కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష? | kuchibotla case, US man indicted on hate crime charges | Sakshi
Sakshi News home page

కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష?

Jun 10 2017 7:26 PM | Updated on Sep 5 2017 1:17 PM

కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష?

కూచిభొట్ల కేసు: నిందితుడికి ఉరిశిక్ష?

అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగు యువకుడు శ్రీనివాస్‌ కూచిభొట్ల కేసు విచారణ తుది దశకు చేరింది.

కాన్సాస్‌: అమెరికాలో దారుణహత్యకు గురైన తెలుగు యువకుడు శ్రీనివాస్‌ కూచిభొట్ల కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ కేసులో నిందితుడైన ఆడమ్‌ పురింటన్‌పై జాత్యాహంకార దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేశారు. ఫిబ్రవరి 22న కాన్సాస్‌లో శ్రీనివాస్‌ను హత్య చేసి.. మరో ఇద్దరిని నిందితుడు ఆడమ్‌ పురింటన్‌ గాయపరిచాడు. 
 
ఈ కేసులో నిందితునికి ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. తమ దేశం విడిచి వెళ్లండి అంటూ బిగ్గరగా అరుస్తూ నిందితుడు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి కోర్టుకు తెలిపాడు. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘటనలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోగా.. మరో ప్రవాసుడు ఆలోక్‌ మాదసాని గాయపడ్డారు. వీరిని కాపాడేందుకు యత్నించిన 24 ఏళ్ల అమెరికన్‌ ఇయాన్‌ గ్రిల్లాట్‌ కూడా తీవ్రగాయాలపాలయ్యాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement