breaking news
airforce flight
-
స్కూల్పై కూలిన జెట్
ఢాకా: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ తరగతి గదిలో ప్రశాంతంగా కూర్చున్న విద్యార్థులపై అకస్మాత్తుగా ఆకాశం నుంచి మృత్యువు యుద్ధవిమానం రూపంలో దూసుకొచ్చింది. చైనా తయారీ ఎఫ్–7బీజీఐ శిక్షణ యుద్ధవిమానం ఉన్నపళంగా పాఠశాలపై కుప్పకూలడంతో పాఠశాల విద్యార్థులుసహా 20 మంది సజీవదహ నమయ్యారు. వీరిలో 16 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పైలట్ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ ఘోర విమానప్రమాదం సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు సంభవించింది. కాలినగాయాలతో రక్తమోడుతున్న మరో 171మందిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఢాకా నగరంలోని ఉట్టారా పరిధిలోని డియాబరీ ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్, కాలేజీ క్యాంపస్పై ఈ శిక్షణవిమానం కుప్పకూలిందని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ విభాగ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ జహీద్ కమల్ చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అదుపుతప్పి ఇలా పాఠశాలపై పడిపోయిందని తెలుస్తోంది. ఒక్కసారిగా పాఠశాల మంటల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి రక్తసిక్తమైన చిన్నారులను రిక్షాలు, ఆటోల్లో దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ‘‘కుర్మిటోలాలోని ఏకే ఖాన్దాకర్ వైమానిక స్థావరం నుంచి సోమవారం ఉదయం ఒంటిగంట ఆరు నిమిషాలకు బయల్దేరిన శిక్షణవిమానం కొద్దిసేపటికే అదుపుతప్పింది. పరిస్థితి సెకన్లలో పసిగట్టిన పైలట్ తౌకిర్ విమానాన్ని జనావాస ప్రాంతం మీద నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు మళ్లించే ప్రయత్నంచేశారు. కానీ ఆలోపే విమానం వేగంగా కిందకు పడిపోయింది’’ అని బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సమీ ఉద్ దౌలా చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేశామని దౌలా అన్నారు.మిన్నంటిన రోదనలువిగతజీవులుగా మారిన చిన్నారులను చూసి పిల్లల తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. కూలిన భవనం, చెల్లాచెదురుగా పడిన విద్యార్థుల మృతదేహాలు, తల్లిదండ్రుల ఆక్రందనలు, సహాయక చర్యలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. క్షతగాత్రులను తరలించేందుకు డజన్లకొద్దీ అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. విమానం సృష్టించిన బీభత్సం ధాటికి నేలమట్టమైన పాఠశాల శిథిలాల కింద నుంచి 20 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రి, ఢాకా మెడికల్ బోధ నాస్పత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ(ఎన్ఐబీపీఎస్)లో పలువురికి చికిత్స నందిస్తున్నారు. మా ఆస్పత్రికి తీసుకొస్తున్న క్షతగా త్రుల సంఖ్య పెరుగుతోందని ఎన్ఐబీపీఎస్ వైద్యు డొకరు మీడియాతో చెప్పారు. విమానాన్ని నడిపిన పైలట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ తౌకిర్ ఇస్లామ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్–7బీజీఐ విమానం భారీ పేలుడుతో నాలుగంతస్తుల పాఠశాల భవనంపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రక్తసి క్తమైన మృతదేహాలను ఒకటి నుంచి ఏడో తరగతి క్లాసుల్లో వరుసగా పేర్చారని అక్కడి ఒక ఉపాధ్యా యుడు చెప్పారు. ‘‘ చిన్నపిల్లల క్లాసులు అయిపో యాయి. ఫైనల్ బెల్ కొట్టాం. ఆనందంగా పిల్లలు బ్యాగులు సర్దుకుని లైన్లలో నిల్చుని బయటకు వెళ్తున్నప్పుడే విమానం కూలింది. చుట్టూతా మంటలే. ఆ మంటలు, దట్టమైన పొగలో అసలేం కనిపించలేదు. నా రెండు చేతులు కాలిపోయాయి. ఊపిరాడలేదు’’ అని ఒక ఉపాధ్యాయురాలు ఆ భ యానక దృశ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో క్లాసులు జరు గుతున్నాయి. హఠాత్తుగా విమానం నా కళ్లెదుటే కుప్పకూలింది. నాకు కేవలం 10 అడుగుల దూరంలో అది కూలడం చూశా. ప్రైమరీ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పే రెండంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ఫ్లోర్ను విమానం ఢీకొట్టింది’’ అని ప్రాంగణంలో 11వ గ్రేడ్ చదువుతున్న ఫహీమ్ హుస్సేన్ అనే విద్యార్థి భయపడుతూ చెప్పాడు. Bangladesh Air Force China Made FT-7BGI (training) aircraft, tail no. 701, crashes in Uttara near Milestone College. 1:06pm and crashed into the college campus soon after.Casualties : at least 6-7 min. pic.twitter.com/0vg4bvjD86— (((Bharat)))🚨™️🕉🚩🔱 🇮🇳 🇮🇱🇷🇺🇺🇸🎗 (@Topi1465795) July 21, 2025 -
‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్ఫోర్స్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయి చేరాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్ఎస్ విరాట్ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ స్వామి నెహ్రూపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నెహ్రూ తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూరప్ భార్య కోసం ఎయిర్ఫోర్స్ విమానం సమకూర్చాలని 1950ల్లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను నెహ్రూ కోరగా అందుకు ఆయన నిరాకరించారని గుర్తుచేశారు. దీంతో ఆయనను బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకున్నారని నెహ్రూను ఉద్దేశిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. The Namo citing Virat misuse recalls for me the case of my father in law J.D. Kapadia ICS who as Defence Secy in the 1950s refused to give Airforce plane to ferry one of Nehru’s European mistresses. Of course he was transferred and next Secy okayed. Thus the decline be began — Subramanian Swamy (@Swamy39) May 9, 2019 -
రోడ్లపై యుద్ధ విమానాలు.. గ్రాండ్ సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై మంగళవారం ఉదయం అరుదైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు సందడి చేశాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధ పరిస్థితుల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సైన్యం తొలిసారిగా నడిరోడ్డుపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయించింది. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్ని సందడిని వీక్షించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి రోడ్డుకిరువైపులా నిల్చున్నారు. విమానాలు ల్యాండ్ అయిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రమాదాలు ఏం వాటిల్లకుండా పూర్తి భద్రతా చర్యలతోనే వీటిని నిర్వహించారు. భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఏన్-32, మిరాగే 2000, సుఖోయి ఎంకేఐ ఇలా మొత్తం 20 యుద్ధ విమానాలు ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎయిర్ మార్షల్ వైస్ చీఫ్ ఎస్బీ డియో ప్రకటించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
హైవేలపై యుద్ధ విమానాల ల్యాండింగ్
-
ఈ విమానం.. బహు ప్రత్యేకం!!
ఈ విమానం చూశారా? సర్వసాధారణ శిక్షణ విమానంలాగే కనపడుతోందా.. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. ఏమిటనుకుంటున్నారా.. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వాడిన విమానమిది. డెహవిల్లాండ్ 104 దెవన్ రకానికి చెందిన ఈ విమానం ప్రస్తుతం వాడకంలో లేదు. బెంగళూరు సమీపంలోని యలహంకలో ఉన్న వీఎస్ఎం ఏరోస్పేస్ ఏఎంఈ శిక్షణ కేంద్రంలో సేద తీరుతోంది. అప్పట్లో భారత వైమానిక దళానికి చెందిన ఈ ప్రత్యేక విమానాన్ని మాజీ ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, రక్షణ శాఖ మాజీమంత్రి వీకే కృష్ణమీనన్ దీన్ని ఉపయోగించారు.