* హెల్మెట్ వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టంచేసిన హైకోర్టు
* ఇప్పటి వరకు ఎందరికి రూ100, రూ.300 జరిమానా విధించారని ప్రశ్న
* పూర్తి వివరాలతో నివేదికను కోర్టు ముందుంచాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ వాడకంలో ఉల్లంఘనలకు పాల్పడేవారికి నిబంధనల మేరకు జరిమానా విధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. మొదటిసారి హెల్మెట్ ధరించకపోతే రూ.100, రెండోసారి నుంచి హెల్మెట్ ఉపయోగించని ప్రతీసారి రూ.300 జరిమానా విధించాలన్న చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేసింది. అప్పుడే హెల్మెట్ను వాహనదారులంతా ధరిస్తార ని పేర్కొంది. ఇప్పటివరకు ఎంత మందికి రూ.100 జరిమానా విధించారు? ఎందరికి రూ.300 జరిమానా విధించారన్న వివరాలతో స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్)ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జరిమానా ఎందుకు పెంచకూడదు?
హెల్మెట్ ధరించే విషయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. విచారణ ప్రారంభంగా కాగానే ధర్మాసనం స్పందిస్తూ.. హెల్మెట్ ధరించని వాహనదారులు ఎంతో మందిని చూస్తున్నామని, దీనిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వం తరఫు ప్రత్యేక న్యాయవాది అండపల్లి సంజీవ్కుమార్ను ప్రశ్నించింది.
ఇందుకు ఆయన బదులిస్తూ.. ఉన్నతస్థాయిలో సమావేశం జరిగిందని, హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయించారని తెలిపారు. ఇందుకు ధర్మాసనం.. నిర్ణయాలు, నిబంధనలను కాగితాలకే పరిమితం చేయవద్దని, ఆచరణలో చేసి చూపాలంది. గత పక్షం రోజుల్లో పది వేల మందిపై కేసులు నమోదు చేశామని సంజీవ్ చెప్పగా.. ఎంత మొత్తం జరిమానాగా విధించారని ధర్మాసనం ప్రశ్నించింది. చట్ట నిబంధనల మేరకు ఒక్కొక్కరికి రూ.100 విధించామని చెప్పగా.. ఆ మొత్తాన్ని ఎందుకు పెంచకూడదని ప్రశ్నించింది. జరిమానా మొత్తాల పెంపు కేంద్రం పరిధిలోనిదని సంజీవ్ చెప్పారు. జరిమానా భారీగా ఉండాలని, హెల్మెట్ ధరతో సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధిస్తే అందరూ హెల్మెట్ వాడతారని ధర్మాసనం తెలిపింది. ఇప్పటి వరకు ఎంత మందికి జరిమానా విధించారో పూర్తి వివరాలను తెలపాలని పేర్కొంది. హెల్మెట్ తప్పనిసరి వినియోగానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ నివేదికను సమర్పించాలంది.
జరిమానా నిబంధన అమలు చేయాల్సిందే
Published Tue, Sep 22 2015 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement