ముజఫర్ నగర్ లో మళ్లీ మత ఘర్షణలు, ఉద్రిక్తత! | Tension in communal clash hit Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ముజఫర్ నగర్ లో మళ్లీ మత ఘర్షణలు, ఉద్రిక్తత!

Oct 31 2013 10:55 AM | Updated on Sep 2 2017 12:10 AM

ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు మళ్లీ ఉద్రిక్తతని పెంచాయి.

ఉత్తర ప్రదేశ్ లో ముజఫర్ నగర్ లో మత ఘర్షణలు మళ్లీ ఉద్రిక్తతని పెంచాయి. బుధవారం రాత్రి మొదలైన ఘర్షణలు గురువారం నాటికి కూడా కొనసాగుతునే ఉన్నాయి. దాంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ అల్లర్లలో 8 మందిని అరెస్ట్ చేశామని.. 15 కేసులు నమోదు చేశామని తెలిపారు. బుధవారం రాత్రి షామ్లీ జిల్లాలో ఫుగునాలో ఓ జంటపై కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. పోలీస్ అధికారులను దియో రాజ్ నగర్ కి పంపి... ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
 
సెప్టెంబర్ 6 నుంచి 10 తేది వరకు మీరట్, షామ్లిలలో జరిగిన మత ఘర్షణల్లో 63 మంది మరణించగా, 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement