మావోయిస్టుల కాల్పుల్లో  జవాను మృతి | BSF jawan killed in a gunbattle with Naxals | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల కాల్పుల్లో  జవాను మృతి

Apr 13 2015 10:50 AM | Updated on Oct 9 2018 2:47 PM

చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కాంకేడ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఛత్తీస్‌ఘఢ్:  చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని కాంకేడ్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వరుస దాడులతో హడలెత్తిస్తున్న  మావోయిస్టులు సోమవారం బిఎస్ఎఫ్ క్యాంప్ పై దాడి చేశారు.    ఈ ఎదురుకాల్పుల్లో  తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ ను  ఆసుపత్రికి తరలిస్తుండగా  మార్గమధ్యంలో చనిపోయినట్టు ఎస్పీ  జితేందర్ సింగ్ మీనా తెలిపారు.  గాయపడిన జవాన్లను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించామని, మావోయిస్టులు సంఘటనా స్థలం నుంచి త ప్పించుకున్నారన్నారు.  కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుండగా  నక్సల్స్ దాడికి తెగబడ్డారని ఎస్పీ జితేందర్ సింగ్ మీనా వెల్లడించారు.
కాగా శనివారం  ఏడుగురు ఎస్టీఎఫ్ జవాన్లను హతమార్చిన మావోయిస్టులు ఆదివారం 17 వాహనాలకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement