విజయ పాలు..లీటరు రూ.44 | Sakshi
Sakshi News home page

విజయ పాలు..లీటరు రూ.44

Published Mon, Dec 16 2019 12:51 AM

Vijaya Milk Prices Increased To Rs 44 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విజయ పాల ధర లీటరుపై రూ.2 పెరిగింది. ప్రస్తుతం విజయ పాలు లీటరుకు రూ.42 వంతున విక్రయిస్తుండగా... ఇకపై రూ.44కు విక్రయించాలని నిర్ణయించింది. పాలసేకరణ ధరలు పెరగడంతో పాల సరఫరా ధర పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(టీఎస్‌డీడీసీఎఫ్‌) ఈ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. స్టాండడైజ్‌ పాలు, హోల్‌ మిల్క్‌ ధరల్లో మార్పు లేదని, పెరిగిన ధరల నేపథ్యంలో వెండర్‌ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు పెంచినట్లు ప్రకటించింది.

పాల ధరలను తగ్గించాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్‌
సాక్షి, హైదరాబాద్‌: పెంచిన విజయ పాల ధరను వెంటనే తగ్గించాలని రాష్ట్ర బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు ప్రకటన విడుదల చేశారు. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారాన్ని, అలాగే తల్లి పాలకు దూరమైన పిల్లలు ఆధారపడే పాల ధరను పెంచితే పేద, మధ్యతరగతి పిల్లలు పాలకు దూరమవుతారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement