ఆఫ్ఘానిస్థాన్లో నలుగురు నాటో సైనికులు మృతి | Four NATO soldiers killed in Afghan operation | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘానిస్థాన్లో నలుగురు నాటో సైనికులు మృతి

Oct 6 2013 10:34 AM | Updated on Sep 1 2017 11:24 PM

దక్షిణ ఆఫ్ఘానిస్థాన్లో తీవ్రవాద దళాలు, సంకీర్ణ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నాటో సైనికులు మృతి చెందారు.

దక్షిణ ఆఫ్ఘానిస్థాన్లో ఈ రోజు తెల్లవారుజామున తీవ్రవాద దళాలు, సంకీర్ణ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నాటో సైనికులు మృతి చెందారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. దేశంలో తీవ్రవాదుల ఎరివేతలో భాగంగా నాటో సంకీర్ణ దళాలు ఈ రోజు తెల్లవారుజామున సంకీర్ణదళాలు తనిఖీలు చేపట్టాయి.

 

ఆ క్రమంలో నాటో సంకీర్ణ దళాలపై తీవ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో నలుగురు సైనికులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆఫ్ఘాన్లో 140 మంది విదేశీ సైనికులు మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఆఫ్ఘాన్లో తీవ్రవాద ప్రభావిత ప్రాంతంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన సంకీర్ణ దళాలు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement