మావోయిస్టుల కాల్పుల్లో  జవాను మృతి | BSF jawan killed in a gunbattle with Naxals | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కాల్పుల్లో  జవాను మృతి

Apr 13 2015 10:50 AM | Updated on Oct 9 2018 2:47 PM

చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కాంకేడ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఛత్తీస్‌ఘఢ్:  చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కాంకేడ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్న  మావోయిస్టులు సోమవారం బిఎస్ఎఫ్ క్యాంప్ పై దాడి చేశారు.    ఈ ఎదురుకాల్పుల్లో  తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ను  ఆసుపత్రికి తరలిస్తుండగా  మార్గమధ్యంలో చనిపోయినట్టు ఎస్పీ  జితేందర్ సింగ్ మీనా తెలిపారు.  గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించామని, మావోయిస్టులు సంఘటనా స్థలం నుంచి త ప్పించుకున్నారన్నారు.  కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా  నక్సల్స్ దాడికి తెగబడ్డారని ఎస్పీ జితేందర్ సింగ్ మీనా వెల్లడించారు.
కాగా శనివారం  ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చిన మావోయిస్టులు ఆదివారం 17 వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement