ఇంటి సొమ్ము.. దొంగలపాలు | Thieves steals in house at Attapur | Sakshi
Sakshi News home page

ఇంటి సొమ్ము.. దొంగలపాలు

Feb 2 2015 9:30 AM | Updated on Aug 28 2018 7:32 PM

బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఊడ్చుకెళ్లిన సంఘటన అత్తాపూర్‌లోని తేజస్వీనగర్‌లో జరిగింది.

హైదరాబాద్(అత్తాపూర్): బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఊడ్చుకెళ్లిన సంఘటన అత్తాపూర్‌లోని తేజస్వీనగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన బసవప్ప ఇంట్లో ఆదివారం రాత్రి దోంగలు పడి ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, రెండు కిలోల వెండి,టీవీ, లాప్‌టాప్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు.

బసవప్ప బీదర్ వెళ్లి తిరిగి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement