'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు' | seemandhra employees should be sent back, says Srinivas Goud | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు'

May 8 2014 5:40 PM | Updated on Jun 2 2018 4:41 PM

'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు' - Sakshi

'సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దు'

సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేత శ్రీనివాసగౌడ్ తెలిపారు.

న్యూఢిల్లీ: సీమాంధ్ర ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరినట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) నేత శ్రీనివాసగౌడ్ తెలిపారు. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని చెప్పారు. ఖాళీలు లేవన్న నెపంతో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో ఉంచొద్దని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు.

సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వొద్దని కోరామని చెప్పారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని సూచించామన్నారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి వారి సొంత ప్రాంతానికి పంపాలని కోరినట్టు తెలిపారు. అపాయింటెడ్ డే మార్చడం కుదురదని హోంశాఖ తేల్చి చెప్పిందని శ్రీనివాసగౌడ్  వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement