breaking news
In the 14th Finance Commission
-
నేడు నగరానికి 14వ ఆర్థిక సంఘం
రాజ్భవన్లో సంఘం సభ్యులకు గవర్నర్ విందు రేపు సీఎం, మంత్రులు, అధికారులతో సభ్యుల సమావేశం హైదరాబాద్: వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం గురువారం హైదరాబాద్కు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్థిక సంఘం ప్రతినిధులు శుక్రవారం సమావేశమై వారితో చర్చించిన తరువాత నివేదిక తీసుకోనున్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులకు గురువారం గవర్నర్ నరసింహన్ రాజ్భవన్లో విందు ఇస్తున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రీన్ల్యాండ్స్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు మధ్యాహ్నం వరకు సమావేశమై ప్రభుత్వ కోర్కెల చిట్టా వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచి రాజకీయ పార్టీల నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు కమిషన్ను కలువనున్నారు. శుక్రవారం రాత్రికి సీఎం కేసీఆర్ ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున.. చేపట్టనున్న కొత్త పథకాలకు విరివిగా నిధులిచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. శనివారంనాడు కమిషన్ సభ్యులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. సీఎం సమీక్ష.. 14వ ఆర్థిక సంఘాన్ని కోరే అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వాటర్గ్రిడ్, పోలీసు వ్యవస్థ బలోపేతం, రహదారుల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల, సలహాదారులు పాపారావు, జీఆర్రెడ్డి, సీఎస్ రాజీవ్శర్మ, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక సంఘం ముందూ ‘ఆవు కథ’లేనా?
సర్కారు వైఖరిని దుయ్యబట్టిన తమ్మినేని సీతారాం హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాల్సిన ఈ తరుణంలోనూ సీఎం చంద్రబాబు 14వ ఆర్థిక సంఘం అధికారుల ముందూ తన పాత ‘ఆవు కథ..’నే ఎత్తుకొని రాజకీయ ఉపన్యాసాలు చేయడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం నడుచుకునే ఆర్థిక సంఘం ప్రతినిధుల ఎదుట ప్రభుత్వం బాధ్యతాయుతంగా రాష్ట్రావసరాలను విని పించి ఉండాల్సిందని పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం చెప్పారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా రాష్ట్రంలో అక్షరాస్యత, స్థూల జాతీయోత్పత్తి, జనాభా నియంత్రణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని నిధులను కేటాయించడం ఆర్థిక సంఘం బాధ్యతని... అక్షరాస్యత పెరిగితే రాష్ట్రాలకు నిధులు కేటాయింపు తగ్గించే ఇప్పుడున్న నిబంధనలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మనలాంటి రాష్ట్రాలకు నిరాశకలిగించేవన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటి నిబంధలనుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరి ఉండాల్సిందనీ.. దీనికితోడు రాష్ట్రంలో కేంద్రం వసూలు చేసే పన్నుల మొత్తంలో ఇప్పుడు కేటాయిస్తున్న 33 శాతం కాకుండా 50 శాతం కేటాయించాలని కోరి ఉండాల్సిందన్నారు. చంద్రబాబు మాత్రం గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రం వెనక్కి వెళ్లిందన్న పాత విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు.