breaking news
Barren
-
బీడు కొండలను పచ్చటి అడవిలా మార్చిన తాత..!
సమ్మర్ అనగానే నీటి కొరత, అధిక వేడితో సతమతమవుతుంటాయి పట్టణాలు, మెట్రో నగరాలు. చెట్లను పెంచడం, పచ్చదనం కాపాడుకోవడం వంటివి మాటలకే పరిమితం చేసి..సమస్యకు చెక్పెట్టేలా స్వచ్ఛందంగా ముందుకు ఎవ్వరురారు. కానీ ఓ మారుమూల గ్రామంలో ఓ తాత చూస్తుండగానే తన గ్రామం కొండ కోనలు బీడుగా మారిపోయాయి. అక్కడి ప్రజలు నీటి కోసం పడిగాపులు పడేవారు. ఇవన్నీ చూసిన ఓ తాత రోజు కొండలను ఎక్కి మరి చేసిన చిన్న ప్రయత్నం ఆ ఊరి రూపురేఖల్ని మాత్రమే కాదు, అక్కడి ప్రజల కష్టాలకు స్వస్తి పలికేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..ఆ వ్యక్తే ఇండేనిషియాకు చెందిన సదిమాన్. ఇండోనేషియా సెంట్రల్ జావా ప్రావిన్స్లో ఉన్న జెనెంగ్ గ్రామం కొన్నాళ్లు పొరిపరిస్థితులు, కాలానుగుణ నీటికొరతతో అల్లాడింది. ఏళ్ల తరబడి కలప నడికివేత, భూమిని చదును చేయడం, పదేపదే సంభవించిన అగ్ని ప్రమాదాలు వంటి వాటికారణంగా కొండ వాలులో అడవి విస్తీర్ణం తగ్గిపోయింది. దీనివల్ల నేలపొడిగా మారి బీడుగా అయిపోయింది. వేసవి కాలంలో స్థానిక ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోతుండేవారు. అక్కడ నీటి బుగ్గలు అదృశ్యం కావడానికి అడవుల నరికివేతే కారణమని సదిమాన్ గట్టిగా విశ్వసించాడు. చెట్ల విస్తీర్ణాన్ని పునరుద్ధరించడం వల్ల భూమి నెమ్మదిగా నీటిని తిరిగి నిలుపుకునే పునరుజ్జీవించేస్తుందనేది ఆ తాత నమ్మకం. 1990 టైంలో ఆయన గెండోల్ పర్వతం చుట్టు పక్కల ప్రాంతాల్లో బీడు కొండల అంతటా మర్రి, అత్తి చెట్లను నాటడం ప్రారంభించాడు. ఈ పని చేయడం ఆ తాత వయసు రీత్యా శారీరకంగా చాలా శ్రమతో కూడిన పని. కానీ ఆయన దీన్ని ఏళ్ల తరబడి నిరాటంకంగా కొనసాగించాడు. అతని కృషికి ఎలాంటి ఆర్థిక సహాయం గానీ, ప్రజా గుర్తింపు గానీ లభించకపోయినా..మొక్కలు నాటడం, పర్యవేక్షించడం అతని దినచర్యగా మారిపోయింది. పైగా అతడు చేస్తున్న పనికి గ్రామస్తుల నుంచి ఎగతాళి, విమర్శలు ఎదురయ్యేవి. అతడి ఆలోచన అస్సలు ఫలిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు. ఇలా మర్రి చెట్లను నాటడాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టి మరి బాధించేవారు ఆ తాతని. అయినా డోంట్ కేర్ అంటూ ఆ తాత కష్టపడి కొండ ఎక్కి మరి శ్రద్ధగా పర్యవేక్షించేవాడు. అందుకోసం తన వద్ద మేకలను అమ్మి మరి మొక్కలు కొనుగోలు చేసి మరి నాటేవాడట. అతడి కృషి ఫలించి నెమ్మదిగా కొండలన్నీ పచ్చగా మారడం ప్రారంభించాయి. కొండలు క్రమంగా ఎక్కువ తేమను నిలుపుకోవడం ప్రారంభించాయి. నేల కోత తగ్గింది, వృక్ష సంపద కూడా పెరిగింది. తద్వారా భూగర్భ జలాల పరిస్థితి కూడా మెరుగుపడింది. దాంతో సహజ నీటి బుగ్గలు కనిపించడం ప్రారంభించాయి. అంతేగాదు అక్కడ వ్యవసాయానికి, సమీప గ్రామాలకు నీటి కొరత తగ్గింది. వేసవి కాలంలో సైతం స్వచ్ఛమైన నీరు లభించింది. ఒకప్పుడూ నిస్సారంగా ఉన్న వాలు ప్రాంతాలన్నీ దట్టమైన పచ్చటి అడవులుగా మారాయి.ఆ చెట్లే ఎందుకంటే..మర్రి, అత్తి చెట్టు నేలను స్థిరీకరించడానికి, భూగర్భ జలాలను నిల్వ చేయడానికి సహాయపడతాయి. ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థలలో నీటి పరీవాహక ప్రాంతాల పునరుద్ధరణకు ఇవి అత్యంత ముఖ్యమైన జాతులని పర్యావరణ శాస్త్రవేత్తలు సదా చెబుతుంటారు కూడా.పెద్ద అత్తి చెట్లు ఏడాది పొడవునా పక్షులు, గబ్బిలాలు, ఇతర వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం కల్పించడం ద్వారా జీవవైవిధ్యానికి తోడ్పడతాయి. అందువల్లే వీటినే ఎంచుకున్నాడు సదిమాన్ తాత. ఆ తర్వాత కొద్దికాలంలో వార్తపత్రికలు, మీడియా ద్వారా అతడి స్టోరీ వ్యాపించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాదు..ఇండోనేషియన్లు ఆ తాతను ఈ పచ్చదనానికి ప్రతీకగా గౌరవించడం ప్రారంభించారు. అంతేగాదు ఈ తాత డబ్బు లేదా ఫేమస్ అవ్వడంలో పెద్ద గొప్ప ఉండదని, ఇతరులు ఇబ్బంది పడకుండా చూడటమే గొప్ప అని, అదే మనం వాళ్లకిచ్చే విలువైన బహుమతని అంటున్నాడు సదిమాన్.(చదవండి: సినిమా ఎంత పనిచేసింది..! మంచి జాబ్ లైఫ్ని వదులుకుని చివరికి..) -
అమ్మను కాలేనని..
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య ఐదేళ్లుగా మొక్కని దేవుడు.. చేయని పూజలు లేవు.. బిడ్డల కోసం పరితపించింది. ఏడాది క్రితం గర్భం నిలిస్తే.. పొంగిపోయింది. కానీ ఐదునెలలకే అబార్షన్ కావడంతో కుంగిపోయింది. అప్పటి నుంచి తాను తల్లిని కాలేనని, గొడ్రాలుగానే ఉండిపోవాల్సి వస్తుందని తరచూ బాధపడేది. ఈ క్రమంలో.. జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చౌడేపల్లె: పిల్లలు పుట్టలేదని కలత చెంది వివాహిత బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చౌడేపల్లె మండలంలోని పుదిపట్ల పంచాయతీ మిట్టూరు గ్రామంలో సోమవారం వెలుగులోకివచ్చింది. మృతురా లి తండ్రి సుబ్రమణ్యం కథనం మేరకు గంగవరం మండలం పాతూరు గ్రామానికి చెందిన బి.సుబ్రమణ్యం కుమార్తె ఎం. సుమతి(30)ని చౌడేపల్లె మండలం మిట్టూరుకు చెందిన పాపన్న కుమారుడు లోకేష్కు ఇచ్చి వివాహం చేశారు. వివాహమై ఐదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో సుమతి తీవ్రమనోవేదనకు గురైంది. ఈక్రమంలో ఏడాది క్రితం ఐదు నెల లు గర్భం నిలిచి ఆ తర్వాత అబార్షన్ అయ్యింది. గర్భసంచి చిన్నది కావడం వల్ల పిల్లలు పుట్టడం కష్టమని.. మందులు వాడమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే తనకు ఇకపై తనకు గర్భంరాదనే మనో వేదనతో తరచూ చనిపోతానని చెబుతుండేదని తండ్రి సుబ్రమణ్యం తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద సుమతి కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. సోమవా రం గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో సుమతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకొన్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


