-
ఎన్నికల కమిషనర్గా వైదొలగిన అశోక్ లావాస
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా సెప్టెంబర్లో నూతన బాధ్యతలు చేపట్టనుండటంతో ఆయన ఎన్నికల కమిషనర్గా వైదొలిగారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పదవీవిరమణ చేయనుండటంతో తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా అశోక్ లావాస కీలక బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. అయితే పూర్తి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి వైదొలగిన రెండవ ఎన్నికల కమిషనర్గా అశోక్ లావాస నిలిచారు. ఏడీబీ వైస్ ప్రెసిడెంట్గా అశోక్ నియామకంపై గత వారం ప్రకటన వెలువడింది. ప్రైవేట్ రంగ కార్యకలాపాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలకు సంబంధించి అశోక్ లావాస ను ఉపాధ్యక్షుడిగా నియమించామని, ఆగస్ట్ 31న పదవీవిరమణ చేయనున్న దివాకర్ గుప్తా స్తానంలో ఆయన నూతన బాధ్యతలు చేపడతారని ఏడీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అశోక్ లావాస హరియాణ క్యాడర్కు చెందిన పదవీవిరమణ చేసిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2018 జనవరిలో ఆయన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. అశోక్ లావాస 2016 జూన్ నుంచి అక్టోబర్ 2017 వరకూ భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పర్యావరణ, పౌరవిమానయాన కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించారు. చదవండి : ఏడీబీ ఉపాధ్యక్షుడిగా అశోక్ లావాస -
ఏడీబీ ఉపాధ్యక్షుడిగా అశోక్ లావాస
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస(62) ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషనర్గా రెండేళ్ల పదవి కాలం మిగిలుండాగానే ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దానిని తిరస్కరించి ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో సుశీల్ చంద్రగత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ నియమావళిని ఉల్లఘించిన కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల పట్ల అశోక్ లావాస నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో ఆయన కుటుంబీకులపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని అశోక్ లావాస నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. -
అది ఎన్నికల కమిషనర్పై కక్షేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా భార్య నావెల్ సింఘాల్ లావాసా దాఖలు చేసిన పన్ను రిటర్న్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదాయం పన్ను శాఖ సోమవారం నాడు నోటీసులు జారీ చేయడం కొన్ని వర్గాల్లో అనుమానాలకు దారి తీసింది. పలు కంపెనీలకు డైరెక్టర్గా ఉన్నందున ఆమె చూపిన పన్ను రిటర్న్స్పై సహజంగానే అనుమానాలు రావచ్చు. పైగా నోటీసులు జారీ చేసినంత మాత్రాన అందుకున్న వాళ్లు అవినీతికి పాల్పడినట్లు అర్థమూ కాదు. ‘ర్యాండమ్’ తనిఖీల కింద ఆదాయం పన్ను శాఖ పలువురికి ఇలాంటి నోటీసులు జారీ చేయడం కూడా సర్వ సాధారణమే. అయితే అశోక్ లావాసా కుటుంబ సభ్యుల్లో ఆయన సోదరి శకుంతలా లావాసాకు, ఆయన కుమారుడు అభిర్ లావాసా వాటాదారుడిగా ఉన్న ఓ పుస్తకాల కంపెనీకి, అందులోనూ 2008 నుంచి 2010 మధ్య చోటు చేసుకున్న లావాదేవీలకు సంబంధించి ఆదాయం పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం సాధారణము కాదు, యాధశ్చికమూ అంతకంటే కాదు. మరి ఎందకు ఈ నోటీసులు జారీ అయినట్లు ? దీని వెనక కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, భార్య నావెల్ సింఘాల్ లావాసా గత లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో ఐదింటిలో మిగితా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇచ్చిన ‘క్లీన్చిట్’లను ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదనను లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్కు అందజేశారు. తన అభ్యంతరాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. తన డిమాండ్ను నెరవేర్చే వరకు ఆ తదుపరి ఎన్నికల కమిషన్ సమావేశాలకు హాజరుకానంటూ సవాల్ చేసి, హాజరుకాలేదు. అయినప్పటకీ ఆయన డిమాండ్ ‘సమాచార హక్కు’ పరిధిలోకి రాదంటూ మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు త్రోసిపుచ్చారు. లావాసా ఇప్పటికీ సిట్టింగ్ ఎన్నికల కమిషనర్ అవడం వల్ల అక్టోబర్లో జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాల్లోను బీజేపీయే అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ పట్ల పక్షపాత వైఖరిని కనబర్చకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలి. ఆదాయం పన్ను శాఖ లావాసా కుటుంబ సభ్యులకు జారీ చేసిన నోటీసులు సబబేనని, వారు అవినీతికి పాల్పడ్డారని సకాలంలో నిరూపించాలి. అలాకాని పక్షంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన పెద్దలు, నిష్పక్షపాతంగా పనిచేసిన అధికారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడినట్లే! అప్పుడు అది కచ్చితంగా ఎన్కికల కమిషన్ ‘అటానమి’ని దెబ్బతీయడమే అవుతుంది. -
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావసా కుటుంబానికి ఐటీ శాఖ ద్వారా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్య నోవల్ సింఘాల్. కమార్తె, కుమారుడి ఆదాయంపై ఐటీ విభాగం దృష్టి సారించింది. ఆదాయ లెక్కల్లో తేడా ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా అశోక్ లవాసా తనయుడు నిర్వహిస్తున్న నౌరిష్ ఫుడ్స్ ఖాతాలలో అవకతవకలపై దృష్టి సారించిన ఐటీ విభాగం ఈ నోటీసులిచ్చింది. వారి ఆదాయ, వ్యయాలను గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది. 2005 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన నుంచి నోవల్ సింఘాల్ లావాసా ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరించారు. అప్పటివరకు నోవాల్ రిటర్నులపై ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం భారీ తేడాను ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ, వ్యయాల్లో తేడాకు గల కారణాలపై ఇటీవల నోటీసులు కూడా జారీ అయ్యాయి. 2015 నుంచి 2017 వరకు వివిధ కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆదాయం కూడబెట్టారా అని ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. మరోవైపు దీనిపై నోవల్ సింఘాల్ స్పందించారు. తాను ఎలాంటి పన్నుల ఎగవేతకు, ఆదాయ అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. 28 సంవత్సరాల పాటుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లాస్ వన్ ఆఫీసర్గా పనిచేసిన తనకు బ్యాంకింగ్ సంబంధిత వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్గా సహా వివిధ వృత్తిపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 2019న అందుకున్న అన్ని ఐటీ నోటీసులకు తాను సమాధానం ఇచ్చాననీ, ప్రస్తుత ప్రక్రియకు కూడా సహకరిస్తున్నానని ఆమె వివరణ ఇచ్చారు. కాగా అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి అశోక్ గతేడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గత లోక్సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ చంద్రతో అశోక్ విభేదించిన సంగతి తెలిసిందే. -
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాస భార్య నావెల్ సింఘాల్కు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. ఎలక్షన్ కమిషనర్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పలు కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరించారు. ఆమె 2005లో ఎస్బీఐ నుంచి వైదొలిగింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన 11 నిర్ణయాల్లో లావాస తన అసమ్మతిని తెలియజేయగా కమిషన్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అసమ్మతిని రికార్డు చేయని ఈసీ సమావేశానికి అర్థంలేదని లావాస పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
సీఎం జగన్ వెంటే ఉంటాం ●
నగేష్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
గుత్తి కోటను సందర్శించిన ఎన్నికల పరిశీలకుడు
నయ వంచకుడు చంద్రబాబు
No Headline
జేసీకి భంగపాటు తప్పదు
పల్లె పిలిచింది
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement