స్కూల్‌ భవనంపై కూలిన విమానం.. 19 మంది దుర్మరణం | One Killed And Four Injured After Bangladesh Air Force Jet Crashes On School In Dhaka, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Bangladesh: స్కూల్‌ భవనంపై కూలిన విమానం.. 19 మంది దుర్మరణం

Jul 21 2025 2:29 PM | Updated on Jul 21 2025 5:07 PM

Bangladesh Air Force jet incident in Dhaka

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో పెను విషాదం చోటు చేసుకుంది. సోమవారం (జులై21)న జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. 100మందికి పైగా గాయాలయ్యాయి.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-7 BGI ట్రైనింగ్‌ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకా నగరంలోని మైల్స్‌స్టోన్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో కూలిపోయింది. మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో విమానం టేకాఫ్‌ తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్‌లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. గాయపడిన బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అగ్నిప్రమాద శాఖ అధికారులు తెలిపారు.

విమానం కూలడంతో ఘటనా స్థలంలో మంటలు ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతాన్ని పొగకమ్మేసింది. రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది.ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.  

ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement