-
పరువు నష్టం దావా: కోర్టుకు రాని పేర్వారం రాములు
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డీజీపీ పేర్వారం రాములుపై మాజీ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాధవరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపిన నేపథ్యంలో రాములుపై పరువునష్టం దావా వేశారు. బుధవారం రాములును విచారణకు హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 7 శాతం వడ్డీతో రూ.75 లక్షలు చెల్లించాలని 2017లో రాములును కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, రాములు ఈ రోజు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించని కారణంగా మాజీ డీజీపీ రాములును అరెస్ట్ చేయాలని పిటీషనర్ మాధవరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు 75 ఏళ్ల వయస్సుతో ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేదని.. రాములు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఈ క్రమంలో ఇరు వాదనలు పూర్తిగా విన్న న్యాయస్థానం ఈ కేసుపై తుది తీర్పును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది. -
పేర్వారం రాములుకు మాతృవియోగం
రఘునాథపల్లి : ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ, రాష్ట్ర టూరిజం అభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ పేర్వారం రాములుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పేర్వారం వీరమ్మ (94) అనారోగ్యంతో ఆదివారం రాత్రి మం డలంలోని ఖిలాషాపూర్లో తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే నాగపూరి రాజలింగం, జనగామ మునిసిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ సేవెల్లి సంపత్లు సోమవారం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రాములును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు మారుజోడు రాంబాబు, సర్పంచ్ దొంగ అంజిరెడ్డి, మండల పరిషత్ కోఅçప్షన్ సభ్యుడు మహమూద్, నాయకులు గొరిగ రవి, మడ్లపల్లి సునీత, కోళ్ల రవిగౌడ్, బక్క నాగరాజు, ఉడుత రవి, దూడల యాదగిరి, లోనె శ్రవణ్కుమార్, దొంగ మహిపాల్రెడ్డి, కావటి రాజయ్య, అల్లిబిల్లి నర్సయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. అంతియయాత్రలో పాల్గొన్న పొన్నాల రఘునాథపల్లి: ఖిలాషాపూర్లో సోమవారం నిర్వహించిన మాజీ డీజీపీ పేర్వారం రాములు తల్లి వీరమ్మ (94) అంతిమ యాత్రలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన ఖిలాషాపూర్లో ఆమెతో చిన్ననాటి నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీరమ్మ కుమారుడు రాములుతో ఎంత సఖ్యత ఉండేదో లక్ష్మయ్యతో అంతే అభిమానంగా ఉండేది. ఉన్నత విద్యాభ్యాసం చేసినా, వృత్తి పరంగా పేర్వారం, రాజకీయంగా పొన్నాల ఏ స్థాయికి ఎదిగినా ఎప్పటిలాగే కలిసి ఉండేవారు. ఈ సందర్భంగా అంతిమ యాత్రలో పొన్నాల కొద్ది సేపు పాడె మోశారు. -
ప్రజాభీష్టం మేరకే నూతన జిల్లాలు
రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు రఘునాథపల్లి : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధవంతమైన పాలకుడని రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశ్యంతో కొందరు కేసీఆర్ నియంత అంటూ మాట్లాడుతుండడం సరికాదన్నారు. ప్రజాభీష్టం మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తున్నారని స్పష్టం చేశారు. పోరాటాలకు పురిటి గడ్డ అయిన జనగామను జిల్లాగా ఏర్పాటుచేయడం శుభపరిణామమన్నారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు మారుజోడు రాంబాబు, దశమంతరెడ్డి, లకీ‡్ష్మనారాయణ, పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, పెండ్లి మల్లారెడ్డి, చెంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు టూరిజం ఎండీ, చైర్మన్ల రాక
జమ్మికుంట రూరల్ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్ సయ్యద్ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ కంకణాల సురేందర్రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియాలు తెలిపారు. టూరిజం ఎండీ, చైర్మన్ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. . -
నేడు టూరిజం ఎండీ, చైర్మన్ల రాక
జమ్మికుంట రూరల్ : మండలంలోని ఇల్లందకుంట సీతారామ చంద్రస్వామి, బిజిగిరిషరీఫ్ సయ్యద్ ఇంకుషావళీ దర్గాలను టూరిజం ఎండీ క్రిష్టియానా, చైర్మన్ పేర్వారం రాములు సదర్శించనున్నట్లు ఇల్లందకుంట ఆలయ కమిటీ చైర్మన్ కంకణాల సురేందర్రెడ్డి, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ చోటేమియాలు తెలిపారు. టూరిజం ఎండీ, చైర్మన్ల రాకతో ఆలయం, దర్గాలు మరింత అభివృద్ధి చెందుతాయని, పర్యాటక శోభ సంతరించుకొనే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement