హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే మీడియా కంపెనీ టీవీ9 గ్రూప్ మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి వైదొలగడంలో జాప్యం జరుగుతోందని వెంచర్ క్యాపిటలిస్ట్, పీపుల్ క్యాపిటల్ ఎండీ శ్రీని రాజు చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో తమతో పాటు మరికొందరు ఇన్వెస్టర్లకు సుమారు 80 శాతం వాటాలు ఉన్నాయని వివరించారు. మొత్తం మీద ఇందులో రూ. 100 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు.
బుధవారం ఇక్కడ జరిగిన ‘టై ఎంట్రప్రెన్యూరియల్ సమిట్’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీని రాజు ఈ విషయాలు వివరించారు. రుణ సంక్షోభంలో చిక్కుకున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ వ్యవహారం చాలా సంక్లిష్టమైనదని రాజు చెప్పారు. ఇది తమలాంటి ఇన్వెస్టర్లకు అనువైనది కాదన్నారు. గతంలో ఇన్వెస్ట్ చేసిన కొన్ని సంస్థల నుంచి వచ్చే రెండు, మూడేళ్లలో వైదొలుగుతున్నామని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశం గడ్డు కాలం ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. భారత ఎకానమీకి అంత మంచిది కాదని చెప్పారు. అయితే, కష్టకాలంలోనే నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని, పేరొందిన అనేక కంపెనీలు ఇలాంటి సమయాల్లోనే ఆవిర్భవించాయని రాజు వివరించారు. పరిస్థితులకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ 7-8 శాతం వృద్ధి సాధిస్తున్న పక్షంలో అందరికీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని ఆయన చెప్పారు.
‘టై’ సదస్సు..
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తగిన వేదిక కల్పించే ఉద్దేశంతో డిసెంబర్ 18-20 దాకా ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) సంస్థ 7వ ఎంట్రప్రెన్యూరియల్ సదస్సు (టెస్ 2013) నిర్వహిస్తోంది. అమెరికా, యురప్ సహా పలు దేశాల నుంచి సుమారు 2,000 నుంచి 3,000 మంది పైచిలుకు డెలిగేట్లు, సుమారు 100 మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొంటున్నారని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళి బుక్కపట్నం చెప్పారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్లో నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు.. ఇన్వెస్టర్లను కలుసుకునేందుకు, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇది తోడ్పడగలదని మురళి వివరించారు.
పరిస్థితులు అనుకూలించకే టీవీ9 ఎగ్జిట్లో జాప్యం
Published Thu, Oct 10 2013 1:11 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement