-
Haryana Communal Clashes: 102 ఎఫ్ఐఆర్లు...200 మంది అరెస్ట్
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు. మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్స్టేషన్లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు. 250 గుడిసెలు కూల్చివేత టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్ఎస్వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు. -
అన్నా ఉద్యమాన్ని మోసం చేసి ‘ఆప్’ పుట్టింది: హర్యానా మంత్రి
హర్యానా: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 2011లో సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన అవినీతికి వ్యతిరేక ఉద్యమాన్ని మోసం చేశారని మండిపడ్డారు. అన్నా హజారే ఉద్యమన్ని మోసం చేయడం వల్లనే ఆప్ పుట్టిందని అన్నారు. ‘ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఆందోళనను మోసం చేయడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. పంజాబ్ ప్రజలు అటువంటి వారిని(ఆప్) ఎన్నుకున్నారు, భవిష్యత్తులో వారు తమ వాగ్దానాలను నెరవేర్చగలరో? లేదా విఫలమవుతారో? చూద్దాం’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి అనిల్ విజ్.. ఆప్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఢిల్లీ వీధుల్లో మద్యం అమ్మడంలో ప్రావీణ్యం సంపాదించిందని దుయ్యబట్టారు. అటువంటి పార్టీ పంజాబ్లో గెలవడం వల్ల ఆ రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ స్వస్థలం ఖతర్ కలన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన సంగతి విదితమే. -
‘‘ఆమె డీఎన్ఏ తేడా.. భారత్ ఓడిపోతే.. టపాసులు కాల్చింది’’
చండీగఢ్: టీ20 వరల్డ్ కప్లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ ఓటమి తర్వాత దేశంలో రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. టీమిండియా ఓటమితో బాధలో ఉన్న క్రీడాభిమానులు మన రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు చూసి.. తలలు పట్టుకుంటున్నారు. టీమిండియా ఓటమి అనంతరం పలువురు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వారి జాబితాలోకి హరియాణా హెల్త్ మినిస్టర్ అనిల్ వీజ్ చేరారు. పాకిస్తాన్ విజయంపై స్పందించిన అనిల్ విజ్.. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డీఎన్ఏలోనే ఏదో లోపం ఉందన్నారు. ముఫ్తీలో భారతీయత ఏ మేరకు ఉందో నిరూపించుకోవాలని సవాల్ చేశారు. సోమవారం మెహబూబా ముఫ్తీ చేసిన ట్వీట్ని ఉద్దేశించి అనిల్ విజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: టీమిండియాతో మ్యాచ్: పాక్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు) ‘‘టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ సాధించిన గెలుపును కొందరు కశ్మీరీలు సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు మిఠాయిలు పంచుకున్నారు కొందరు. వారు గుర్తులేరా’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. దీనిపై అనిల్ విజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: Ind Vs Pak: భారత్ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి ) ‘‘మెహబూబా ముఫ్తీ డీఎన్ఏలోనే ఏదో తేడా ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆమె మాత్రమే కాదు పాకిస్తాన్ విజయం సాధించిన సందర్భంగా కొందరు టపాసులు కాల్చారు. వారి డీఎన్ఏ కూడా తేడానే. మన చుట్టూ దాక్కున్న దేశ ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ అనిల్ విజ్ ట్వీట్ చేశారు. पाकिस्तान के क्रिकेट मैच जीतने पर भारत में पटाखे फोड़ने वालों का डीएनए भारतीय नहीं हो सकता । संभल के रहना अपने घर में छुपे हुए गद्दारों से । — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) October 26, 2021 చదవండి: Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..! -
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..
చండీఘఢ్: దేశంలో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. ముఖ్యంగా ప్రాణాంతక వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, ఐటీ రాజధాని బెంగళూరులో రాత్రివేళ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా సైతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. కాగా హర్యానాలో ఆదివారం కొత్తగా 16 కరోనా మరణాలు సంభవించాయి. 3440 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3268కి చేరగా, కేసుల సంఖ్య 316881గా ఉంది. చదవండి: ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ.. 9 గంటలకే బంద్! -
వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ను ఒక వలంటీర్గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. నవంబర్ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంబాలా కాంట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్ వెళ్లిన విజ్ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్గా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు విజ్కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్ నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement