వైద్యుడి కోసం రాస్తారోకో | villagers protest for doctor in dandepalli | Sakshi
Sakshi News home page

వైద్యుడి కోసం రాస్తారోకో

Sep 19 2015 3:16 PM | Updated on Sep 3 2017 9:38 AM

ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుడిని నియమించాలంటూ గ్రామస్తులు, రోగులు ఆందోళనకు దిగారు.

దండేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన వైద్యుడిని నియమించాలంటూ గ్రామస్తులు, రోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన  ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు.. దండేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం ఇన్‌చార్జి డాక్టర్ మాత్రమే ఉన్నారు.

శాశ్వత వైద్యుడు లేకపోవటంతో సేవలు సరిగా అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఎదుట రహదారిపై శనివారం మధ్యాహ్నం రాస్తారోకోకు దిగారు. దీంతో ఇన్‌చార్జి వైద్యుడు నవీన్ వారి వద్దకు వచ్చి.. సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement