amjad
-
ఆటో, మోటార్ డ్రైవర్స్ యూనియన్ ఆవిర్భావం
గన్ ఫౌండ్రీ: తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్, ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కొత్త సంఘం శుక్రవారం ఆవిర్భవించింది. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఎస్.దయానంద్, ప్రధాన కార్యదర్శిగా అమ్జద్ ఎన్నికయ్యారు. బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభలో యూనియన్ లోగోను అధ్యక్ష, కార్యదర్శులు ఆవిష్కరించారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ... త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల స్థాయిలో సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. టీఆర్ఎస్కు అనుబంధంగా తమ సంఘం పని చేస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ విధానాలపైనే కాకుండా ఆర్టీఏ అధికారుల జులుం, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు, ఫైనాన్షియర్ల దోపిడీకి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తామనన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ నాయకులుగా మున్నాభాయ్, జహంగీర్, గణేష్, రాజ్, సతీష్ ఎన్నికైనట్టు తెలిపారు. -
తల్లితో సహజీవనం, కుమార్తెపై అత్యాచారం
సైదాబాద్: హైదరాబాద్లో ఓ కామంధుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి మందపల్లి సుజాతకు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శ్రీనివాస్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె(13) ఉన్నారు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ చనిపోయాడు. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణి కాలనీ నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఎర్రగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ అంజాద్(32)తో సుజాత సహజీవనం చేస్తుంది. సుజాత కుమార్తె తన సోదరి దగ్గర పరిగిలో ఉంటూ ఏడో తరగతి చదువుకుంటుంది. సుజాత అనారోగ్యానికి గురి కావటంతో రెండు నెలలుగా ఆమె తల్లి వద్దే ఉంటోంది. ఇది అంజాద్కు నచ్చకపోవడంతో సుజాతను తీవ్రంగా కొడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుజాత బయటకు వెళ్లగా అంజాద్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన సుజాత సాయంత్రం సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.