- సీఎం కేసీఆర్పై సీఎల్పీ ఉపనాయకుడు జీవన్రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: వారసత్వ ఉద్యోగాలను ఇవ్వలేని టీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికారంలో కొనసాగే అర్హత లేదని సీఎల్పీ ఉపనాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలిస్తామని చెప్పి మూడేళ్లు దాటినా మోసపు మాటలు, చర్యలతో కాలం గడుపుతున్న టీఆర్ఎస్కు ఇవ్వడం చేతకాకుంటే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏడు జిల్లాల్లో బంద్ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ వారసత్వ ఉద్యోగాల కోసం గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన సర్క్యులర్ను సవరించి మళ్లీ జారీ చేయాలని జీవన్ రెడ్డి కోరారు. 1981లోనే వారసత్వ ఉద్యోగాలకు ఆమోదం తెలిపారని, 1998లో నిలిపివేశారని వివరించారు. అప్పటినుంచి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలన్న డిమాండు ఉందన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తామని టీఆర్ఎస్ అనుబంధ సంఘం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉత్తర్వులు జారీ చేసుకోవాలని హైకోర్టు చెప్పిందని, పాత వాటిని సవరించి మరో సర్క్యులర్ను జారీ చేయడానికి అవకాశం ఉందని జీవన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పంతాలకు పోయి కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వకుంటే తప్పుకో
Published Sat, Jun 17 2017 5:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement