‘వివాదాలు కాదు.. ముందు ఆటపై దృష్టి పెట్టు’

Manu Bhaker Slammed By Haryana Sports Minister Over Prize Promise Issue - Sakshi

మనుబాకర్‌పై హర్యానా క్రీడా శాఖా మంత్రి విమర్శలు

కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల పంట పండించిన హర్యానా యువ షూటర్‌ మను బాకర్‌ తీరును ఆ రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి అనిల్‌ విజు విమర్శించారు. కామన్‌వెల్త్‌ క్రీడల్లో పసిడి సొంతం చేసుకున్న మనుకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని పేర్కొంటూ... ‘ మీరు ప్రకటించిన నజరానా నిజమా లేదా అంతా ఉత్తిదేనా’ అంటూ ఆమె ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో మను బాకర్‌ ట్వీట్‌కు స్పందించిన అనిల్‌ విజు.. ‘ ఈ విషయమై సోషల్‌ మీడియాలో ప్రస్తావించే ముందు.. మను బాకర్‌ మొదట క్రీడా శాఖను సంప్రదించాల్సింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే  క్రీడాకారులకు అత్యధిక అవార్డులు అందిస్తున్న రాష్ట్రం మనదే. నేను ట్వీట్‌ చేసినట్లుగానే.. నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే ఆమెకు రూ. 2 కోట్లు అందజేస్తాం. ఆటగాళ్లకు కాస్త క్రమశిక్షణ అవసరం. ఇలా వివాదం సృష్టించినందుకు ఆమె చింతించాలి. తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇవన్నీ మాని ఆటపై దృష్టిపెడితే బాగుంటుంది’ అని హితవు పలికారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top