆదాయం రూ.5.50కోట్లు దాటిం ది. ప్రస్తుతం మొత్తం ఆదాయం రూ. 12.50 కోట్లు ఉంది. ఈ ఆదాయంతో మార్కెట్ కమిటీలో ఎన్నో పనులు చేపట్టవచ్చు. కానీ.. మార్కెట్ ఆధునికీకరణ కోసం పాలకులు ఏ పనులూ చేయడంలేదు. భైంసా మార్కెట్ కమిటీకి స్థలం లేదన్న సాకుతో ఉన్నతాధికారులు ఇక్కడి ఆదాయాన్ని ఇతర మార్కెట్ కమిటీలకు తరలిస్తున్నారు. ఫలితంగా ఏటా ఈ ప్రాంత రైతులకు కష్టాలు తప్పడంలేదు. సిద్దిపేటకు... భైంసా మార్కెట్ కమిటీకి ఉన్న ఆదాయంలో నుంచి రూ.8 కోట్లను సిద్దిపేట మార్కెట్ కమిటీకి రుణం రూ పేణా తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇచ్చి న రుణానికి 8 శాతం వడ్డీతో కలిపి 10 కిస్తీల్లో చెల్లిస్తామని ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిపాదనలు వచ్చాక ఇక్కడి ఆదాయం సిద్దిపేటకు తరలడం ఖాయమే. మార్కెట్ కమిటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తే రూ.8 కోట్లు తరలిపోవడమే. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భైంసా మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు వెచ్చిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏటా పత్తి సీజన్లో భైంసా డివిజన్ పత్తి రైతాంగం ఎన్నో ఇబ్బందులు పడుతోంది. పట్టింపులేదు.. భైంసా మార్కెట్లో పత్తి కొనుగోళ్లు జిల్లాలోనే రెండో స్థానంలో ఉంటే ఇక్కడి సౌకర్యాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. ఇరుకైన యార్డులోనే కొనుగోళ్లు నిర్వహించడంతో పత్తి సీజన్లో బండ్లన్నీ ప్రధాన రోడ్లకు ఇరువైపులా నిలిచి ఉంటాయి. రోడ్లపై నిలిచిన ఈ వాహనాల తో ప్రమాదాలు కూడా జరిగాయి. కొత్త యార్డు కోసం స్థలం సేకరిస్తున్నామంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగే భైంసాకు 50ఎకరాల స్థలంలో అన్ని వసతులతో మార్కెట్ యా ర్డును నిర్మించవచ్చు. భైంసాలో పత్తి కొనుగోళ్లే తప్ప ఇతర పంటలు విక్రయించేందుకు రైతులు ఇబ్బం దులు పడుతున్నారు. సోయాబీన్, మిరప, మినుములు, కందులు విక్రయించేందుకు యార్డు లేదు. మహారాష్ట్రకు తరలింపు.. సౌకర్యాలలేమితో పత్తి సీజన్లో రోజుల తరబడి నిరీ క్షించలేక ఈ ప్రాంత రైతులు సరిహద్దు మహారాష్ట్రలో ని ధర్మాబాద్, బోకర్ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫలి తంగా భైంసా ఏఎంసీకి వచ్చే ఆదాయం మహారాష్ట్ర కు తరలిపోతోంది. రోజుల తరబడి అద్దె వాహనాల కు డబ్బులు చెల్లించలేక రోడ్లపై నిరీక్షించలేక పత్తి రైతులు ఈ నిర్ణయానికి వచ్చారు. గతేడాది 70 శాతం పత్తి రైతులు మహారాష్ట్రకు వెళ్లి పత్తిని విక్రయించారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరుగుతున్నా ఈ యార్డు లో వంద మంది రైతులైనా సేదదీరే పరిస్థితి లేదు. రైతుల కోసం ఎక్కడ పెద్ద మొత్తంలో సౌకర్యాలతో విశ్రాంతి భవనాలు నిర్మించలేదు. పత్తి రైతులకే పరేషాన్ ఉన్న భైంసా యార్డులో ఇతర పంటల కొనుగోళ్లు ఇంత వరకు జరుగలేదు. విక్రయించేందుకు ఈ నిజామాబాద్, మహారాష్ట్రలకు వెళ్తున్నారు. గోదాంలు లేవు... ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలోనే పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. గత రెండు, మూడేళ్ల క్రితం భైంసాలో సీసీఐ, నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పత్తి కొనుగో ళ్లు చేపట్టింది. ఆ సమయంలో పత్తి బేళ్లు నిల్వ ఉం చేందుకు సరిపడా గోదాంలు కూడా ఇక్కడ లేవు. 20 నుంచి 30 వేల పత్తి బేళ్లను నిల్వ చేసేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, బోధన్, రుద్రూర్, హైదరాబా ద్ గోదాంలకు తరలించారు. వంద పత్తి బేళ్లు తరలిం చేందుకే రూ.20వేల మేర ఖర్చు చేశారు. ఈ ఖర్చం తా ప్రభుత్వంపైనే పడుతుంది. వంద బేళ్లకే రూ.20 వేలు వెచ్చిస్తే వేలల్లో తరలించిన బేళ్లకు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది. ఇదే మా ర్కెట్లో అన్ని సౌకర్యాలతో గోదాంలు నిర్మించి ఉం టే పత్తి బేళ్లు ఇక్కడే నిల్వ చేసే అవకాశం ఉండేది. గో దాంతోపాటు రైతుల కోసం విశ్రాంతి భవనాలు, భైం సా, నిర్మల్ ప్రధాన రహదారిపై మార్కెట్ యార్డు ని ర్మిస్తే రవాణా పరంగా ఇబ్బందులుండవు. ఇప్పటికై నా అధికారులు తేరుకుని భైంసా మార్కెట్ కమిటీలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని ఇక్కడే వెచ్చించాలి. ప్రతిపాదనలు వచ్చాయి - అజ్మీరరాజు, ఏఎంసీ సెక్రటరీ సిద్దిపేట మార్కెట్ కమిటీ అధికారులు రూ.8 కోట్లు అవసరం అని ప్రతిపాదించారు. కమిషనర్ ఆదేశాల కు అనుగుణంగా నడుచుకుంటాం. భైంసా మార్కెట్ కమిటీ ఇరుకుగా ఉంది. నూతనంగా యార్డు నిర్మాణానికి స్థల సేకరణలో ఉన్నాం. స్థలం దొరికితే ప్రైవేట్లోనైనా తీసుకునే విషయంపై ఆలోచిస్తాం.