దేశ రాజధాని నడిబొడ్డున గతేడాది డిసెంబరులో ‘నిర్భయ’పై జరిగిన దారుణ కీచకకాండకు సంబంధించిన కేసులో ఈ నెల 10న తీర్పు వెలువడనుంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున గతేడాది డిసెంబరులో ‘నిర్భయ’పై జరిగిన దారుణ కీచకకాండకు సంబంధించిన కేసులో ఈ నెల 10న తీర్పు వెలువడనుంది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ మంగళవారం పూర్తి అయింది. తీర్పును అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా ఈ నెల 10కి వాయిదా వేశారు. ఈ కేసు నిందితుల్లో దోషిగా తేలిన మైనర్కు ఇటీవల జువెనైల్ న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.