breaking news
Andrew tie
-
ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!
కాన్బెర్రా: బిగ్బాష్ లీగ్లో శనివారం పెర్త్ స్కార్చర్స్తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో సిడ్నీ సిక్సర్స్ ఘనవిజయం సాధించి ఫైనల్కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్మన్ జేమ్స్ విన్స్ 98* పరుగులతో వీరవిహారం చేసి ఒంటిచేత్తో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే విన్స్ సెంచరీ మిస్ కావడానికి పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టై పరోక్ష కారణమయ్యాడు. వాస్తవానికి సిడ్నీ జట్టుకు చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో విన్స్ 98 పరుగులతో ఉన్నాడు. విజయానికి ఒక పరుగు దూరం.. అతని సెంచరీకి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆండ్రూ టై కావాలని చేశాడో.. యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కాని అతను వేసిన బంతి వైడ్ వెళ్లింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ పరుగు అవసరం లేకుండా ఎక్స్ట్రా రూపంలో విజయం సాధించినా... విన్స్కు మాత్రం నిరాశ మిగిలింది. ఆండ్రూ టై చేసిన పనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. 'ఎలాగో మ్యాచ్ ఓడిపోతారని తెలుసు.. విన్స్ను సెంచరీ చేయిస్తే బాగుండేది.. ఆండ్రూ టై కావాలనే ఇదంతా చేశాడు' అంటూ కామెంట్స్ రాసుకొచ్చారు. ఆండ్రూ టై చేసిన పనిపై విన్స్ స్పందించాడు. ఆండ్రూ టై కావాలనే ఆ పని చేశాడా అనేది అతనికి తెలియాలి. నేను సెంచరీ మిస్ అయినందుకు బాదేం లేదు.. ఎందుకంటే జట్టును ఫైనల్ చేర్చాననే సంతోషం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. అప్పటికి అతను వేసిన బంతిని టచ్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ బ్యాట్కు దూరంగా బంతి వైడ్ రూపంలో వెళ్లింది. ఒక బౌలర్గా ఆలోచించిన టై.. అతని బౌలింగ్లో సెంచరీ చేసే అవకాశం ఇవ్వకూడదనే అలా చేశాడు. ఈ విషయంలో ఆండ్రూ టైది కూడా తప్పు అనలేం. అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: వైరల్: బాబు ఈ కొత్త షాట్ పేరేంటో కాగా ఆండ్రూ టై చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విన్స్ సెంచరీ కాకుండా వైడ్ వేయాలని ఆండ్రూ టై దగ్గరకు ఎవరు వచ్చి చెప్పలేదు.. కావాలనే అతను బంతిని వైడ్ వేశాడు. నిజంగా టై నుంచి ఇలాంటిది ఆశించలేదు. అంటూ విరుచుకుపడ్డాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అంపైర్ను తిట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు -
ఐపీఎల్కు ఆండ్రూ టై దూరం
భుజం నొప్పి కారణంగా గుజరాత్ లయన్స్ పేసర్ ఆండ్రూ టై ఐపీఎల్కు దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో తను డీప్ స్క్వేర్లెగ్లో బౌండరీని ఆపేందుకు డైవ్ చేయగా భుజం దగ్గర గాయమైంది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్చించారు. ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్లోనే హ్యాట్రిక్ తీసుకున్న టై లయన్స్కు కీలక బౌలర్గా సేవలందించాడు. -
గుజరాత్ తొలి విజయం
-
‘టై’తక్కలాడించాడు
►ఆండ్రూ టైకి ఐదు వికెట్లు ►హ్యాట్రిక్ సాధించిన లయన్స్ బౌలర్ ►గుజరాత్ తొలి విజయం ►7 వికెట్లతో రైజింగ్ పుణే చిత్తు ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆండ్రూ టై సంచలన బౌలింగ్కు తోడు మెకల్లమ్, డ్వేన్ స్మిత్ మెరుపు బ్యాటింగ్తో లయన్స్ విజయాల బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన రైనా సేన సొంతగడ్డపై చెలరేగి జెయింట్కు ఝలక్ ఇచ్చింది. సమష్టి ప్రదర్శనతో గుజరాత్ సత్తా చాటగా... సీజన్లో శుభారంభం తర్వాత తడబడుతూ వచ్చిన రైజింగ్ పుణే ఖాతాలో ‘హ్యాట్రిక్’ పరాజయం చేరింది. రాజ్కోట్: ఐపీఎల్ కెరీర్లో 150వ మ్యాచ్ ఆడిన సురేశ్ రైనా, పదో సీజన్లో గుజరాత్ లయన్స్కు తొలి విజయం అందించి ఈ మ్యాచ్ను మరింత మధురంగా మార్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో లయన్స్ 7 వికెట్ల తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (28 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (17 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ తివారి (27 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రూ టై (5/17) అద్భుత బౌలింగ్తో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. మెకల్లమ్ (32 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 53 బంతుల్లోనే 94 పరుగులు జోడించి గుజరాత్ గెలుపులో కీలక పాత్ర పోషించగా...చివర్లో రైనా (22 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) 31 బంతుల్లోనే 61 పరుగులు జత చేసి మ్యాచ్ను ముగించారు. కీలక భాగస్వామ్యం... ఇన్నింగ్స్ మూడో బంతికే గుజరాత్కు షాక్ తగిలింది. స్లిప్లో రైనా ఒంటి చేత్తో అత్యద్భుత క్యాచ్ పట్టడంతో రహానే (0) వెనుదిరిగాడు. ఈ దశలో త్రిపాఠి,, స్మిత్ దూకుడైన భాగస్వామ్యం (32 బంతుల్లో 64 పరుగులు) పుణేను నిలబెట్టింది. ముఖ్యంగా ప్రవీణ్ వేసిన ఐదో ఓవర్లో సూపర్ జెయింట్ పండుగ చేసుకుంది. ఈ ఓవర్లో త్రిపాఠి తొలి మూడు బంతుల్లో 6, 6, 4 బాదగా చివరి రెండు బంతులకు స్మిత్ 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. అయితే టై తన తొలి ఓవర్లోనే త్రిపాఠిని అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. మరికొద్దిసేపటికే స్మిత్ కూడా అవుటయ్యాడు. స్టోక్స్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) జోరును టై అడ్డుకోగా... ధోని (5) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. అయితే తివారి, అంకిత్ శర్మ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆరో వికెట్కు 29 బంతుల్లోనే 47 పరుగులు జత చేసి జెయింట్ను ఆదుకున్నారు. చివరి ఓవర్లో ‘హ్యాట్రిక్’తో టై పుణేను పూర్తిగా కట్టి పడేశాడు. తొలి మూడు బంతులకు టై వరుసగా అంకిత్ శర్మ, మనోజ్ తివారి, శార్దుల్ ఠాకూర్లను అవుట్ చేశాడు. ఆరంభం అదిరింది... ఛేదనను లయన్స్ విధ్వంసకర రీతిలో ప్రారంభించింది. అంకిత్ వేసిన తొలి ఓవర్లో స్మిత్ 2 ఫోర్లు, సిక్స్ బాదడంతో 16 పరుగులు రాగా... 2వ, 4వ ఓవర్లలో లయన్స్ 11 పరుగుల చొప్పున రాబట్టింది. ఆ తర్వాత తాహిర్ మొదటి ఓవర్లో మెకల్లమ్ 2 ఫోర్లు, సిక్సర్తో చెలరేగిపోయాడు. తాహిర్ తర్వాతి ఓవర్ గుజరాత్కు మరింత కలిసొచ్చింది. మొదటి మూడు బంతుల్లో మెకల్లమ్ 4, 4, 6 కొట్టగా, స్మిత్ మరో బౌండరీ బాదడంతో ఏకంగా 20 పరుగులు లభించాయి. ఎట్టకేలకు స్మిత్ను ఠాకూర్ అవుట్ చేసి పుణేకు ఊరటనందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తక్కువ వ్యవధిలో మెకల్లమ్, కార్తీక్ (3) వెనుదిరిగారు. అయితే రైనా, ఫించ్ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా రెండు ఓవర్ల ముందే జట్టును గెలిపించారు. ► 16 ఐపీఎల్ చరిత్రలో నమోదైన మొత్తం ‘హ్యాట్రిక్’ల సంఖ్య. లక్ష్మీపతి బాలాజీ, మఖాయ ఎన్తిని, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండిలా, సునీల్ నరైన్, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, సామ్యూల్ బద్రీ, ఆండ్రూ టై ఒక్కోసారి ‘హ్యాట్రిక్’ సాధించగా... యువరాజ్ సింగ్ రెండు సార్లు, అమిత్ మిశ్రా అత్యధికంగా మూడుసార్లు ‘హ్యాట్రిక్’ నమోదు చేశారు.