కేసీఆర్ స్పందించడం లేదు | nagam janardhan reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

కేసీఆర్ స్పందించడం లేదు

Oct 4 2015 2:14 PM | Updated on Mar 29 2019 9:07 PM

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సొంత జిల్లాలో ఆత్మహత్యలు జరిగినా స్పందించడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించాలను కోరుతూ నాగం జనార్దన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కిసాన్ బచావో దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ... ప్రభుత్వం చేసిన అప్పుల్లో రైతులకు కేటాయించిన భాగం ఎంత అన్ని కేసీఆర్ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. రుణమాఫీ తీర్చడానికి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని కేంద్రం వద్దకు వెళ్లాలని కేసీఆర్ సర్కార్కు సూచించారు.  ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి భారీ ఎత్తున రైతులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement