breaking news
bethamcharla
-
అదరగొడుతున్న బేతంచెర్ల చిన్నారి.. బింబిసారలో శార్వరిగా
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): చిన్న వయస్సులోనే బుల్లి తెరతోపాటు వెండి తెరపై రాణిస్తూ ప్రతిభ చాటుకుంటోంది బేతంచెర్లకు చెందిన శ్రీదేవి. సీరియల్స్, సినిమాల్లో చక్కన నటన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 10 సినిమాలు, 15 టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులో తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తోంది. ఈటీవీలో ప్రారంభమైన యమలీల తరువాత సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె కావడం గమనార్హం. శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమలో స్థిరపడి కంజుల ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్గా పనిచేస్తున్నాడు. పలు సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి. ఈ చిన్నారి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. నటించే అవకాశం ఇలా.. శ్రీహరి గౌడ్ 18 సంవత్సరాలుగా సినీరంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. జీ తెలుగు వారు పున్నాగ టీవీ సిరియల్స్ తీస్తున్న నేపథ్యంలో చిన్నారి పాత్ర అవసరం ఉండటంతో తన కూతురు శ్రీదేవిని వారికి పరిచయం చేశాడు. మొదట పున్నాగ సిరియల్స్లో కథానాయకుల కుమార్తెగా, కథనాయికల కుమార్తెగా నటించే అవకాశం దక్కింది. కెమెరా ముందు ఎలాంటి బెరుకు, తడబాటు లేకుండా ఆయా సన్నివేశాల్లో చక్కగా నటించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఆ సీరియల్లో నటిస్తుండగానే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కళ్యాణ వైభోగం ఇలా 15 టీవీ సీరియల్స్లో నటించే ఆఫర్స్ వచ్చాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రీదేవి బాలనటిగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న సరికొత్త ధారావాహిక యమలీల, ఆ తరువాత బాలనటిగా పలు పాత్రలను పోషిస్తోంది. సీరియల్స్లోనే కాకుండా సీని రంగంలోనూ నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో బాలనటిగా నటించింది. కథనాయిక పాయల్ రాజ్పుత్ చిన్నప్పటి పాత్రలో శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత సూపర్మచ్చి సినిమాలో రాజేంద్రప్రసాద్ కుమార్తెగా రాణించింది. అడవి శేషు నటించిన మేజర్, రవితేజ నటించిన రామారావు అన్డ్యూటీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో శార్వరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా చిత్రాల్లో బాలనటిగా రాణిస్తూ సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోది. మరికొన్నింట్లో అవకాశం శ్రీదేవి నటన, అభినయానికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటివరకు నటించిన సినిమాలు, సీరియల్స్ కాకుండా మరికొన్నింటిలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో శ్రీదేవి నటించనున్నట్లు తండ్రి శ్రీహరి గౌడ్ తెలిపారు. సినిమా రంగంతో పాటు టీవీ ప్రకటనల్లోనూ నటిస్తూ బేతంచెర్ల కీర్తి ప్రతిష్ఠలు చాటుతోంది. -
పెళ్లికి కూతురు ఒప్పుకోవడం లేదంటూ..లెటర్ రాసి..
సాక్షి, బేతంచెర్ల(కర్నూలు) : కూతురు పెళ్లికి ఒప్పుకోవడంలేదనే మనస్తాపంతో తల్లి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండల కేంద్రంలోని ముద్దవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి భార్య రమణమ్మ(46) రెండవ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మికి వివాహం కాగా, చిన్న కుమార్తె భార్గవికి ఇటివలే రహిమానుపురం గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి కుదిరింది. అయితే తనకు ఈ సంబంధం ఇష్టం లేదని కూతురు చెప్పడంతో మాట ఇచ్చామని, ఎలాగైనా వివాహం చేసుకోవాలని కోరింది. అయినా వినకపోవడంతో ఆదివారం ఉదయం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నమైనా ఇంటికి రాకపోవడంతో కూతురు అంగన్వాడీ కేంద్రం వద్దకు వచ్చి చూడగా తల్లి ఉరి వేలాడుతుండటంతో గుండెలు బాదుకుంది. మృతురాలి చేతిలో ఉన్న సూసైడ్నోట్లో ‘అయామ్ స్వారీ భార్గవీ, నీకు ఇష్టం లేనిపని ఏమి నేను చెయ్య లేను. అలాగని చేయిదాటిపోయినందుకు నాకు నేనే బాధపడుతున్నాను. నీకు మంచి తల్లిని కాలేక పోయా, సో అయామ్ సారీ, నాకు ఇక ఏమార్గం కన్పించలేదు’ అని రాసి సంతకం చేసి ఉంది. వీఆర్వో వెంకట్రావు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృత దేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. -
ఉచిత ఆపరేషన్.. భారీగా పెన్షన్
సాక్షి, బేతంచర్ల: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగింస్తూ.. ఆరోగ్యశ్రీని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థను మారుస్తామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేస్తామని హామీయిచ్చారు. 104, 108 సేవలను మెరుగు పరుస్తామని హామీయిచ్చారు. 108కి ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేట్టు చేస్తామన్నారు. ‘ఏ ఆపరేషన్ అయినా ఉచితంగా చేయిస్తా. చిరునవ్వుతో ఇంటికి పంపిస్తా. మూగ, చెవుడు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. కేన్సర్, గుండె, న్యూరో సమస్యలకు కూడా ఉచితం ఆపరేషన్లు చేయిస్తాం. కిడ్నీ రీప్లేస్మెంట్కు ఉచితంగా ఆపరేషన్లు చేయించడంతో పాటు శస్త్రచికిత్స సమయంలో అవసరమైతే కొంత డబ్బు ఇచ్చి బాధితులను ఆదుకుంటాం. కిడ్నీ రోగులకు అన్నిరకాలు తోడుగా ఉంటాం. వారికి నెలకు రూ. 10 వేలు పెన్షన్గా ఇస్తాం. 104 ద్వారా అన్నిరకాల మందులు ఇస్తాం. మీ అమూల్యమైన సూచనలు, సలహాలతో రెండుమూడు పేజీల్లో మేనిఫెస్టో తీసుకొచ్చి అందులోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామ’ని వైఎస్ జగన్ భరోసాయిచ్చారు. భ్రష్టు పట్టిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను మారుస్తాం -
అలాంటి వ్యక్తిని పొరపాటున కూడా ఎన్నుకోకూడదు: వైఎస్ జగన్
సాక్షి, బేతంచర్ల (కర్నూలు జిల్లా): ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఈ నాలుగేళ్లలో ఎన్నో దారుణాలు, మోసాలు చేస్తూ.. అబద్ధాలు చెప్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, ఇలాంటి వ్యక్తిని మళ్లీ పొరపాటున కూడా ఎన్నుకోవద్దని, ఒకవేళ ఎన్నుకుంటే విశ్వసనీయత అనే పదానికి అర్థం, రాజకీయ వ్యవస్థకు విలువ ఉండవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. వ్యవస్థకు విశ్వసనీయత తీసుకురావాలి ‘ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థ మారకపోతే అవహేళనకు గురవుతుంది. పదవుల కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ప్రజలను ఇలాగే మోసం చేస్తూ ఉంటారు. దీనికి వ్యతిరేకంగా వ్యవస్థలో చైతన్యం రావాలి. చంద్రబాబు లాంటి వ్యక్తులను వదిలేస్తే.. మళ్లీ అధికారం కోసం రేప్పొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం, ప్రతి ఇంటికి మారుతి కారు కొనిస్తానని నమ్మబలుకుతాడు. ఇలాంటి వ్యక్తులను, మోసాలను వ్యవస్థ నుంచి తరిమేయాలి. విశ్వసనీయతకు అర్థం తీసుకురావాలి’అని పేర్కొన్నారు. బేతంచర్ల.. హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజు కొన్నివేలమంది నాతో పాటు అడుగులో అడుగువేస్తూ.. ఇవాళ బేతంచర్ల మీటింగ్లో పాలుపంచుకుంటున్నారు. ఈ తీక్షణమైన ఏండలో నిలుచుని ఉండాల్సిన అవసరం ఏ ఒక్కరికీ లేదు అయినా తీక్షణమైన ఎండను సైతం లెక్కచేయకుండా, నడిరోడ్డు అని ఖాతరుచేయకుండా చిక్కటి చిరునవ్వుతో ప్రేమానురాగాలను, ఆప్యాయతలను పంచిపెడుతున్నారు మీ అందరి ఆత్మీయత అనురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో.. చంద్రబాబు పాలన మొదలై 4 ఏళ్లు కావొస్తుంది.. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తల సమావేశంలో బాబే చెప్పారు చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూసిన తర్వాత అడుగుతున్నాం మనకు ఎలాంటి నాయకుడు, ఎలాంటి ముఖ్యమంత్రి కావాలి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సినిమాల్లో హీరోనే నచ్చుతాడు.. అబద్ధాలు చెప్పే, మోసం చేసే, వెన్నుపొటు పొడిచే విలన్ నచ్చడు. 14 రీళ్ల సినిమాలో దాదాపు 13రీళ్లు హీరో కష్టాలు పడుతాడు. కానీ న్యాయంగానే ఉంటాడు. అటువంటి హీరో నచ్చుతాడు సినిమా తీసుకున్నా, మహాభారతం, రామాయణం, ఖూరాన్ తీసుకున్నా.. అంతిమంగా నిజాయితీగా, న్యాయంగా ఉన్న వ్యక్తే గెలుస్తాడు 13 రీళ్ల వరకు విలన్ చెలరేగుతూ.. పైచేయి సాధించినా. చివరి రీల్ క్లైమాక్స్లో మాత్రం హీరోను దేవుడు ఆశీర్వవదిస్తాడు. ప్రజలు తోడుగా ఉంటారు. హీరో విలన్ను పుట్బాల్ ఆడుకుంటాడు. ఈ విషయాలు గుర్తున్నాయా బాబూ..! ఎన్నికల్లో గెలిచేందుకు, ఓట్లు వేయించుకునేందుకు చంద్రబాబు ఆనాడు చెప్పిన విషయాలు గుర్తుచేసుకోవాలి ఆనాడు అన్న మాటలు ఏమిటి? ఇదే చంద్రబాబు ప్రతి పేదవాడికి మూడుసెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని అన్నాడు నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. ఇదే బాబు పాలనలో ఒక్క ఇళ్లన్న కట్టించాడా? లేదు ఇవాళ ఇళ్ల కోసం అర్జీలు పెట్టుకుంటూ ప్రజలు కాళ్లు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాథుడు లేడు నాన్నగారి సువర్ణ పాలనలో ఇదే డోన్ నియోజకవర్గంలో 30500 ఇళ్లు ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు నాలుగేళ్ల కిందట రేషన్ షాపులకు వెళితే.. బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమపిండి, కందిపప్పు, చింతపండు, పామాయిల్ దొరికేవి. ఇప్పుడు రేషన్ షాపులో ఒక్క బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లు చాలా తక్కువగా వచ్చేది. ఇవాళ నాలుగేళ్ల పాలనలో వెయ్యి, 500, 600 కరెంటు బిల్లు వస్తుందని ప్రజలను అడిగి తెలుసుకొని చెప్పారు కరెంటు బిల్లు తగ్గిస్తానని చంద్రబాబు మాట ఇచ్చి.. ఇవాళ మోసం చేశారు ఎన్నికల సమయంలో బాబు ఎవ్వరినీ వదిలిపెట్టలేదు జాబు రావాలంటే బాబు రావాలని అని చెప్పాడు జాబు రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ప్రతి ఇంటికీ చంద్రబాబు రూ. 90 వేల చొప్పున బాకీ ఉన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు రావాలన్నాడు బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా? రాలేదు బాబు అమలుచేసిన రుణమాఫీ పథకం రైతుల వడ్డీలకు కూడా సరిపోలేదు ఆడవాళ్లను మోసం చేయడానికి ఎవరైనా వెనుకాడతారు ఆడవాళ్ల కళ్లలో నీళ్లు చూడకూడదని భావిస్తారు. కానీ ఇదే చంద్రబాబు.. మీ పొదుపు రుణాలు పూర్తిగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా? కాలేదు ఇన్ని దారుణాలు, అబద్ధాలు, మోసాలు చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు మళ్లీ ఇలాంటి వ్యక్తిని పొరపాటున కూడా ఎన్నుకోకూడదు ఇవాళ డోన్ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? నియోజకవర్గంలో బేతంచర్లతోపాటు పలు ప్రాంతాల్లో నాపరాయి, కలర్ స్టోన్ పరిశ్రమలు చాలా ఉన్నాయి ఒక్కో నాపరాయి పాలిషింగ్ యూనిట్ పెడితే 25మందికి ఉద్యోగాలు వస్తాయి నాపరాయి పరిశ్రమలు పెట్టుకొని ఇక్కడ చాలామంది ఉపాధి పొందుతున్నారు బాబు అనాలోచిత పాలన వల్ల ఇక్కడి పరిశ్రమలు దెబ్బతింటున్నాయి బాబు సీఎం రాకముందే కరెంటు బిల్లు యూనిట్కు రూ. 3.75 ఉండేది యూనిట్కు నాలుగు రూపాయలు ఉన్న చార్జీలను దివంగత నేత వైఎస్సార్ హయాంలో రూ. 3.75 లకు తగ్గించారు. కానీ, బాబు సీఎం అయ్యాక యూనిట్ విద్యుత్ చార్జీని ఏకంగా ఎనిమిది రూపాయలకు పెంచారు ఇక ఏ రకంగా ఇక్కడి పరిశ్రమలు బతుకుతాయి? ఏ రకంగా ప్రజలు బతుకుతారు? సీవరేజ్ చార్జీలు రూ. 18 నుంచి రూ. 55కు పెంచాడు. రాయల్టీలను గణనీయంగా పెంచారు దీంతో ఇక్కడ ఉన్న ఐదారు వందల పాలిషింగ్ యూనిట్లలో సగం మూతపడే పరిస్థితి వచ్చింది నాపరాయి పరిశ్రమ ఆధరంగా ఇక్కడ ఉపాధి పొందుతున్న వాళ్లలో ఎక్కువమంది బీదవాళ్లు, ఎస్సీలు కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, పాలన, కారణంగా పరిశ్రమలు మూతపడి.. ఇక్కడ 20వేలమంది బీద కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది ఇక్కడి పరిశ్రమలను కాపాడుకోవడం తెలియని చంద్రబాబు మళ్లీ.. తాను సింగపూర్, జపాన్, చైనా నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తెస్తానంటూ బడాయి చెప్తున్నారు కొత్తవి కథ దేవుడి ఎరుగు ఉన్నవి మూతపడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు డోన్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం సాగు కూడా లేదు గ్రామాలకు తాగునీరు లేదు. నాన్నగారి పాలనలో డోన్ ప్రాంతానికి, డోన్ టౌన్కు నీళ్లు ఇవ్వాలని రూ. వంద కోట్లతో గాజులదిన్నె నుంచి పైప్లైన్ ద్వారా నీళ్లు ఇచ్చారు కేఈ కృష్ణమూర్తి ఇక్కడ ఎన్నోసార్లు గెలిచారు అవుకు నుంచి నీళ్లు పంపు చేసి ఈ ప్రాంతానికి ఇస్తానని కేఈ హామీ ఇచ్చాడు. కానీ ఆ పెద్దమనిషి ఇచ్చిన హామీని సైతం చంద్రబాబు పట్టించుకోవడం లేదు సాగుకు, తాగడానికి నీళ్లు లేక ఇక్కడ రైతులు, ప్రజలు అల్లాడుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడు చంద్రబాబు కూడా ఒక దళారి లక్షకుపైగా పెట్టుబడి పెట్టి ఉల్లి పంట పండిస్తున్నా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు దీంతో ఉల్లి పంటను చేనులోనే వదిలేసి.. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి రైతులకు చంద్రబాబు కల్పించారు ఈ ప్రాంతంలో టమోట పంట బాగా పండుతోంది. కానీ ఇంతవరకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేదంటే చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు శనగ, మినుము, మిర్చి, కంది.. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు దళారులు, హెరిటేజ్ సంస్థ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఆ తర్వాత ధర పెంచుకొని అమ్ముతున్నారు మినుముకు రైతులకు క్వింటాలుకు రెండువేలు ఇస్తే.. అదే హెరిటేజ్లో క్వింటాల్ పదివేలకు అమ్ముకుంటున్నారు చంద్రబాబు కూడా ఒక్క దళారి కావడం వల్లే రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు నష్టపోతున్నారు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటలు కొనుగోలుచేసి.. ఆ తర్వాత ఎక్కువ రేటుకు హేరిటేజ్ తమ దుకాణాల్లో అమ్ముకుంటోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది ఎలాంటి ఆపరేషన్నైనా ఉచితంగా వైద్యం చేయించి..చిరునవ్వుతో పంపిస్తాం -
రైలు నుంచి జారిపడ్డ చిన్నారి మృతి
కర్నూలు: కదులుతున్న రైల్లో నుంచి ఓ చిన్నారి జారి పడిన ఘటన కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో సోమవారం చోటుచేసుకుంది. రైలు అత్యవసర కిటికీ పక్కన కూర్చున్న లక్ష్మీ చేతిలోనుంచి ఏడాదిన్నర చిన్నారి చైతు జారి రైలు కిందపడింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు రైలు చైన్లాగి కిందకి వెళ్లి చూసేసరికి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరానికి చెందిన పైడిరాజు, లక్ష్మీ దంపతులు అమరావతి ఎక్స్ప్రెస్లో విజయనగరానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. చైతు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వర్షం రావాలని ప్రత్యేక పూజలు
బేతంచెర్ల (కర్నూలు జిల్లా): బేతంచర్ల మండల పరిధిలోని బైనపల్లె గ్రామంలో వర్షం కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహికంగా బోణాలతో వెల్లి గ్రామ దేవతలయిన సుంకులమ్మ,మారెమ్మ లతో పాటు, గంగమ్మకు అభిశేకం, కుంకమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులవుతున్నా వర్షం పడకపోవడంతో వరుణ దేవుని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించినట్లు గ్రామ పెద్దలు పేర్కొన్నారు.