breaking news
abhimanyu mithun
-
భారత జట్టుకు ఘోర పరాభవం.. ‘పసికూన’ల చేతిలో చిత్తు
మాంగ్ కాక్ వేదికగా హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నమెంట్లో శుభారంభం అందుకున్న భారత జట్టు దానిని కొనసాగించలేకపోతోంది. తొలి మ్యాచ్లో దినేశ్ కార్తిక్ సేన పాకిస్తాన్పై గెలుపొందిన విషయం తెలిసిందే. రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్స్లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించడంతో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయ్యింది. పాక్పై గెలుపుపూల్ ‘సి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో పాక్పై గెలుపొందింది. భారత్ మొదట నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు. మొహమ్మద్ షహజాద్ 2, అబ్దుల్ సమద్ ఒక వికెట్ తీశారు. అనంతరం వర్షం వల్ల లక్ష్యాన్ని 3 ఓవర్లలో 44 పరుగులుగా సవరించారు.అయితే పాక్ ఈ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఖాజా నఫే (9 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), సమద్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. స్టువర్ట్ బిన్నీకి ఒక వికెట్ దక్కింది. 14 బంతుల్లోనేఈ క్రమంలో శనివారం తమ మొదటి మ్యాచ్లో భారత్ కువైట్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన డీకే సేన... కువైట్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత ఆరు ఓవర్లలో కువైట్ ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.ఓపెనర్లు అద్నాన్ ఐద్రీస్ (6), మీట్ భావ్సర్ (0), వికెట్ కీపర్ బ్యాటర్ రవీజా సందరువాన్ (7) పూర్తిగా విఫలం కాగా.. యాసిన్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. కేవలం 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో ఏకంగా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో మొహమద్ షఫీక్ నాలుగు బంతుల్లో 9 పరుగులు చేశాడు.భారత బౌలర్లలో అభిమన్యు మిథున్ రెండు, షాబాజ్ నదీం, స్టువర్ట్ బిన్ని, దినేశ్ కార్తిక్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 5.4 ఓవర్లలో కేవలం 79 పరుగులే చేసి ఆలౌట్ అయింది.మూకుమ్మడిగా విఫలం.. కువైట్ చేతిలో చిత్తుఓపెనర్లలో రాబిన్ ఊతప్ప డకౌట్ కాగా.. ప్రియాంక్ పాంచల్ (10 బంతుల్లో 17).. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ దినేశ్ కార్తిక్ (8), స్టువర్ట్ బిన్నీ (2) కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఆఖర్లో అభిమన్యు మిథున్ (9 బంతుల్లో 26), షాబాజ్ నదీమ్ (8 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా.. జట్టును గట్టెక్కించలేకపోయారు. ఫలితంగా డీకే సేన కువైట్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.యూఏఈతో మ్యాచ్అనంతరం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన డీకే సేన తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు భరత్ చిప్లి (4 బంతుల్లో 4), ప్రియాంక్ పాంచల్ (0) దారుణంగా విఫలం కాగా.. బిన్నీ సైతం డకౌట్ అయ్యాడు.ఆకాశమే హద్దుగా మిథున్ఇలాంటి దశలో అభిమన్యు మిథున్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అయితే, అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడం ప్రభావం చూపింది.ఇక దినేశ్ కార్తిక్ 14 బంతుల్లో 42, షాబాజ్ నదీమ్ రెండు బంతుల్లో 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత ఆరు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన భారత్ 107 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో నీలాన్ష్ కేశ్వాణి రెండు వికెట్లు తీయగా.. అన్ష్ టాండన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.కెప్టెన్ ఖలీద్ షా గెలిపించాడుఇక యూఏఈ ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ ఖలీద్ షా 14 బంతుల్లో 50 పరుగుల (రిటైర్డ్ హర్ట్)తో విధ్వంసం సృష్టించగా.. సాఘిర్ ఖాన్ 11 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. అన్ష్ టాండన్ (2) విఫలమైనా.. ముహమ్మద్ అర్ఫాన్ (5 బంతుల్లో 20) సునామీ ఇన్నింగ్స్తో చెలరేగాడు. అతడికి తోడుగా కేశ్వాణి (2 బంతుల్లో 5) రాణించగా.. 5.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఫలితంగా భారత జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో యూఏఈ గెలుపొందింది. కాగా క్రికెట్ ప్రపంచంలో పసికూనలుగా పరిగణించే కువైట్, యూఏఈ.. డీకే సేనను చిత్తు చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే -
ఇంగ్లండ్తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో (International Masters League-2025) భారత మాస్టర్స్ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్తోనే ప్రారంభమైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలు, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో భారత్.. శ్రీలంక మాస్టర్స్ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి విండీస్ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో భారత మాస్టర్స్ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్ మాస్టర్స్తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ జట్టు స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ధవల్ కులకర్ణి 3, అభిమన్యు మిథున్, పవన్ నేగి తలో 2, వినయ్ కుమార్ ఓ వికెట్ పడగొట్టారు. ఒక ఓవర్ వేసిన స్టువర్ట్ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్ పఠాన్ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో డారెన్ మ్యాడీ (25) టాప్ స్కోరర్గా నిలువగా.. టిమ్ ఆంబ్రోస్ (23), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (14), టిమ్ బ్రేస్నన్ (16), క్రిస్ స్కోఫీల్డ్ (18 నాటౌట్), క్రిస్ ట్రెమ్లెట్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిల్ మస్టర్డ్ 8, మాస్కరెన్హాస్ 6, స్టీవ్ ఫిన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ సీజన్తోనే ప్రారంభమైంది. ఈ లీగ్లో ఆరు దేశాలు (భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీలుచ, స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో భారత్.. శ్రీలంక మాస్టర్స్ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్ మట్టికరిపించింది. తొలి మ్యాచ్లో భారత్ తరఫున స్టువర్ట్ బిన్నీ (68), యుసఫ్ పఠాన్ (56 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్ సిమన్స్ (94 నాటౌట్), డ్వేన్ స్మిత్ (51) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి విండీస్ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్కు సచిన్ టెండూల్కర్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ తరఫున అంబటి రాయుడు, యువరాజ్ సింగ్ లాంటి స్టార్లు ఆడుతున్నారు.భారత మాస్టర్స్ జట్టు..అంబటి రాయుడు (వికెట్కీపర్), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్ఇంగ్లండ్ మాస్టర్స్ జట్టు..ఫిల్ మస్టర్డ్ (వికెట్కీపర్), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్బాటమ్ -
ఈ ‘టీమిండియా క్రికెటర్’ ప్రముఖ నటి రాధికా శరత్కుమార్ అల్లుడు (ఫొటోలు)
-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త నో బాల్.. వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్లో భాగంగా శనివారం చెన్నై బ్రేవ్స్- నార్తర్న్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో నార్తర్న్ వారియర్స్ బౌలర్ అభిమన్యు మిథున్ విచిత్రమైన నో బాల్ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్ ఇన్నింగ్స్ 5 ఓవర్లో మిథన్ వేసిన నో బాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 5 ఓవర్లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్ ఓవర్ స్టేప్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నో బాల్గా ప్రకటించాడు. అయితే రిప్లేలో అతడు ఫుట్కు క్రీజుకు మధ్య దూరం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు క్రీజు నుంచి చాలం దూరంలో తన ఫుట్ను ల్యాండ్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నోబాల్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వారియర్స్ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్రేవ్స్ 9.7 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. What's happening in the T10 League? 🤦🏽♂️🤦🏽♂️ #AbuDhabiT10 pic.twitter.com/FGcbshIhPz — Farid Khan (@_FaridKhan) December 2, 2023 -
టైటిల్ వేటలో మెరిసిన రాహుల్, అగర్వాల్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో కర్ణాటక(వీజేడీ పద్ధతిలో) 60 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 253 పరుగులు సాధించగా, అందుకు ధీటుగా బ్యాటింగ్ చేసింది కర్ణాటక. 23 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 146 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడటంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆపై ఫలితం కోసం వీజేడీ పద్ధతిని అవలంభించి కర్ణాటకను విజేతగా తేల్చారు. కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్(52 నాటౌట్; 72 బంతుల్లో 5ఫోర్లు), మయాంక్ అగర్వాల్(69 నాటౌట్; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరిశారు. వీరిద్దరూ అజేయంగా 112 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కర్ణాటకను పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ టోర్నీలో కేఎల్ రాహుల్ 598 పరుగులు సాధించాడు. భారత ఇంజనీర్ వి జయదేవన్ రూపొందించిన వీజేడీ పద్ధతిని మ్యాచ్ రద్దయిన పరిస్థితుల్లో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా భారత్లో జరిగే దేశవాళీ టోర్నీలో వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్- మురళీ విజయ్లు ఇన్నింగ్స్ను ఆరంభించారు అయితే మురళీ విజయ్ డకౌట్గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్(66), విజయ్ శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి తమిళనాడును దెబ్బకొట్టాడు. మొత్తంగా ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక బౌలర్లలు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్లకు తలో వికెట్ లభించింది. (ఇక్కడ చదవండి: హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు..!) -
హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు..!
బెంగళూరు: కర్ణాటక పేసర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ వికెట్లతో ఇరగదీశాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మిథున్ ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ ఐదు వికెట్లలో హ్యాట్రిక్ సాధించడంతో అరుదైన ఘనతను నమోదు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో హ్యాటిక్ర్ వికెట్లు సాధించిన తొలి కర్ణాటక బౌలర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో మిథున్ అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో తమిళనాడు 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. చివరి ఓవర్ మూడో బంతికి షారుఖ్(27) వికెట్ సాధించిన మిథున్.. ఆపై వరుస రెండు బంతుల్లో ఎమ్ మహ్మద్((10), మురుగన్ అశ్విన్(0)లను పెవిలియన్కు పంపించాడు. ఫలితంగా హ్యాట్రిక్ వికెట్ ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచిన కర్ణాటక తొలుత తమిళనాడును బ్యాటింగ్కు ఆహ్వానించింది. దాంతో అభినవ్ ముకుంద్- మురళీ విజయ్లు ఇన్నింగ్స్ను ఆరంభించారు అయితే మురళీ విజయ్ డకౌట్గా పెవిలియన్ చేరితే ముకుంద్(85) రాణించాడు. అటు తర్వాత బాబా అపరాజిత్(66), విజయ్ శంకర్(38)లు ఆకట్టుకోవడంతో తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కర్ణాటక బౌలర్లలు మిథున్ ఐదు వికెట్లకు జతగా, కౌశిక్ రెండు వికెట్లు సాధించాడు. ప్రతీక్ జైన్, కృష్ణప్ప గౌతమ్లకు తలో వికెట్ లభించింది. -
23న నటి రాధిక కుమార్తె నిశ్చితార్థం
చెన్నై : ప్రముఖ నటి, రాడాన్ సంస్థ అధినేత్రి రాధిక త్వరలో అత్తయ్య హోదా పొందనున్నారు. ఆమె కూతురు రెయాన్ వివాహ నిశ్చితార్థం ఈ నెల 23 న చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని రాధికనే స్వయంగా ట్విట్ చేసింది. తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని అందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసింది. ఇంగ్లాండ్లోని లిట్స్ విశ్వవిద్యాలయంలో క్రీడారంగం విభాగంలో ఎంఏ చదివిన రెయాన్ ప్రస్తుతం రాడాన్ సంస్థకు సహాయ నిర్వాహకురాలిగా వ్యవహరిస్తోంది. రెయాన్కు క్రికెట్ క్రీడాకారుడు అభిమన్యు మిథున్కు ఈ నెల 23 న చెన్నైలో వివాహనిశ్చితార్థం జరపనున్నట్లు నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు, ఎస్ఎంకే నేత శరత్కుమార్ వెల్లడించారు. వివాహ తేదీని నిశ్చితార్థం రోజు వెల్లడించనున్నట్లు శరత్కుమార్ తెలిపారు. కాగా అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టులో క్రీడాకారుడు. అతడు మంచి బౌలర్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో త్వరలో వీరి వివాహాన్ని ఘనంగా జరిపేందుకు ఇరు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. -
సెంట్రల్ జోన్ 123/5 : దులీప్ ట్రోఫీ
చెన్నై: సౌత్ జోన్ పేసర్ అభిమన్యు మిథున్ (3/24) పదునైన బంతులతో రెచ్చిపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీస్లో సెంట్రల్ జోన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడింది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసేసమయానికి సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 123 పరుగులు చేసింది. వర్షం కారణంగా పూర్తి స్థాయి ఓవర్లు ఆడేందుకు వీలు పడలేదు. మూడో ఓవర్ నుంచే మిథున్ ప్రత్యర్థి ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. దీంతో 13 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన సెంట్రల్ను ఓపెనర్ ముకుల్ దాగర్ (105 బంతుల్లో 45; 6 ఫోర్లు) కొద్దిసేపు ఆదుకున్నాడు. బిస్త్ (18)తో కలిసి మూడో వికెట్కు 56 పరుగులు జోడించాడు. తనను కూడా మిథున్ పెవిలియన్కు చేర్చడంతో సెంట్రల్ కష్టాల్లో పడింది. నార్త్ జోన్ 33/0 కొచ్చి: మరో సెమీఫైనల్కు వర్షం అడ్డంకిగా నిలి చింది. దీంతో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య జరుగుతున్న ఈ 4 రోజుల మ్యాచ్లో కేవలం 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన నార్త్ జోన్ నిదానంగా ఆడడంతో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేయగలిగింది. క్రీజులో జీవన్జ్యోత్ (18), ఉన్ముక్త్ చంద్ (12) ఉన్నారు.


