పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం! | Tourism is the chairman of the company pervaram! | Sakshi
Sakshi News home page

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం!

Dec 29 2014 6:04 AM | Updated on Sep 2 2017 6:55 PM

తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములు నియమితులు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేర్వారం రాములు నియమితులు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాములు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతర కాలంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement