-
నేడే అర్బన్ 2.0, అమృత్ 2.0
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నగరాలను చెత్త రహితమైన నగరాలుగా, సురక్షితమైన తాగునీరు లభించే నగరాలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్– అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్(అమృత్) 2.0కు రూపకల్పన చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను ప్రభావ వంతమైన రీతిలో ఎదుర్కోవడంతోపాటు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ రెండు కార్యక్రమాలు దోహదపడతాయని కేంద్రం భావిస్తోంది. అర్బన్ 2.0.. అన్ని నగరాలను ‘చెత్త రహితం’గా మార్చడమే అర్బన్ 2.0 లక్ష్యం. ఇందులో భాగంగా ఆయా నగరాల్లో మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపడతారు. బహిరంగ మల విసర్జన రహిత నగరాలుగా తీర్చిదిద్దుతారు. స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0కు దాదాపు రూ.1.41 లక్షల కోట్లు నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. అమృత్ 2.0.. దాదాపు 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా 4,700 పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని కుటుంబాలకు 100 శాతం మంచినీరు అందించేందుకు అమృత్ 2.0ను రూపొందించారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో 10.5 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఉపరితల, భూగర్భ జలాల పరిరక్షణ, పునరుజ్జీవనాన్ని అమృత్ 2.0 ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమ వ్యయం రూ.2.87 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
నగరాలకు మంచి రోజులు
ఈ నెల 25న స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ * 98 వేల కోట్లతో 100 స్మార్ట్ సిటీలు, 500 అమృత్ నగరాల అభివృద్ధి న్యూఢిల్లీ: పెరుగుపోతున్న జనాభాతో సరైన సౌకర్యాలు లేక అల్లాడుతున్న నగరాల రూపురేఖలను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.98 వేల కోట్లతో స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్టు పథకాలను ఈనెల 25న ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ రెండు భారీ ప్రాజెక్టుల అమలు కోసం మార్గదర్శకాలనూ మోదీ ప్రకటించనున్నారు. స్మార్ట్ సిటీ కింద 100 నగరాలను, అమృత్ ప్రాజెక్టు కింద 500 నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర కేబినెట్ గతంలోనే ఆమోదం తెలపడం తెలిసిందే. స్మార్ట్ సిటీ, అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) ప్రాజెక్టులను విజ్ఞాన్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, మేయర్ల సమక్షంలో మోదీ ఆవిష్కరిస్తారు. ‘నగరాభివృద్ధిలో జూన్ 25 చాలా ముఖ్యమైన దినం. ఆ రోజు నుంచి కేంద్రం, ఇతర మార్గాల నుంచి భారీగా వచ్చే పెట్టుబడులను సక్రమంగా వినియోగించడం రాష్ర్ట ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు సవాల్గా మారనుంది’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పీటీఐతో చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ముఖ్యాంశాలు... * 100 స్మార్ట్ సిటీలకు రూ.48 వేల కోట్లు, 500 అమృత్ నగరాలకు రూ.50 వేల కోట్లు కేటాయిస్తారు. స్మార్ట్ సిటీల్లో తొలిదశలో 20, రెండో దశలో 40, మూడో దశలో 40 నగరాలను చేపడతారు. ఏ రాష్ట్రంలో ఎన్ని నగరాలను ఎంపిక చేస్తారో, ఎన్ని నిధులను కేటాయిస్తారో 25న మోదీ చెబుతారు. స్మార్ట్ సిటీ లక్ష్యం: పరిశుభ్ర, ఆహ్లాదకర నగర జీవనం. 24 గంటల నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, పేదలకు అందుబాటు ధరలో ఇళ్లు తదితరాలు. అమృత్ ప్రాజెక్టు లక్ష్యం: మౌలిక అవసరాలైన నీటిసరఫరా, మురుగునీటి వ్యవస్థ, వరద నీటి ప్రవాహం, రవాణా, పార్కుల అభివృద్ధి, చిన్నారుల అవసరాలను తీర్చడం. జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఉన్న పథకాన్ని మాజీ ప్రధాని వాజ్పేయి (అమృత్) పేరుతో తీసుకొస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement