సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా? | nagam janardhan reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా?

Sep 10 2015 1:23 PM | Updated on Sep 29 2018 7:10 PM

సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా? - Sakshi

సీఎం,మంత్రులు చైనాలో విహారయాత్రలా?

రాష్ట్ర పరిపాలనపై కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనపై కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఏర్పడిన కరువుపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్లో ఊరూరా ఆత్మహత్యలు జరిగినా కేసీఆర్ మాత్రం కసాయిలా  వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే... సీఎం, మంత్రులు చైనాలో విహారయాత్రలు చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అని నాగం విమర్శించారు. రైతులకు కరువు భత్యం చెల్లించాలని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement