breaking news
Air accidents
-
చిన్న పక్షితో 'పెద్ద పక్షి'కి ముప్పు
విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి పక్షులే ప్రధాన కారణమని తెలియడంతో భారత్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. రివ్వున ఎగిరేలోపు.. వాటికి ఎగిరే స్వేచ్ఛ లేదన్నట్టుగా పక్షులు వార్నింగ్ ఇస్తున్నాయి. ఎయిర్ పోర్టుల సమీపంలో పక్షుల కదలికలు విమాన ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దక్షిణ కొరియాలో విమాన ఘోర ప్రమాదంలో 179 మృత్యువాత పడటానికి పక్షులే ప్రధాన కారణమని.. తెలిసిన తర్వాత భారత్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటికే పక్షుల కారణంగా టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే విమానాలు తిరిగి ల్యాండ్ అవుతున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో.. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా డీజీసీఏ అడుగులు వేస్తోంది. ఓ వైపు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ.. మరోవైపు విమాన ప్రమాదాలు జరగకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.పే..ద్ద విమానానికి పక్షితో ముప్పా! విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. విమాన క్యాబిన్, ఇంజన్ను పక్షులు ఢీకొడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.విమానం పైకి ఎగిరినప్పుడు లేదా దిగుతున్నప్పుడు దాని ఇంజన్లు బలంగా లోపలికి గాలిని తీసుకుని బయటికి వదులుతుంటాయి. జా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆ గాలికి సమీపంలోకి పక్షులు వస్తే అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్డ్ ఇంజన్లు లోపలికి లాగేసుకుంటాయి. దాంతో ఇంజన్లు పాడైపోతుంటాయి. విమానం ఎగిరే సమయంలో ఇంజన్ లోపలికి పక్షులు వెళ్లిపోతే ఇంజన్ తిరగడం కొన్నిసార్లు ఆగిపోయి ఊహకందని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఫ్యాన్ థ్రస్ట్ ఆగిపోయినట్టు గుర్తిస్తే పైలట్ వెంటనే సమీపంలోని ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసేస్తుంటారు. అంతేకాదు.. ఫ్లైట్ క్యాబిన్లో ఉన్న పైలట్ విండ్ షీల్డ్ను బలంగా పక్షులు ఢీ కొట్టినప్పుడు కూడా ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. బలంగా కొట్టినప్పుడు పొరపాటున విండ్ షీల్డ్కి పగుళ్లు ఏర్పడితే విమానం ప్రమాదంలో పడినట్టేనని అంటున్నారు. అప్రమత్తమైన డీజీసీఏ భారత్లోనూ ఇటీవల పక్షుల కారణంగా విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్ట్లో గోవాలోని దబోలి ఎయిర్పోర్ట్లో పక్షి ఢీకొన్న తర్వాత విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ను హఠాత్తుగా నిలిపేసింది. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్టులోనే 2023లో 169 విమానాలకు పక్షుల కారణంగా స్వల్ప ప్రమాదాలు సంభవించడం గమనార్హం. విహంగాలతో లోహపు విహంగాలకు ప్రమాదాలు పెరుగుతుండటంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్పోర్టు సమీపంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విహంగాల ఉనికిని తప్పించే మార్గాలపై దృష్టి సారించింది. రన్వేల వెంట బిగ్గరగా శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చడం, జోన్ గన్స్ ద్వారా భారీ శబ్దాలతో పక్షుల రాకను నియంత్రించడం, ఎయిర్ ఫీల్డ్ సమీపంలో వేప నూనె స్ప్రే చేయడం వంటి భిన్నమైన విధానాలను వినియోగించడంపై చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ఎయిర్పోర్టుకి 10 కి.మీ. పరిధిలో పక్షులు, వన్యప్రాణుల్ని ఆకర్షించే చెత్తా చెదారాలతో కూడిన ఆహారం, జంతు కళేబరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎయిర్పోర్టు వర్గాలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కోళ్లు, మేకలు, ఇతర జంతు వధ జరగకుండా దృష్టి సారించాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ సమస్యని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ఎయిర్పోర్టులు ప్రయత్నిస్తున్నాయి.నౌకాదళ సాయంతో చర్యలు పక్షుల అంతరాయం కలగకుండా వైజాగ్ ఎయిర్పోర్టులో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. ఎయిర్పోర్టు చుట్టూ కెనాల్ ఉంది. వేస్టేజ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యాలని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్తో సమీక్షలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తూర్పు నౌకాదళ వైమానిక బృందం సహాయంతోనూ వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా పక్కç³క్కనే ఉన్నాయి. వీటిపక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పక్షుల రాకపోకలు పెరుగుతుండటంతో విమాన సర్వసులకు అంతరాయం ఏర్పడుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారుల స్ప్రే డ్రోన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఎన్ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరకుండా నియంత్రించే చర్యలు చేపడుతున్నాం. ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేయడం ద్వారా రన్వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలం. – రాజారెడ్డి, వైజాగ్ ఎయిర్పోర్టు డైరెక్టర్ -
గాలి వీస్తే కరెంటు కట్!
గత ఏడాది గాలి బీభత్సానికి వెయ్యికి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలి, విద్యుత్ లైన్లు తెగిపోయి విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరా లేక వారం రోజుల పాటు ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి కూడా గాలి వీస్తే అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 226 విద్యుత్ సబ్స్టేషన్లు ఉండగా వీటిలో 33 సబ్స్టేషన్లు 30ఏళ్ల కిత్రం ఏర్పాటు చేసినవే. శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. దీనికితోడు నిర్వహణ పనులు సైతం సరిగ్గా జరగడం లేదు. ఫలితంగా తరచూ విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయి. కర్నూలు(రాజ్విహార్): విద్యుత్ సరఫరాలో ఎప్పుడుపడితే అప్పుడు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు నెలవారి నిర్వహణ పనుల చేపట్టాలి. కానీ కర్నూలు నగరంలో తప్ప ఎక్కడా ఈ షెడ్యూల్ అనుసరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలుతోపాటు నంద్యాల, ఆదోని, డోన్ డివిజన్లలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లకు ఏర్పాటు చేసిన తీగల పాతబడిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వాడకం, ఓవర్ లోడు, ఎండల తాకిడికి తీగల క్రమంగా దెబ్బతింటున్నాయి. రెగ్యులర్గా నిర్వహణ పనులు చేపట్టి దెబ్బతిన్న తీగలను మార్చని పక్షంలో గాలి, వర్షాలకు బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. తీగల్లో కొమ్మలు విద్యుత్ తీగలతో చెట్ల కొమ్మలు సహజీవనం చేస్తున్నాయి. తీగల్లో కొమ్మలు ఉంటే గాలి వీచే సమయాల్లో షార్ట్ సర్క్యూట్ అయి బ్రేక్ డౌన్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు గతంలో ప్రతి ఏటా వేసవి కాలంలోనే తీగల్లో ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేవారు. ఇప్పుడు ఆ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. 30ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన సబ్స్టేషన్లు 33కి పైనే:కర్నూలు సర్కిల్ (జిల్లా)లో 33/11కేవీ సబ్స్టేషన్లు 226 ఉండగా వీటిలో 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన 33 ఉన్నాయి. ఇందులో కర్నూలు డివిజన్లో ఎనిమిది, డోన్ డివిజన్లో ఏడు, నంద్యాల డివిజన్లో పది, ఆదోనిలో తొమ్మిది ఉన్నాయి. నంద్యాల పవర్ హౌస్, బనగానపల్లె సబ్స్టేషన్లు 1955లో ఏర్పాటు చేసినవి కావడం గమనార్హం. -
ఎన్నో దేశాలకు చేదు జ్ఞాపకాలు
పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం... 2014లో ప్రపంచ దేశాలకు ఓ పెద్ద సవాల్గా మిగిలింది. ఎబోలా వైరస్ వేలాది మందిని బలితీసుకున్నదీ ఈ ఏడాదిలోనే. వీటికి తోడు విమాన ప్రమాదాలు... ఇలా 2014లో ఎన్నో విషాద ఘటనలను ప్రపంచం ఎదుర్కొన్నది. ఉక్రెయిన్లో ప్రజాగ్రహం... తిరుగుబాటు ఉక్రెయిన్ ప్రజలు యూరోపియన్ యూనియన్తో సంబంధాలను ఆశిస్తుంటే, అధ్యక్ష స్థానంలో ఉన్న యానుకోవిచ్ రష్యాతో సంబంధాలను కోరుకోవడంతో సంక్షోభం రగిలింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో వంద మందికిపైగా మృతిచెందారు. యానుకోవిచ్ ఫిబ్రవరి 22న రష్యాకు పరారయ్యారు. తర్వాత రష్యన్లు 60 శాతం ఉన్న క్రిమియాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్చి 1న తమ సైన్యాన్ని ఉక్రెయిన్ చుట్టూ మోహరించి, క్రిమియాను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రిఫరెండమ్లో 97 శాతం క్రిమియన్లు రష్యాలో ఉండేందుకు ఓటేయడంతో అది రష్యాలో కలిసింది. విమాన విషాదాలు అత్యధిక విమాన ప్రమాదాలు జరిగిన సంవత్సరంగా 2014 చరిత్రలో నిలిచిపోనుంది. హా మార్చి 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయల్దేరిన మలేసియా ఎయిర్లైన్స్ ఎంహెచ్ 370 విమానం గమ్యాన్ని చేరకుండానే అదృశ్యమైపోయింది. ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. హా జూలై 17న 298 మందితో ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్కు వెళుతున్న మలేసియా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ విమానం-17 ఉక్రెయిన్లో కూల్చివేతకు గురైంది. అందరూ మృతి చెందారు. హా జూలై 24న 116 మందితో బుర్కినాఫాసో నుంచి అల్జీరియాలోని అల్జీర్స్కు వెళుతున్న ఎయిర్ అల్జీర్ విమానం మాలిలో కూలిపోగా ఒక్కరూ బతికి బయటపడలేదు. హా డిసెంబర్ 28న ఇండోనేసియా నుంచి 162 మందితో సింగపూర్ వెళ్తున్న ఎయిర్ఆసియా విమానం ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే అదృశ్యమైంది. ఎబోలా సవాల్ ఎబోలా అనే ప్రాణాంతక వైరస్ ఈ ఏడాది ప్రపంచ దేశాలను వణికించింది. 2013 డిసెంబర్లో గినియాలో కళ్లు తెరచిన ఈ మహమ్మారి ఈ ఏడాది ఆఫ్రికా దేశాలపై బలమైన పంజా విసిరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 7,645 మందిని బలితీసుకోగా, 19 వేల కేసులు నమోదయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఇరాక్, సిరియాల్లోని చిన్నచిన్న ఉగ్రవాద సంస్థలన్నీ ఏకమై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)గా ఏర్పడ్డాయి. ఇది తన పేరును ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)గా మార్చుకుంది. ఇరాక్లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంది. పలు దేశాల వారిని బందీలుగా చేసుకుని వారి తలలు నరికి ఆ వీడియోలను విడుదల చేసింది. ఐఎస్ చెరలో 39 మంది భారతీయులు ఉన్నారు. పెషావర్ మారణహోమం పాకిస్తాన్లోని పెషావర్ నగరంలో ఉన్న సైనిక పాఠశాలలోకి డిసెంబర్ 16న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు చొరబడి 133 మంది విద్యార్థులను కాల్చి చంపారు. మరిన్ని ముఖ్యమైన పరిణామాలు.. హా నైజీరియాలో బోకోహరామ్ ఉగ్రవాదులు ఏప్రిల్ 14న ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి 276 మంది విద్యార్థినులను అపహరించుకుని పోయారు. హా ఇజ్రాయెల్ దాడుల్లో 2,100 మంది పాలస్తీనా వాసులు మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు హా బ్రిటన్తోనే కలిసుండాలా లేక స్వాతంత్య్రం కావాలా? అన్న అంశంపై సెప్టెంబర్లో స్కాట్లాండ్లో జరిగిన ఓటింగ్లో... బ్రిటన్తోనే కలసి ఉంటామంటూ మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. -
నిశ్చింతయానం
వివరం: మలేషియా ఎయిర్ లైన్స్ విమానం ఎం.హెచ్ 370 అదృశ్యమై పోయాక విమానయానం ఎంతవరకు సురక్షితమైనది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. అయితే అన్ని ప్రయాణ సాధనాలకన్నా విమానమే అత్యంత భద్రమైనదని గతంలో జరిగిన భూ, జల, వాయు వాహనాల ప్రమాద కారణాలు, గణాంకాలు చెబుతున్నాయి! ఈ నేపథ్యంలో... విమాన యానం గాలిలో దీపం కాదనీ, విమాన ప్రమాదాలన్నీ విమానం వల్ల జరిగే ప్రమాదాలు కావని చెప్పడమే ఈవారం ‘వివరం’. మీరో బిజినెస్ మేగ్నెట్. లేదా సెలబ్రిటీ. లేదా క్షణం తీరికలేకుండా గ్లోబు చుట్టూ తిరుగుతుండే పెద్దమనిషి. విమానం ఎక్కందే మీకు పొద్దు గడవదు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగి, అక్కడ ఎక్కి మరెక్కడో దిగి ఆ రోజు చేయవలసిన పనులన్నిటికీ మీ దగ్గర పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. అందులో మునిగిపోయి ఉంటారు. పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటారు. మధ్యలో ఎక్కడా మీకు మీరు ప్రయాణిస్తున్న లేదా ప్రయాణించబోతున్న విమానం గురించి చెడు ఆలోచన కలగనే కలగదు. ‘ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే?’ అనే అనుమానమే మీలో తలెత్తదు. ఎందుకు? ఎందుకంటే విమానయానం మిగతా అన్ని ప్రయాణాల కంటే నూటికి నూరుపాళ్లు సురక్షితం కనుక. అలాగా! అయితే అడపాదడపా జరుగుతున్న విమాన ప్రమాదాల మాటేమిటి? అవా? అలాంటివి ప్రమాదాలే కానీ, విమాన ప్రమాదాలు కాదు! అంటే?! విమానాలు తయారయ్యేటప్పుడే అత్యంత ప్రమాదరహితంగా తయారవుతాయని! మానవ తప్పిదం వల్లనే కానీ, విమాన లోపం వల్ల ప్రమాదం జరగడం అన్నది దాదాపు అసాధ్యం అని!! తరచు ప్రయాణాలు చేసేవారు ఒక విషయం గమనించి ఉంటారు. విమానం లాండ్ అయ్యేముందు పెలైట్ గొంతు సవరించుకుని, ‘ద సేఫెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ట్రిప్ ఈజ్ నౌ ఓవర్’ అని చెప్తాడు. ‘మీ ప్రయాణంలో అత్యంత సురక్షితమైన భాగం ఇప్పుడు పూర్తయింది’ అని చెప్పడం అన్నమాట. ఆ మాట నిజమే. విమానం దిగగానే మీరు మీ గమ్యం చేరుకోడానికి టాక్సీ ఎక్కారనుకుందాం. అది ఎంత సురక్షితమో మీరు చెప్పలేరు. డ్రైవర్ చేతుల్లో ఉన్నది స్టీరింగ్ ఒక్కటే కాదు, మీ ప్రాణాలు కూడా. అతడు ఎలా డ్రైవ్ చేస్తాడో మీకు తెలీదు. టాక్సీ కండిషన్ ఏమిటో మీకు తెలీదు. విండో లోంచి బయటికి చూడండి. అక్కడ సిగ్నల్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలీదు. మీరు ప్రయాణిస్తున్న రోడ్డు మీద ఎక్కడ ఏ గతుకు ఉందో తెలీదు. మీ టాక్సీకి ఎదురొచ్చే వాహనాలు సక్రమంగా వస్తాయో లేదో తెలీదు. వాటిని నడుపుతున్నవారు కంటి నిండా నిద్రపోయినారో లేదో తెలీదు. మద్యం సేవించకుండా నడుపుతున్నవారో లేదో తెలీదు. ఏ దశలోనైనా సురక్షితం అనేది ప్రమాదంగా మారిపోవచ్చు. అలాంటిది భూమికి ఆరు మైళ్ల ఎత్తులో, గంటకు 500 మైళ్ల వేగంతో వెళ్లే విమానంలో మన ప్రాణాలు విమానంలో కాదు, అరచేతిలో ఉన్నట్లు. అయినా సురక్షితంగా ఎక్కుతున్నాం, దిగుతున్నాం, మళ్లీ మళ్లీ ప్రయాణిస్తున్నాం అంటే విమానం ఎన్ని ముందు జాగ్రత్తలతో, ఎంత సురక్షితంగా తయారవుతోందో చూడండి. ఏరోప్లేన్ డిజైన్ విమానం ఎక్కి, దిగితే మన ప్రయాణం పూర్తవుతుంది. కానీ ఎయిర్లైన్స్ సంస్థల ఇంజినీర్ల పని ఆ తర్వాతే మొదలవుతుంది. పూర్తయిన ప్రయాణకాలంలో ఆ విమానంలోని యంత్రపరికరాలు ఏయే పరిమితులకు లోబడి పనిచేశాయన్న వివరాలను, ఇతర అవసరమైన సమాచారాన్ని వారు జాగ్రత్తగా నమోదు చేసుకుంటారు. ఇలా ఇప్పటి వరకు గత యాభై ఏళ్లలోనూ జరిగిన ప్రయాణాలకు సంబంధించిన కోట్ల గంటల డేటా ఆయా సంస్థల దగ్గర ఉంది! ఆ డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు విమానాల డిజైనింగ్ను మరింత సురక్షితంగా మారుస్తుంటారు కనుక ప్రమాదాలు జరిగే అవకాశం దాదాపు శూన్యం. ప్రమాదం జరిగితే అనూహ్యమైన బయటి అవాంతరాల వల్ల జరగాల్సిందే కానీ లోపలి యంత్రాల వల్ల జరిగే అవకాశమే ఉండదు. కాక్పిట్ టెక్నాలజీ కాక్పిట్లో సంప్రదాయ యంత్ర (మెకానికల్) నియంత్రణ పద్ధతులు పోయి, వాటిస్థానంలో విద్యుత్కణ (ఎలక్ట్రానిక్) నియంత్రణ విధానాలు వచ్చాక ప్రమాదాలు అరుదులో అరుదు అయిపోయాయి. జెట్ లైనర్స్ చాలావరకు ఇలా ఆధునికీకరణ చెందినవే. 777, 787 బోయింగులు, అలాగే ఎ330, ఎ340, ఎ380 అన్నీ ఇప్పుడు ‘ఫ్లయ్ బై వైర్’తో (కంప్యూటర్ పరిజ్ఞానంతో) నడుస్తున్నవే కాబట్టి ప్రమాదాలను ఊహించడం, వాటి నుంచి విమానాలను తప్పించడం తేలికయింది. సమాచారాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమన్వయం చేసుకోగలిగితే చాలు పెలైట్ సక్సెస్ అయినట్లే. శాటిలైట్ గ్లోబల్ పొజిషనింగ్, అడ్వాన్స్డ్ డిస్ప్లే, టెలీకమ్యూనికేషన్ వంటి అత్యాధునిక పరిజ్ఞానాలు వచ్చాక విమానం కదలికల్లో కచ్చితత్వాన్ని పసిగట్టడడం పూర్వపు రోజులకన్న సులభం అయింది. 1950, 1960లలో 2లక్షల ప్రయాణాలకొకసారి ఘోర ప్రమాదం నమోదయ్యేది. ప్రపంచ వైమానిక రంగంలో సురక్షిత ప్రమాణాలు నాటితో పోలిస్తే నేడు 10 రెట్లు మెరుగవడంతో 20 లక్షల ప్రయాణాలకొక వైఫల్యం లేదా అంతకంటే తక్కువగా మాత్రమే దుర్ఘటనలు జరగడం కనిపిస్తోంది. ఈ గొప్పతనం అంతా కాక్పిట్ (పెలైట్ ఉండే చోటు)టెక్నాలజీదే. పైలట్ చేతుల్లో పిట్ట ప్రాణం ఎంత తిరుగులేని టెక్నాలజీ అయినా పైలట్ అనుభవం, నైపుణ్యం, నిర్ణయ శక్తి అనే అంశాలపైనే సురక్షిత ప్రయాణం అనేది ఆధారపడి ఉంటుందని చెస్లీ సలెన్బర్గర్ అంటారు. ఫస్ట్ ఆఫీసర్ జెఫ్ స్కిల్స్తో కలిసి అత్యంతాధునిక ఆటోమేటెడ్ ఎయిర్బస్ ఎ 320ను (యు.ఎస్. ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం.1549)ను న్యూయార్క్లోని హడ్సర్ నదిపై లోతు తక్కువ ప్రదేశంలో అత్యవసరంగా దింపి అందులోని 155 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ అతను. 2009లో జరిగిన ఈ ఘటనను విమాన ప్రయాణ చరిత్రలోనే ఒక మిరకిల్ అని, దాన్ని జాగ్రత్తగా నడిపి, కిందికి దించిన చెస్లీ సలెన్బర్గర్ గ్రేట్ పైలట్ అనీ ప్రపంచమంతా ప్రశంసించింది. విమానాన్ని నడుపుతున్నప్పుడు అన్ని వైపులనుండి వ చ్చిపడుతుండే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ప్రయాణ మార్గాలను అనుసరించడం, సంబంధిత వ్యక్తులతో అనుసంధానమై ఉండడం వంటివాటిలో పైలట్లకు శిక్షణ ఉంటుంది. వీటన్నిటితో పాటు, పైలట్ వ్యక్తిత్వాన్ని కూడా నియామక సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. వారిలోనూ వ్యక్తిగత సమస్యలకు ప్రభావితంకాని మనస్తత్వం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. కాక్పిట్ సైజు సురక్షితమైన విమాన ప్రయాణానికి నిపుణుడైన పైలట్ తో పాటు విశాలమైన కాక్పిట్ కూడా అవసరం. ఈ అంశాన్ని జెట్లైనర్లు కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాయి. విమాన నియంత్రణకు సంబంధించిన ప్రతి పరికరం, ప్రతి పరిజ్ఞానం పైలట్ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న మార్పు సైతం పైలట్ కళ్లు గప్పి తప్పించుకోలేదు. ‘‘కాక్పిట్ విస్తృతి, ఆకారం, ఉపస్థితి (అప్పియరెన్స్), కాక్పిట్లోని ప్రతి స్విచ్, ప్రతి లైటు పైలట్ కనుసన్నలలో ఉంటాయి కనుక కాక్పిట్ లోపాల కారణంగా ప్రమాదం జరిగే అవకాశమే ఉండదు’’ అని జూలియన్ ఫాక్స్ కమింగ్ అంటారు. ఆయనకు బోయింగ్ 787లో కాక్పిట్ ఇంజినీరుగా పనిచేసిన అనుభవం ఉంది. ప్యాసింజర్ క్యాబిన్ కాక్పిట్ సరే, ప్రయాణీకులు కూర్చునే ఏరోప్లేన్ బాడీ మాటేమిటి? అది కూడా కాక్పిట్ అంత పకడ్బందీగానే ఉంటుంది. కిక్కిరిసినట్లుండే ఎకానమీ సీట్లుగానీ, విశాలంగా ఉండే ఎగ్జిక్యూటివ్ సీట్లు గానీ ఎలాంటి తారతమ్యమూ లేకుండా విమానంలోని సీట్లన్నీ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతోనే ఉంటాయి. ఎక్కువ డబ్బుకు ఎక్కువ భద్రత, తక్కువ డబ్బుకు తక్కువ భద్రత ఉండదు. ఒక్కో సీటు పదహారింతల గురుత్వాకర్షణ శక్తిని తట్టుకునేలా తయారై ఉంటుంది. దీనివల్ల విమానం లేచేటప్పుడు, అకస్మాత్తుగా ఆగినప్పుడు కుదుపులకు లోనైనా ఆ ఒత్తిడి కూర్చున్న వారిపై ఏమాత్రం ప్రభావం చూపదని విస్కాన్సిన్లోని ఎం.జి.ఎ. ఇంజినీరింగ్ విభాగం టెస్ట్ ఇంజినీరు డేవిడ్ ఎస్సే అంటారు. సీట్ల నిర్మాణంపై ఇంజినీర్లు తీసుకునే శ్రద్ధ ఇంతటితో అయిపోలేదు. సీట్లకు వాడే వస్త్రం, లోపలి కుషన్... మంటల్ని విస్తరించనివ్వని స్వభావాన్ని కలిగివుంటాయి. అంతేకాదు మంటల్ని ఆర్పే గుణం కూడా వాటికి ఉంటుంది. మంటలు అంటుకున్నప్పుడు కొద్దిస్థాయిలో మాత్రమే అవి పొగను విడుదల చేస్తాయి. ఆ పొగలో కూడా హానికరమైన రసాయనాలు ఉండవు. సీటు వెనుక భాగం (వీపును ఆన్చే భాగం) సున్నితంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా శరీరానికి నొక్కుకుపోని విధంగా ఉంటుంది. ప్రయాణికుల క్యాబిన్ గోడలు అగ్నిమాపక కవచాల్లా ఉంటాయి. ఏ కారణం చేతనైనా మంటలు రేగి, పొగ ఆవరించినప్పుడు బయటికి వెళ్లే మార్గం స్పష్టంగా కనిపించేలా లైట్స్ వాటంతట అవే వెలుగుతాయి. ఇంత సురక్షితమైన ఏర్పాట్లు ఉన్న కారణంగానే గత పదేళ్లలో 301 విమాన ప్రమాదాలు సంభవించినా వాటిల్లో ప్రాణాంతకమైనవి పావు వంతు కూడా లేవు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భూమి మీద ట్రాఫిక్ సిగ్నల్ స్పష్టంగా కనిపిస్తూ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు కళ్లముందు చక్కగా సూచనలు ఇస్తూ ఉన్నప్పటికీ రోజూ వందల యాక్సిడెంట్లు జరుగుతున్నాయే, మరి పైన ఆకాశంలో ఏమీ లేని చోట పైలట్ తన ప్రయాణికులను భద్రంగా గమ్యస్థానాలకు చేర్చడం ఎలా సాధ్యమౌతోంది? ఇందులో పైలట్ ప్రావీణ్యం ఎంత ఉందో అంతకు రెండింతలుగా జి.పి.ఎస్. కేంద్రం పనితీరు కూడా ఉంటుంది. జి.పి.ఎస్.అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. విమాన గమనాలను గమనిస్తూ, అవి దారి తప్పకుండా సూచనలు ఇస్తూ, ఎప్పటికప్పుడు పైలట్ను అప్రమత్తం చేస్తూ ఉంటుంది జి.పి.ఎస్. పూర్వం ఈ విధానం అందుబాటులో లేనప్పుడు మ్యాపులను దగ్గరపెట్టుకుని, బ్లాక్బోర్డ్ మీద చాక్పీస్తో లేదంటే పేపర్ మీద పెన్సిల్తో అంచనాలు వేసుకుంటూ పైన పైలట్కు కిందినుంచి సూచనలు ఇస్తుండేవారు. అప్పటికీ ఇప్పటికీ ప్రయాణికులు పెరిగారు, విమానాల సంఖ్య పెరిగింది. గగన వీధుల్లో ట్రాఫిక్ కూడా పెరిగింది. గత ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా నింగి నుంచి నేలకు 2 కోట్ల 80 లక్షల విమానాలు దిగాయి. ఇవన్నీ కూడా నింగిలోకి సురక్షితంగా టేకాఫ్ అయి, ప్రయాణాన్ని పూర్తిచేసినవే. పైన కాక్పిట్కీ, కింద కంట్రోల్ స్టేషన్కీ మధ్య కచ్చితమైన అనుసంధానం ఉండడం వల్ల విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొనడం అనేది దాదాపు అసాధ్యం. పోటీ, ఆదాయం ఆదాయం కోసం పోటీ పడుతుండే విమానయాన సంస్థలు, తమకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భద్రత కోసం కేటాయించడంలో కూడా పోటీపడుతున్నాయి. కనుక ఈసారి మీరు విమానం ఎక్కినప్పుడు, కెప్టెన్ ఆహ్వానం పలకగానే నిశ్చింతగా వెళ్లి కూర్చోండి. హాయిగా వెనక్కి వాలి, మీరు అత్యంత సురక్షితమైన వాహనంలో ఉన్నారన్న ధీమాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చెయ్యండి. అణువణువున భద్రత.. A380 - కొన్ని విశేషాలు ఏ దేశపు ఎయిర్లైన్స్కైనా ప్రయాణీకుల భద్రతే తొలి ప్రాధాన్యం. విమానం సామర్థ్యానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదాహరణకు A380 ఎయిర్బస్. దీని తయారీలో అణువణువు ప్రయాణికులకు సదుపాయంగా ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అలాగే బోయింగ్ విమానాల్లోనూ సురక్షితమైన, కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. - ప్రపంచంలో కె ల్ల అతి పెద్ద విమానం అ380 ఎయిర్ బస్. 2007లో సేవలను ప్రారంభించిన ఈ ఎయిర్బస్ ప్రయాణికుల క్యాబిన్ విశాలంగా, విలాసవంతంగా ఉంటుంది. - A380 ఎత్తు 24.1 మీటర్లు. వెడల్పు 80 మీటర్లు. పొడవు 72.7 మీటర్లు. అంటే రెండు నీలి తిమింగలాలను ఒకదాని వెనుక ఒకటి ఉంచితే ఎంత పొడవుంటాయో అంత పొడవు. - ఈ ఎయిర్ బస్ (అ380) రెక్కలు... బోయింగ్ 747 ఎయిర్క్రాఫ్ట్ రెక్కల కన్నా 54 శాతం పెద్దవిగా ఉంటాయి. - ఇందులో ఒకేసారి కనీసం 525 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. 3000 సూట్కేసులు పెట్టుకోవచ్చు. - A380 ఎయిర్ బస్ రెక్కలు ఇంగ్లండ్లో తయారవుతాయి. తోక, విమాన ప్రధాన భాగం స్పెయిన్ , జర్మనీలలో తయారవుతాయి. ఈ భాగాలన్నీ పెద్ద పెద్ద ఓడలలో బిగింపుల (అసెంబ్లింగ్) కోసం ఫ్రాన్సుకు చేరుకుంటాయి. - ఎయిర్ బస్ ఇంధన సామర్థ్యం 81900 గ్యాలన్లు. బరువు 560 టన్నులు. సాధారణ పెద్ద విమానాలు వినియోగించుకునే ఇంధనంలో 17 శాతం తక్కువగా ఎయిస్ బస్ వినియోగించుకుంటుంది. ఒక్కో ప్రయాణికునికి వంద కి.మీ.లకు 4 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది. - ఈ భారీ విమానం 43,000 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. గంటకు 640 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. - ఎయిర్ బస్లోని మూడు ప్రధాన భాగాలను 8000 బోల్టులు గట్టిగా కలిపి ఉంచుతాయి. మొత్తం మీద ఈ విమానంలో 40 లక్షల విడి భాగాలు ఉంటాయి. వీటిని 30 దేశాలలోని 1500 కంపెనీలు సరఫరా చేస్తాయి. - ఎయిర్బస్లోని పరికరాలన్నీ తేలికైనవీ, తక్కువ శబ్దం చేసేవీ, పర్యావరణహితమైనవీ. ఎయిర్ బస్ నుంచి వెలువడే కాలుష్యాలు, ధ్వని తరంగాలు, పొగలు కూడా మిగతా విమానాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ. - ఒక్కో ఎయిర్బస్ ప్రయాణ సామర్థ్యం 1,40,000 గంటలు. ఎయిర్పోర్ట్ కంట్రోల్ విమానాశ్రయంలో ఉండే భద్రతా ఏర్పాట్లూ తక్కువేం కాదు. ముఖ్యంగా రన్వే మీదకు విమానం దిగుతున్నప్పుడు ‘మూవ్మెంట్ డిటెక్షన్ మానిటర్లు’ ప్రతి ఒక్క వాహనాన్ని, అంటే... రన్వేలు, ట్యాకీ వేలు, టెర్మినల్ గేట్ల దగ్గర ఉన్న వాహనాలను గమనించి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంటాయి. విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనూ మానిటర్లు మిగతా వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తుంటాయి. దీని వల్ల రన్వేపై ప్రమాదాలు జరిగే మాటే ఉండదు.