'జన ధన ఖాతాల్లో రూ.15 వేలు వేయాలి' | Lalu to march to BJP hq demanding money in Jan Dhan accounts | Sakshi
Sakshi News home page

'జన ధన ఖాతాల్లో రూ.15 వేలు వేయాలి'

Jan 28 2015 8:16 PM | Updated on Sep 2 2017 8:25 PM

'జన ధన ఖాతాల్లో రూ.15 వేలు వేయాలి'

'జన ధన ఖాతాల్లో రూ.15 వేలు వేయాలి'

జన ధన యోజన ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.

పాట్నా: జన ధన యోజన ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రతి ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీయిచ్చిందని గుర్తు చేశారు.

ఎన్డీఏ ప్రభుత్వం హామీ నిలుపుకోకుంటే మార్చి 15న ర్యాలీ చేపడతానని ఆయన ప్రకటించారు. పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తానని ఆయన తెలిపారు. జన ధన యోజన ఖాతాల్లో వెంటనే డబ్బు జమ చేయాలని కేంద్రాన్ని లాలూ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement