'వంద రోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు' | 100-days of Modi's rule has not benefitted people, says G K Vasan | Sakshi
Sakshi News home page

'వంద రోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు'

Sep 7 2014 8:29 PM | Updated on Aug 15 2018 2:51 PM

నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ విమర్శించారు.

మధురై: నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ విమర్శించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని ఆయన అన్నారు.  అయితే ఏవిధంగా మేలు జరలేదన్న దానిపై వివరించేందుకు ఆయన ఇష్టపడలేదు.

మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం కృషి చేయాలన్నారు. చైనా నుంచి బాణాసంచా దిగుమతులను నిషేధించాలని ఆయన కోరారు. బాణాసంచా దిగుమతికి అనుమతిస్తే శివకాశితో సహా  దక్షిణ తమిళనాడులో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడతారని వాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement