చెరువులో పడి ఇద్దరు బాలికల మృతి | two girls died in pond | Sakshi
Sakshi News home page

చెరువులో పడి ఇద్దరు బాలికల మృతి

Feb 15 2015 3:12 PM | Updated on Sep 17 2018 8:02 PM

చేపల వేటకు వెళ్లిన ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతి చెందారు.

వరంగల్: చేపల వేటకు వెళ్లిన ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం శేనగకుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. శేనగకుంట గ్రామానికి చెందిన మూడో తరగతి చదివే మంకిడి శృతిలయ(8), నాలుగో తరగతి చదివే యాలం శ్వేత(9)లు చెరువులో చేపల వేటకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లారు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు పిల్లలు కనిపించలేదు. దీంతో వారి ఆచూకి కోసం గాలించారు. చెరువు వైపు వెళ్లినట్లు కొంత మంది గ్రామస్థులు చెప్పారు. ఈ క్రమంలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు రాత్రి వేళ చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి చెరువులో ఇద్దరు బాలికల శవాలను గ్రామస్థులు గుర్తించారు. దీంతో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
(మంగపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement