మధ్యప్రదేశ్లో 71శాతానికి పైగా పోలింగ్ నమోదు | Madhya Pradesh registers highest ever polling of above 70 per cent | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్లో 71శాతానికి పైగా పోలింగ్ నమోదు

Nov 25 2013 6:49 PM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్లో 71శాతానికి పైగా పోలింగ్ నమోదు - Sakshi

మధ్యప్రదేశ్లో 71శాతానికి పైగా పోలింగ్ నమోదు

రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం జరిగిన పోలింగ్లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్: రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం జరిగిన పోలింగ్లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  2014 సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్న మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఉదయం 8 గం.లకు ఆరంభమైయ్యాయి. . మధ్యప్రదేశ్ 230 అసెంబ్లీ స్థానాల కోసం పోలింగ్ జరిగింది.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో ఓటర్లు  భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ లో గతంలో ఎప్పుడూ లేనంతగా పోలింగ్ నమోదు కావడంతో అభ్యర్థులు విశ్లేషణలో మునిగిపోయారు.
 

మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో మొత్తం 2,583 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 4,64,57,724 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధ్నీ, విదిష స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఆయన నాయకత్వంలో ‘అభివృద్ధి’ మంత్రంతో బీజేపీ హ్యాట్రిక్ సాధించి రికార్డు నెలకొల్పాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఎన్నికల్లో సీఎల్పీ నేత అజయ్ సింగ్ కాంగ్రెస్ శిబిరానికి నాయకత్వం వహిస్తున్నారు.  ఆయన చుర్హత్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బుధ్నీలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement