breaking news
Agents Cheating
-
‘ఇరాన్లో ఉపాధి’ పేరుతో మోసపోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో మంచి ఉద్యోగం, అధిక జీ తం అంటూ కొందరు ఏజెంట్లు చెప్పే మాటలను నమ్మవద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఇరాన్లో ఉద్యోగాల పేరిట జరుగుతున్న భారీ మోసం, కి డ్నాప్ల పర్వం ఇటీవల బయటపడిన విషయాన్ని గు ర్తు చేసింది. మాయ మాటలతో ఇరాన్కు రప్పించుకుని, ఆ తర్వాత కిడ్నాప్ చేసి వారి కుటుంబ సభ్యుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న నేరగాళ్ల ముఠాల బారిన పడవద్దని కోరింది. ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే కల్పించిందని స్పష్టం చేసింది. అయితే, నేరగాళ్లతో సంబంధాలున్న కొందరు ఏజెంట్లు ఇదే అదనుగా ఉద్యోగాల కోసం కూడా వీసా లేకుండా వెళ్లవచ్చని నమ్మిస్తున్నారని తెలిపింది. ఇలాంటి ఆఫర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరింది. తప్పుడు వాగ్దానాలు చేసే ఏజెంట్లు కిడ్నాపర్లతో కుమ్మక్కై ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
కష్టాల్లో హైదరాబాద్ ఆడపడుచు
హైదరాబాద్: బతుకుదెరువుకు పరాయిదేశం వెళ్లి కష్టాల్లో ఇరుక్కుంది హైదరాబాద్ మహిళ. ఏజెంటు చేసిన మోసానికి యజమాని చేతిలో మానసిక, శారీరక హింసలను ఎదుర్కోంటోంది. సాల్మాబేగం(39) హైదరాబాదులోని బాబానగర్లో ఉంటోంది. బ్రతుకుదెరువుకోసం ఇద్దరు ఏజెంట్లు అక్రమ్, షఫీ ద్వారా సౌదీ అరేబియాలోని షేక్ ఇంట్లో పనిమనిషిగా ఈఏడాది జనవరి నెలలో వెళ్లింది. అక్కడకు వెళ్లనప్పటి నుంచి యజమాని చేతిలో చిత్ర హింసలు అనుభవిస్తోంది. దీంతో తిరిగి ఇండియాకు రావాలని ప్రయత్నిస్తే అందుకు యజమాని అంగీకరించట్లేదు. దీంతో ఏజెంట్లు మోసం చేశారని గ్రహించిన సాల్మా తన కూతురు షమీనాకు వాయిస్ మెస్సేజ్ చేసింది. యజమాని తను చిత్ర హింసలు పెడుతున్నాడని తిరిగి ఇంటికి రానివ్వట్లేదని కూతురు షమీనాకు తెలియచేసింది. దీనిపై ఆమె కూతురు వీసా ఇచ్చిన ఏజెంటు దగ్గరకు వెళ్లి తన తల్లిని ఇండియాకు తిరగి రప్పించాలని బ్రతిమాలినా ఫలితం లేదు. వీరిపై కాంచన్బాగ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని షమీనా వాపోయింది. ఏజెంట్లు తన తల్లిని మూడు లక్షలకు అమ్మేశారని షమీనా తెలిపింది. కాంట్రాక్టు పెళ్లికి అంగీకరించలేదని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏజెంట్లపై పోలీసులకు పలు సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ వారిపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించింది. తన తల్లిని వెనక్కి తీసుకురావడానికి శాయశక్తులా పోరాడతానని షమీనా తెలిపారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తన తల్లిని విడిపించాలని కోరింది. గల్ఫ్ కార్పోరేషన్ కౌన్సిల్ (జీసీసీ) లోని దేశాల్లో కఫిల్ విధానం అమలులో ఉంది. దీనికింద ఇంట్లో పనిమనుషులను యజమానులు ఇతర దేశాలనుంచి పిలిపించుకునే సదుపాయం ఆదేశాల ప్రజలకు ఉంది. అక్కడ ఇతర దేశాల వారు శాశ్వతంగా ఉండటానికి వీలు లేదు.


