breaking news
balst
-
పాక్లో పేలుడు.. 50మంది మృతి?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రాజధాని ఇస్లామాబాద్లో పేలుడు సంభవించి 50 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడుతో రాజధానిలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పాక్ ఆంగ్ల మీడియా డాన్ తెలిపింది.డాన్ మీడియా వివరాల ప్రకారం.. రాజధాని ఇస్లామాబాద్లో షహజాద్ టౌన్ ప్రాంత మజీద్లో రక్తం ఏరులై పారింది. పేలుడు దాటికి మజీద్లో 50మంది ప్రాణాలు కోల్పాయారు. 80మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతను బట్టి మృతులు,క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు.. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. మజీదులో పేలుడు ఘటనపై రంగంలోకి దిగిన బాంబు క్లూస్ టీం ఇది ఆత్మాహుతి దాడా? లేదంటే బాంబుల్ని అమర్చారా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇస్లామాబాద్లో పేలుడు ఘటన జరగడం రెండోసారి. అంతకుముందు నవంబర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12మందికిపైగా గాయపడ్డారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు, కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇరు వర్గాలు తీవ్రంగా గాయపడ్డాయి. -
పేలిన పెట్రోల్ బంక్.. ఎగసిపడిన మంటలు
సాక్షి, తూర్పుగోదావరి: బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పేలింది. పేలడు ధాటికి భారీ శబ్దం రావడంతో ప్రజలు భయబాంత్రులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. తొస్సిపూడి గ్రామంలోని ఇండియన్ బంక్ ప్రక్కన ఉన్న షెడ్డులో బాణాసంచా నిల్వ ఉంచారు. అనుకోకుండా బాణాసంచా పేలుడు సంభవించడంతో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ కూడా బ్లాస్టయింది. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో పెద్దగా జనసంచారం లేకపోవడంతో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనలో బంక్ ప్రక్కన వున్న గాయత్రి రైస్ మిల్ స్వల్పంగా ధ్వంసమైంది. బంక్ పేలుడుతో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల మూడు గ్రామాల్లోని ప్రజలు చెబుతున్నారు. -
కెమికల్ డబ్బాపేలి వ్యక్తి మృతి
నార్సింగ్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ పాత సామాన్ల దుకాణంలో ప్రమాదవశాత్తూ కెమికల్ డబ్బా పేలడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కుమార్(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: ఓ ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ పార్క్ కాలనీలో బుధవారం ఉదయం జరిగింది. రోడ్డు నంబర్ 7 లోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై స్టవ్ వెలిగించేందుకు ప్రయత్నించడంతో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.


