సీఎం బర్త్డే వేడుకల్లో 11 మందికి గాయాలు | 11 students injured during Odisha CM's birthday celebrations | Sakshi
Sakshi News home page

సీఎం బర్త్డే వేడుకల్లో 11 మందికి గాయాలు

Oct 16 2015 3:19 PM | Updated on Sep 3 2017 11:04 AM

సీఎం బర్త్డే వేడుకల్లో 11 మందికి గాయాలు

సీఎం బర్త్డే వేడుకల్లో 11 మందికి గాయాలు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ బెలూన్ పేలడంతో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో భువనేశ్వర్ రమాదేవి మహిళ యూనివర్సిటీకి చెందిన 9మంది విద్యార్థినులు ఉన్నారు.

శుక్రవారం విద్యార్థులు నవీన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారు.  బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ కార్యాలయం వద్ద గ్యాస్ బెలూన్ పేలడంతో విద్యార్థులు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ముఖం, చేతులపై కాలిన గాయాలయ్యాయని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ వినోద్ మిశ్రా చెప్పారు. బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. బెలూన్కు సమీపంలో టపాకాయను కాల్చడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ ఆర్పీ శర్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement