మాట నిలబెట్టుకునే వంశం వైఎస్‌ఆర్‌దే.. | ys sharmila Visitation trip | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకునే వంశం వైఎస్‌ఆర్‌దే..

Aug 16 2015 1:55 AM | Updated on Sep 3 2017 7:30 AM

మాట నిలబెట్టుకునే వంశం వైఎస్‌ఆర్‌దే..

మాట నిలబెట్టుకునే వంశం వైఎస్‌ఆర్‌దే..

రాష్ట్రంలో మాట నిలబెట్టుకునే వంశం ఒక్క వైఎస్‌ఆర్‌దేనని...

షర్మిల పరామర్శయాత్ర కోసం రూట్ సర్వే చేసిన నేతలు
జనగామ:
రాష్ట్రంలో మాట నిలబెట్టుకునే వంశం ఒక్క వైఎస్‌ఆర్‌దేనని... ఆ ఘనత ఆ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకులు కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షులు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, భీష్వ రవీందర్ అన్నారు. మహానేత వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు రానున్న వైఎస్ జగన్ సోదరి షర్మిల యాత్రకోసం శనివారం వీరు రూట్ సర్వే చేశారు.

జిల్లాలోని చేర్యాల, మద్దూరు మండలం భైరాన్‌పల్లి, బచ్చన్నపేట మండలం కట్కూరు, బండనాగారం, కేశిరెడ్డిపల్లి, ఆలీంపూర్, బచ్చన్నపేట, పోచన్నపేటలోని మూడు గ్రామాల్లోని 9 కుటుంబాలతో పాటు అలువాల యాదగిరి కుటుంబం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను నేరుగా కలుసుకుని పరామర్శించేందుకు షర్మిల ఈ నెల చివరి వారంలో పర్యటించనున్నారని వివరించారు. లక్షలాది మంది పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క వైఎస్‌కే దక్కుతుందని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement