breaking news
affidavit format
-
అఫిడవిట్ ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ ఆస్తులు ఎంతంటే..?
ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక బరిలోకి దిగిన ఆయన.. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రశాంత్ కిషోర్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట చరాస్తులు రూ.22.19 కోట్లు, స్థిరాస్తులు రూ.73.87 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.96 కోట్లకు చేరింది. అఫిడవిట్లో తన అప్పుల వివరాలను కూడా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ప్రస్తుతం తనపై రూ.5.77 కోట్ల బ్యాంకు రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆస్తుల్లో ఘజియాబాద్లోని అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు, మరో రెండు ఫ్లాట్లలో 50 శాతం వాటా ఉన్నట్లు తెలిపారు. అలాగే పాట్నాలోని పటాలిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్లో ప్లాట్లు, బక్సర్, స్వగ్రామంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.భార్య పేరిట భారీగానే..ఇక ఆయన భార్య జాన్వి దాస్ పేరిట ఉన్న ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ భార్య జాన్వి దాస్ వైద్యురాలు. ఆమెకు రూ.89.51 కోట్ల చరాస్తులు, రూ.12.42 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ఆమెకు గువాహటిలో రెండు ఫ్లాట్లు, ఓ బంగ్లాలో మూడో వంతు వాటా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే నోయిడాలోనూ ఆస్తులు ఉన్నట్లు వివరించారు.ఆ కంపెనీ నుంచి పార్టీకి విరాళాలుప్రశాంత్ కిషోర్ ‘వేదా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీకి యజమానిగా ఉన్నారు. ఈ సంస్థ 2024-25లో జన్ సురాజ్కు రూ.85 కోట్ల విరాళం ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతకుముందు 2023-24లో జన్ సురాజ్ ఫౌండేషన్కు రూ.50 లక్షలు, ‘జాయ్ ఆఫ్ గివింగ్’కు రూ.2.75 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు వివరాలు ఉన్నాయి.8 కేసులు.. ఇంకా విచారణ దశలోనే!ప్రశాంత్ కిషోర్పై ఎనిమిది కేసులు నమోదై ఉన్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వీటిలో పరువు నష్టం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, మోసం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏ కేసులోనూ ఇప్పటివరకు అభియోగాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.పీకే ఏం చదివారంటే..ప్రశాంత్ కిషోర్ లక్నో విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో హెల్త్కేర్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కోర్సు చేశారు. ఫ్రెంచ్ భాషలోనూ సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేశారు.ఎన్నికల వ్యూహకర్త నుంచి..ప్రశాంత్ కిషోర్ గతంలో దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రూపొందించిన విషయం తెలిసిందే. అయితే 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం బిహార్కు తిరిగి వెళ్లి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్ అభియాన్’ను ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఆ తర్వాత జన్ సురాజ్ను రాజకీయ పార్టీగా మార్చారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఆ ఎన్నికల్లో పీకే పోటీకి దూరంగా ఉన్నారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ ఉప ఎన్నిక ద్వారా పోటీ చేస్తున్నారు.పాట్నా జిల్లా పరిధిలో ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ నేత నితిన్ నబీన్ రాజీనామా చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం(బీజేపీ జాతీయాధ్యక్షుడు+రాజ్యసభ సభ్యుడు)తో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ తరఫున నీరజ్ కుమార్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అతి త్వరలో బై ఎలక్షన్ జరగనుంది.బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న ప్రశాంత్ కిషోర్.. ఎన్నికల బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే తన అఫిడవిట్తో రాజకీయ వర్గాల్లో మరో చర్చకు తెరలేపారు. -
అఫిడవిట్లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే..
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పిదం చోటుచేసుకుంది. ఇందిర తన అఫిడవిట్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఉన్న కాలంలో అప్లికేబుల్ బదులు నాట్ అప్లికేబుల్ అని పూరించారు. ఈ విషయమై సోమవారం ఆర్ఓ కార్యాలయంలో జరిగిన స్క్రూట్నీలో బీజేపీ అభ్యర్థి విజయరామారావుతో పాటు స్క్రూట్నీలో పాల్గొన్న ఇతర అభ్యర్థులు ఆర్ఓతో చర్చించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ఏ పార్టీ నుంచి బీ–ఫారం జతచేస్తారో దానినే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళి మేరకు ఆమె నామినేషన్ను ఆమోదించామని తెలిపారు. వినయ్భాస్కర్.. తప్పుడు అఫిడవిట్.. బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని బీజేపీ నాయకుడు, న్యాయవాది రావు అమరేందర్రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జరిమానా విఽధించిందని, ఈ జరిమానాను చెల్లించాడని, రూ.2 వేలకు పైగా జరిమానా చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ తాను రూ.1,000 మాత్రమే జరిమానా చెల్లించినట్లు అఫిడివిట్లో చూపించారని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వినయ్భాస్కర్ నామినేషన్ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా రావు అమరేందర్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పారదర్శకంగా విధులు, బాధ్యతలు నిర్వహించడం లేదని ఆరోపించారు. రూ.3 వేలు జరిమానా విధించిన జడ్జిమెంట్ ప్రతిని, జరిమానా చెల్లించినట్లు ఆధారాలు అందించినా.. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్పై చర్యలు తీసుకోకుండా ఆమోదించారని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి చదవండి: 'స్వతంత్ర అభ్యర్థుల' ఓట్లు.. మిగతా పార్టీలకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా? -
కేంద్రం వైఖరిలో పొంతనలేదు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పరస్పర విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో అయోమయానికి గురైన అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి.. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వటం చాలా కష్టమని, ఎంతో శ్రమతో కూడుకున్న పనని కోర్టుకు నివేదించారు. మంగళవారం విచారణ మొదలవుతుండగానే.. కేంద్రం గతంలో తెలిపిన వైఖరికి భిన్నమైన వైఖరిని ఇప్పుడు చెప్తోందంటూ ధర్మాసనం తప్పుపట్టింది. ‘నిన్న సమర్పించిన అఫిడవిట్ గతంలో మీరు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. చాలా అంశాలపై ఈ అఫిడవిట్ మౌనం దాల్చింది. లేదంటే మరేదో చెప్తోంది. మీరు ఒక వాదన వినిపించారు. కానీ ఈ పత్రాలు మరేదో చెప్తున్నాయి. బొగ్గు క్షేత్రాల కేటాయింపు చట్టబద్ధతను మీరు సమర్థించుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం 218 బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన వివరాలు కావాలని, ఒక్కో క్షేత్రం వారీగా వివరించాలని అటార్నీ జనరల్కు చెప్పింది. జస్టిస్ ఆర్.ఎం.లోథా నేతృత్వంలోని జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన ధర్మాసనం.. బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించిన తాజాగా ప్రశ్నల వర్షం కురిపించింది. తాను ఇచ్చిన సమాధానాలతో ధర్మాసనం సంతృప్తి చెందకపోవటంతో.. మృదుప్రవర్తన గలవాడిగా పేరున్న వాహనవతి ప్రశ్నల శరపరంపరతో అయోమయానికి, అసహనానికి లోనయ్యారు. ‘ప్రతిదీ నా మెదడులో తీసుకురాలేను. అది చాలా కష్టం. ఎంతో శ్రమతో కూడుకున్న పని. నేను ఒక కోణం గురించి వాదించిన తర్వాత, మరో కోణంపై మరో ప్రశ్న తలెత్తుతుంది. నేను ముందుకెలా వెళ్లగలను? బొగ్గు క్షేత్రం గుర్తింపు గురించి నేను సమాధానం ఇచ్చా. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ గురించి సమాధానం చెప్పా. ఇప్పుడేమో బొగ్గు క్షేత్రం ఎక్కడుందనే దాని గురించి ప్రశ్న’ అని వ్యాఖ్యానించారు. కేటాయింపులకు సంబంధించిన రికార్డులు మొత్తం సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని, ఇప్పటివరకూ విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు చెప్పే దాన్ని మేం ఎలాంటి ప్రశ్నలు అడగకుండా విని, మా తీర్పు ఇవ్వాలి.. లేదా మేం ప్రశ్నలు వేయాలి. మేం ప్రశ్నలు అడిగితే మీరు ఆశ్చర్యపోతున్నారు. మేం ఏం చేయాలి?’ అని వ్యాఖ్యానించింది. విచారణ వాయిదా వేయటానికి నిరాకరించింది.


