కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు ... జాగ్రత్త! | Palle Raghunatha reddy takes on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు ... జాగ్రత్త!

Jun 10 2015 2:44 PM | Updated on Mar 28 2019 5:34 PM

కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు ... జాగ్రత్త! - Sakshi

కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు ... జాగ్రత్త!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబపై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు... జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబపై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారు... జాగ్రత్తగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్లో పల్లె రఘునాథరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. తమ సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ చేయడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. ఈ విషయంపై తాము స్పందించబోమని పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement