ప్రైవేటు బస్సులో రూ.20 లక్షలతో పట్టుబడ్డ యువకుడు | Unaccounted money seized from Rajasthan youth | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సులో రూ.20 లక్షలతో పట్టుబడ్డ యువకుడు

Mar 10 2014 5:59 PM | Updated on Sep 2 2017 4:33 AM

ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది.

కోయంబత్తూర్: ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ  పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది.  అనుమానస్పదంగా  ఓ సిటీ బస్సు ఎక్కిన రాజస్థాన్ కు చెందిన వికాస్ అనే యువకుడ్ని పోలీసులు సోదా చేయగా రూ.20 లక్షలు బయటపడ్డాయి. తొలుత అతని బ్యాగ్ లో  లభించిన రూ.15లక్షల భారీ మొత్తాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆ యువకుడు డ్రెస్ లోపలి భాగంలో కూడా  తనిఖీ చేయగా మరో రూ.5లక్షలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

 

ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో  బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన కరెన్సీ తాను తీసుకువెళుతున్నట్లు ఆయువకుడు పోలీసులకు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement