ఇది ప్రజావిజయం, ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్ | It is peoples' victory, says Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

ఇది ప్రజావిజయం, ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్

Dec 8 2013 4:46 PM | Updated on Sep 2 2017 1:24 AM

ఇది ప్రజావిజయం, ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్

ఇది ప్రజావిజయం, ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్

ఢిల్లీలో ప్రజలు తమకు అందించిన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నారు. ఇది ప్రజా విజయమని, ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు.

ఢిల్లీలో ప్రజలు తమకు అందించిన విజయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నారు. ఇది ప్రజా విజయమని, ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు. కనాట్ ప్లేస్లోని హనుమాన్ రోడ్డులో గల పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటూ నృత్యాలు చేస్తుండగా వారికి చేతులు ఊపుతూ అభివాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఆయన తమ పార్టీ కార్యాలయం మొదటి అంతస్థు నుంచే అభివాదాలు తెలిపారు.

ఆయన మద్దతుదారులు పార్టీ ఎన్నికల గుర్తు అయిన చీపురు కట్టలను చూపిస్తూ హర్షధ్వానాలు చేశారు. తమ పార్టీ విజయం పట్ల తనకు ఎప్పుడూ విశ్వాసం ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షీలా దీక్షిత్పై ఆయన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పక్కనే నిలబడిన ఆప్ నాయకుడు కుమార్ విశ్వాస్ మైకు తీసుకుని, గట్టిగా, 'భారత్ మాతాకీ జై', 'ఆమ్ ఆద్మీ హై హమ్, హమ్ ఆమ్ ఆద్మీ హై' అంటూ నినదించారు.

Advertisement
 
Advertisement
Advertisement