నోట్లపై కూడా ఉప్పులాగే వదంతులు: వెంకయ్య | will not go back on demonitization of notes, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

నోట్లపై కూడా ఉప్పులాగే వదంతులు: వెంకయ్య

Nov 14 2016 7:42 PM | Updated on Sep 27 2018 9:11 PM

నోట్లపై కూడా ఉప్పులాగే వదంతులు: వెంకయ్య - Sakshi

నోట్లపై కూడా ఉప్పులాగే వదంతులు: వెంకయ్య

ఉన్నట్టుండి ఉప్పు కొరత ఏర్పడిందంటూ వదంతులు వచ్చాయని, అవి ఎంత అబద్ధమో.. నోట్ల విషయంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నది కూడా అంతే అబద్ధమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.

ఉన్నట్టుండి ఉప్పు కొరత ఏర్పడిందంటూ వదంతులు వచ్చాయని, అవి ఎంత అబద్ధమో.. నోట్ల విషయంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయన్నది కూడా అంతే అబద్ధమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమేర సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని తీర్చడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోస్టాఫీసులలో నోట్లు మార్చుకోడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే 1.20 లక్షల మంది బ్యాంకుమిత్ర (బ్యాంకింగ్ కరస్పాండెంట్లు) కూడా త్వరలోనే యాక్టివేట్ అవుతారని ఆయన చెప్పారు. 
 
 
Advertisement
 
Advertisement
Advertisement